*బృహత్కధ*
పూర్వం దీపకర్ణి అనే రాజు వుండేవాడు. అతనికి చాలాకాలము సంతానము కలగలేదు. ఎన్నో పూజలూ,వ్రతాలూ, యాగాలూ చేసిన తర్వాత ఆయనకు కలలో ఒక ఆదేశం వినపడింది. రాజా! నీవు అడవి లోకి ఒక్కడివే వెళ్ళు. అక్కడ పులిమీద ఒక మూడేళ్ళ బాలుడు కనిపిస్తాడు.అతడిని తెచ్చి నీ కుమారుడిగా
పెంచుకో అని. దీపకర్ణి అడవికి వెళ్లి పులిమీద కూర్చున్న బాలుడిని తీసుకొని వచ్చి తన కుమారుడిగా ప్రకటించి వాడికి శాతవాహనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు.అతనికి యుక్త వయసు
రాగానే ఒక అందమైన రాజ కన్యక తో వివాహం జరిపించి అతనికి పట్టాభిషేకం చేసి తానూ భార్యతో సహా
వానప్రస్థానికి వెళ్లి పోయాడు.
శాతవాహనుడు ప్రజానురంజకంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు.అతని భార్య సంస్కృత పండితురాలు.రాజుకు అంత సంస్కృత పరిజ్ఞానం లేదు.ఒక రోజు రాణి తో బాటు వనవిహారానికి వెళ్లి అక్కడి చెరువులో యీత కొట్టడానికి దిగారు.రాజు చిలిపిగా అదే పనిగా రాణి ముఖం మీద నీళ్ళు చల్లసాగాడు . ఆమె తన ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ "రాజన్ మోదకైస్తా డయా" అంటే రాజా నీళ్ళతో కొట్టవద్దు అని అర్థం (మ ఉదకై: తాడయా) కానీ సంస్కృత పరిజ్ఞానం అంతగా లేని రాజు మోదకములతో(లడ్డూలతో)కోట్టమంటూ వుందని
ఒడ్డున వున్న పరిచారికలతో లడ్డూలు తెప్పించాడు.రాణి రాజా నేను నీళ్ళతో నన్ను కొట్టవద్దు అని అన్నాను.లడ్డూలతో కొట్టమని కాదు. మీకంత మాత్రం అర్థం కాలేదా?అని పక పక మని నవ్వింది..
రాజు అహానికి పెద్ద దెబ్బ తగిలింది.ఆమె ఎగతాళికి.
మరుదినం తన ఆస్థానం లో వున్న పండితు లందరినీ సమావేశ పరిచాడు.పండితులారా మీలో యెవరైనా
నాకు అతి త్వరలో సంస్కృతం నేర్పించగలరా అని అడిగాడు.గుణాఢ్యుడు అనే పండితుడు లేచి రాజా సంస్కృతం నేర్పించ డానికి ఒక సంవత్సర మైనా పడుతుంది.అన్నాడు. రాజు లేదు నాకు ఒక నెల లోపలే
నేర్పించాలి అన్నాడు. అది అసంభవం మహారాజా!అన్నాడు గుణాఢ్యుడు .ఇంకో పండితుడు శర్వవర్మ లేచి మహారాజా!నేను నేర్పించ గలను.మీకు కొంత పరిజ్ఞానము వుంది కనుక అదేమీ కష్టమైన పని కాదు.అన్నాడు.గుణాఢ్యుడు మాత్రం అది సంభవం కాదు అని వాదించాడు.యిద్దరు పండితులూ వాదించుకున్నారు.ఆఖరుకు గుణాఢ్యుడు సరే అయితే నీవు నెల లోపల రాజుకు సంస్కృతం నేర్పించ గలిగితే
నేను సంస్కృతం లోమాట్లాడడము, కావ్యాలు రాయడం కానీ మానేస్తాను. అని ప్రతిజ్ఞ చేశాడు.అలాగే అన్నాడు శర్వవర్మ. నేనుకూడానెలలోపల రాజుకు సంస్కృతము నేర్పించ లేకపోతే ఈ రాజ్యము విడిచి వెళ్ళిపోయి యింక సంస్కృతం లోమాట్లాడడము కావ్యాలు వ్రాయడం మానేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు.
