శ్రీరాముడే భారతీయుల అంతరాత్మ;
తండ్రితో రాముడు;
నీవు అరణ్యాలకి వెళ్ళాలని చెప్పడానికి దశరధ మహారాజు సంశయిస్తున్నాడని చెప్పిన కైకేయితో..రాముడు " అమ్మా!నా తండ్రిగారి ఆజ్ఞ్య ఏదైనప్పటికీ నేను అగ్నిలో దూకవలసి వచ్చినప్పటికీ మారు మాట్లాడకుండా నెరవేరుస్తాను..ఐతే తండ్రి గారే స్వయంగా ఆదేశం ఇవ్వకపోవడం నాకు దుఖం కలిగిస్తున్నది.."
సోదరబందం;
లక్ష్మణుడు రాముని దైవ సమానంగా భావిస్తే ..రాముడు కూడా లక్ష్మణుడు తోడు లేకుండా తినటానికి గాని, నిద్రించడానికి కూడా సమ్మతించేవాడు కాదు..
గురువుతో రాముడు;
శివధనుర్బంగం చేయడానికి ప్రగల్బాలు పలుకుతూ వచ్చిన వీరాధి వీరులందరూ విఫలమౌతున్నారు..
శివధనస్సు ని అవలీలగా ఎక్కుపెట్టగల సామర్ద్యమున్న రాముడు మాత్రం గురువు ఆదేశం వచ్చిన మీదటనే గురువుగారి ఆశీర్వాదం తీసుకుని ధనుర్భంగం చేశాడు..
భార్య గురించి రాముడు;
అరణ్యవాసంలో ఉండగా సీత అపహరించబడినప్పుడు రాముడు లక్ష్మణునితో "సీత కనుక మరణించినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను..ఆమె లేకుండా జీవించడం అనే ఆలోచన కూడా భరించలేను. అయ్యో లక్ష్మణా! సీతను రక్షణ లేకుండా వదిలి వచ్చి నన్ను ఎలా మోసగించావయ్యా?"..
మిత్రుడితో రాముడు;
సుగ్రీవుడు తన కష్టాలన్నీ రాముడితో చెప్పుకున్నప్పుడు రాముడు "సేవయే స్నేహానికి నిజమైన ఫలం. నీరాజ్యాన్ని, భార్యను తిరిగి పొందడంలో నీకు సహాయం చేయడం నా విధి."
భక్తునితో రాముడు;
సముద్రాన్ని దాటి సీతజాడ కనిపెట్టి ఆమె క్షేమ సమాచారాన్ని హనుమంతుడు రామునికి తెలియచేసినప్పుడు రాముడు " ప్రియ హనుమంతా ! నీవు సీత జాడ కనిపెట్టి నాకు అమితానందాన్ని కలిగించావు..అందుకు ప్రతిగా నీకు సముచితమైన బహుమానం ఇవ్వడానికి నేను ఇప్పుడు ప్రవాస జీవితం గడుపుతున్నందున నీకు నా ఆలింగనాన్ని మాత్రమే ఇవ్వగలను" అంటూ ప్రేమాభిమానాలతో హనుమంతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు..
శత్రువుతో రాముడు;
రావణుడు రాముడుకి ఎదురుపడిన మొదటిరోజున రాముడు అతని ధ్వజాన్ని విరిచి, రధాన్ని కూల్చి, రావణుడుని తీవ్రంగా గాయపరిచాడు..నిస్సహాయ స్థితిలో ఉన్న రావణుడితో "ఉదయం నుంచి యుద్ధం చేయడం వల్ల బాగా అలసిపోయి ఉన్నావు..నిరాయుదుడివై ఉన్నావు..ఈ స్థితిలో నిన్ను సంహరించలేను.
నీవు లంకకు తిరిగి వెళ్లి విశ్రాంతి తీసుకో.బాగా కోలుకుని శక్తిని పుంజుకున్న మీదట నీతో యుద్ధం చేస్తాను" అన్నాడు..