శర్వవర్మ ఇంటికి వెళ్లి యోచన చేశాడు.అతనేదో గుణాఢ్యుడి పైన అసూయతో ఒక నెలలో నేర్పిస్తానని అన్నాడే కానీ అది సాధ్యము కాదని అతనికీ తెలుసు.దిగులుతో కూర్చొని వున్న అతన్ని చూసి అతని భార్య సంగతి తెలుసు కొని మీరు దేవీ ఉపాసకులు కదా! ఆ దేవిని ఉపాసన చేసి మీకు ఆ శక్తి నిమ్మని ప్రార్థించండి అని సలహా యిచ్చింది. దానికి సరే నని శర్వవర్మ దేవిని ఉపాసించి ప్రసన్నం చేసుకొన్నాడు దేవి అతనికి త్వరగా సంస్కృతం నేర్పించే శక్తిని అనుగ్రహించింది.
మంచిరోజు చూసుకొని రాజుకు సంస్కృతం నేర్పించడం ప్రారంభించాడు శర్వవర్మ.దేవి అనుగ్రహం వల్ల రాజుకు నెల లోపల సంస్కృతం క్షున్నం గా నేర్పించాడు. ప్రతిజ్ఞ ప్రకారం గుణాఢ్యుడు అడవి కి వెళ్ళిపోయాడు.
సంస్కృతం లో కావ్యాలు వ్రాయడం,మాట్లాడడం మానేశాడు.అడవిలో తిరుగుతూ పిశాచాలతో స్నేహం చేసి
వాటి భాష నేర్చుకున్నాడు. తర్వాత అతను "బృహత్కథ"అనే గ్రంథాన్ని పిశాచ భాషలో 60 లక్షల శ్లోకాలతో
వ్రాశాడు.ఆ గ్రంథాన్ని రాజుకు పంపించాడు.ఆ భాష ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవ్వరికీ అర్థం కాని గ్రంథం దేనికి పనికి వస్తుంది? అని రాజు యెగతాళి చేశాడు గుణాఢ్యుడు చాలా బాధపడి ఎవరికీ పనికి రాని గ్రంథ మెందుకు అని కట్టెలతో మంట చేసి ఒక్కో శ్లోకం చదువుతూ ఒక్కొక్క పుటను చింపి అగ్ని లో వేయ సాగాడు.అడవిలోని జంతువులన్నీ ఆ మంట చుట్టూ చేరి నిద్రాహారాలు మాని ఆ శ్లోకాలు వింటూ కన్నీరు కారుస్తున్నాయి.జంతువులన్నీ చిక్కి సగ మయ్యాయి.శాత వాహనుడి నగరం లో మాంసా హారమే కరువైంది.రాజుకు కూడా సరియైన మాంసాహారము లేక పిచ్చి పట్టి పోయింది.ఎందుకని అడిగితే సేవకులు గుణాఢ్యుడు చేస్తున్న పని గురించి,జంతువులు అక్కడే చుట్టూ మూగి కన్నీరు కారుస్తూ చిక్కి పోయిన సంగతీ
చెప్పారు.అప్పుడు శాతవాహనుడికి జంతువులను కూడా ఆకర్షించిన 'బృహత్కథ' యెంత ఉత్తమమైనదో
అర్థ మైంది. రాజూ, శర్వవర్మ యిద్దరూ అడవికి వెళ్లి గుణాఢ్యుడిని క్షమాపణ అడిగి ఆ గ్రంథాన్ని మంటల్లో వేయకుండా ఆపించారు.
గుణాఢ్యుడిని మీ ప్రతిజ్ఞ ను వెనక్కి తీసుకొని రాజ్య్యానికి వచ్చి ఆ గ్రంథాన్ని సంస్కృతం లోకి అనువదించ వలిసింది గా ప్రార్థించి ఒప్పించారు లేకుంటే అంత మంచి గ్రంథం వృథా అయి పోతుందని చెప్పి ఒప్పించారు..అగ్నికి ఆహుతి కాగా మిగిలిన దే యిప్పుడు మనకు లభించిన 'బృహత్కథ'
పూర్వం దీపకర్ణి అనే రాజు వుండేవాడు. అతనికి చాలాకాలము సంతానము కలగలేదు. ఎన్నో పూజలూ,వ్రతాలూ, యాగాలూ చేసిన తర్వాత ఆయనకు కలలో ఒక ఆదేశం వినపడింది. రాజా! నీవు అడవి లోకి ఒక్కడివే వెళ్ళు. అక్కడ పులిమీద ఒక మూడేళ్ళ బాలుడు కనిపిస్తాడు.అతడిని తెచ్చి నీ కుమారుడిగా
పెంచుకో అని. దీపకర్ణి అడవికి వెళ్లి పులిమీద కూర్చున్న బాలుడిని తీసుకొని వచ్చి తన కుమారుడిగా ప్రకటించి వాడికి శాతవాహనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు.అతనికి యుక్త వయసు
రాగానే ఒక అందమైన రాజ కన్యక తో వివాహం జరిపించి అతనికి పట్టాభిషేకం చేసి తానూ భార్యతో సహా
వానప్రస్థానికి వెళ్లి పోయాడు.
శాతవాహనుడు ప్రజానురంజకంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు.అతని భార్య సంస్కృత పండితురాలు.రాజుకు అంత సంస్కృత పరిజ్ఞానం లేదు.ఒక రోజు రాణి తో బాటు వనవిహారానికి వెళ్లి అక్కడి చెరువులో యీత కొట్టడానికి దిగారు.రాజు చిలిపిగా అదే పనిగా రాణి ముఖం మీద నీళ్ళు చల్లసాగాడు . ఆమె తన ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ "రాజన్ మోదకైస్తా డయా" అంటే రాజా నీళ్ళతో కొట్టవద్దు అని అర్థం (మ ఉదకై: తాడయా) కానీ సంస్కృత పరిజ్ఞానం అంతగా లేని రాజు మోదకములతో(లడ్డూలతో)కోట్టమంటూ వుందని
ఒడ్డున వున్న పరిచారికలతో లడ్డూలు తెప్పించాడు.రాణి రాజా నేను నీళ్ళతో నన్ను కొట్టవద్దు అని అన్నాను.లడ్డూలతో కొట్టమని కాదు. మీకంత మాత్రం అర్థం కాలేదా?అని పక పక మని నవ్వింది..
రాజు అహానికి పెద్ద దెబ్బ తగిలింది.ఆమె ఎగతాళికి.
మరుదినం తన ఆస్థానం లో వున్న పండితు లందరినీ సమావేశ పరిచాడు.పండితులారా మీలో యెవరైనా
నాకు అతి త్వరలో సంస్కృతం నేర్పించగలరా అని అడిగాడు.గుణాఢ్యుడు అనే పండితుడు లేచి రాజా సంస్కృతం నేర్పించ డానికి ఒక సంవత్సర మైనా పడుతుంది.అన్నాడు. రాజు లేదు నాకు ఒక నెల లోపలే
నేర్పించాలి అన్నాడు. అది అసంభవం మహారాజా!అన్నాడు గుణాఢ్యుడు .ఇంకో పండితుడు శర్వవర్మ లేచి మహారాజా!నేను నేర్పించ గలను.మీకు కొంత పరిజ్ఞానము వుంది కనుక అదేమీ కష్టమైన పని కాదు.అన్నాడు.గుణాఢ్యుడు మాత్రం అది సంభవం కాదు అని వాదించాడు.యిద్దరు పండితులూ వాదించుకున్నారు.ఆఖరుకు గుణాఢ్యుడు సరే అయితే నీవు నెల లోపల రాజుకు సంస్కృతం నేర్పించ గలిగితే
నేను సంస్కృతం లోమాట్లాడడము, కావ్యాలు రాయడం కానీ మానేస్తాను. అని ప్రతిజ్ఞ చేశాడు.అలాగే అన్నాడు శర్వవర్మ. నేనుకూడానెలలోపల రాజుకు సంస్కృతము నేర్పించ లేకపోతే ఈ రాజ్యము విడిచి వెళ్ళిపోయి యింక సంస్కృతం లోమాట్లాడడము కావ్యాలు వ్రాయడం మానేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు.
శర్వవర్మ ఇంటికి వెళ్లి యోచన చేశాడు.అతనేదో గుణాఢ్యుడి పైన అసూయతో ఒక నెలలో నేర్పిస్తానని అన్నాడే కానీ అది సాధ్యము కాదని అతనికీ తెలుసు.దిగులుతో కూర్చొని వున్న అతన్ని చూసి అతని భార్య సంగతి తెలుసు కొని మీరు దేవీ ఉపాసకులు కదా! ఆ దేవిని ఉపాసన చేసి మీకు ఆ శక్తి నిమ్మని ప్రార్థించండి అని సలహా యిచ్చింది. దానికి సరే నని శర్వవర్మ దేవిని ఉపాసించి ప్రసన్నం చేసుకొన్నాడు దేవి అతనికి త్వరగా సంస్కృతం నేర్పించే శక్తిని అనుగ్రహించింది.
మంచిరోజు చూసుకొని రాజుకు సంస్కృతం నేర్పించడం ప్రారంభించాడు శర్వవర్మ.దేవి అనుగ్రహం వల్ల రాజుకు నెల లోపల సంస్కృతం క్షున్నం గా నేర్పించాడు. ప్రతిజ్ఞ ప్రకారం గుణాఢ్యుడు అడవి కి వెళ్ళిపోయాడు.
సంస్కృతం లో కావ్యాలు వ్రాయడం,మాట్లాడడం మానేశాడు.అడవిలో తిరుగుతూ పిశాచాలతో స్నేహం చేసి
వాటి భాష నేర్చుకున్నాడు. తర్వాత అతను "బృహత్కథ"అనే గ్రంథాన్ని పిశాచ భాషలో 60 లక్షల శ్లోకాలతో
వ్రాశాడు.ఆ గ్రంథాన్ని రాజుకు పంపించాడు.ఆ భాష ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవ్వరికీ అర్థం కాని గ్రంథం దేనికి పనికి వస్తుంది? అని రాజు యెగతాళి చేశాడు గుణాఢ్యుడు చాలా బాధపడి ఎవరికీ పనికి రాని గ్రంథ మెందుకు అని కట్టెలతో మంట చేసి ఒక్కో శ్లోకం చదువుతూ ఒక్కొక్క పుటను చింపి అగ్ని లో వేయ సాగాడు.అడవిలోని జంతువులన్నీ ఆ మంట చుట్టూ చేరి నిద్రాహారాలు మాని ఆ శ్లోకాలు వింటూ కన్నీరు కారుస్తున్నాయి.జంతువులన్నీ చిక్కి సగ మయ్యాయి.శాత వాహనుడి నగరం లో మాంసా హారమే కరువైంది.రాజుకు కూడా సరియైన మాంసాహారము లేక పిచ్చి పట్టి పోయింది.ఎందుకని అడిగితే సేవకులు గుణాఢ్యుడు చేస్తున్న పని గురించి,జంతువులు అక్కడే చుట్టూ మూగి కన్నీరు కారుస్తూ చిక్కి పోయిన సంగతీ
చెప్పారు.అప్పుడు శాతవాహనుడికి జంతువులను కూడా ఆకర్షించిన 'బృహత్కథ' యెంత ఉత్తమమైనదో
అర్థ మైంది. రాజూ, శర్వవర్మ యిద్దరూ అడవికి వెళ్లి గుణాఢ్యుడిని క్షమాపణ అడిగి ఆ గ్రంథాన్ని మంటల్లో వేయకుండా ఆపించారు.
గుణాఢ్యుడిని మీ ప్రతిజ్ఞ ను వెనక్కి తీసుకొని రాజ్య్యానికి వచ్చి ఆ గ్రంథాన్ని సంస్కృతం లోకి అనువదించ వలిసింది గా ప్రార్థించి ఒప్పించారు లేకుంటే అంత మంచి గ్రంథం వృథా అయి పోతుందని చెప్పి ఒప్పించారు..అగ్నికి ఆహుతి కాగా మిగిలిన దే యిప్పుడు మనకు లభించిన 'బృహత్కథ'
No comments:
Post a Comment