రాముడు నేను దైవాన్నని ఎప్పుడూ చెప్పుకోలేదు. నరుడినని చెప్తూ మానవజాతికి విశేషమైన గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టినందుకు మొత్తం మానవజాతి అంతా ఆయనకి ఋణపడి పోయింది.
భవసాగరాన్ని దాటాలనుకునేవారికి దివ్యౌషదం "శ్రీరామ" నామామృతం..
"శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష"
తండ్రితో రాముడు;
నీవు అరణ్యాలకి వెళ్ళాలని చెప్పడానికి దశరధ మహారాజు సంశయిస్తున్నాడని చెప్పిన కైకేయితో..రాముడు " అమ్మా!నా తండ్రిగారి ఆజ్ఞ్య ఏదైనప్పటికీ నేను అగ్నిలో దూకవలసి వచ్చినప్పటికీ మారు మాట్లాడకుండా నెరవేరుస్తాను..ఐతే తండ్రి గారే స్వయంగా ఆదేశం ఇవ్వకపోవడం నాకు దుఖం కలిగిస్తున్నది.."
సోదరబందం;
లక్ష్మణుడు రాముని దైవ సమానంగా భావిస్తే ..రాముడు కూడా లక్ష్మణుడు తోడు లేకుండా తినటానికి గాని, నిద్రించడానికి కూడా సమ్మతించేవాడు కాదు..
గురువుతో రాముడు;
శివధనుర్బంగం చేయడానికి ప్రగల్బాలు పలుకుతూ వచ్చిన వీరాధి వీరులందరూ విఫలమౌతున్నారు..
శివధనస్సు ని అవలీలగా ఎక్కుపెట్టగల సామర్ద్యమున్న రాముడు మాత్రం గురువు ఆదేశం వచ్చిన మీదటనే గురువుగారి ఆశీర్వాదం తీసుకుని ధనుర్భంగం చేశాడు..
భార్య గురించి రాముడు;
అరణ్యవాసంలో ఉండగా సీత అపహరించబడినప్పుడు రాముడు లక్ష్మణునితో "సీత కనుక మరణించినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను..ఆమె లేకుండా జీవించడం అనే ఆలోచన కూడా భరించలేను. అయ్యో లక్ష్మణా! సీతను రక్షణ లేకుండా వదిలి వచ్చి నన్ను ఎలా మోసగించావయ్యా?"..
మిత్రుడితో రాముడు;
సుగ్రీవుడు తన కష్టాలన్నీ రాముడితో చెప్పుకున్నప్పుడు రాముడు "సేవయే స్నేహానికి నిజమైన ఫలం. నీరాజ్యాన్ని, భార్యను తిరిగి పొందడంలో నీకు సహాయం చేయడం నా విధి."
భక్తునితో రాముడు;
సముద్రాన్ని దాటి సీతజాడ కనిపెట్టి ఆమె క్షేమ సమాచారాన్ని హనుమంతుడు రామునికి తెలియచేసినప్పుడు రాముడు " ప్రియ హనుమంతా ! నీవు సీత జాడ కనిపెట్టి నాకు అమితానందాన్ని కలిగించావు..అందుకు ప్రతిగా నీకు సముచితమైన బహుమానం ఇవ్వడానికి నేను ఇప్పుడు ప్రవాస జీవితం గడుపుతున్నందున నీకు నా ఆలింగనాన్ని మాత్రమే ఇవ్వగలను" అంటూ ప్రేమాభిమానాలతో హనుమంతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు..
శత్రువుతో రాముడు;
రావణుడు రాముడుకి ఎదురుపడిన మొదటిరోజున రాముడు అతని ధ్వజాన్ని విరిచి, రధాన్ని కూల్చి, రావణుడుని తీవ్రంగా గాయపరిచాడు..నిస్సహాయ స్థితిలో ఉన్న రావణుడితో "ఉదయం నుంచి యుద్ధం చేయడం వల్ల బాగా అలసిపోయి ఉన్నావు..నిరాయుదుడివై ఉన్నావు..ఈ స్థితిలో నిన్ను సంహరించలేను.
నీవు లంకకు తిరిగి వెళ్లి విశ్రాంతి తీసుకో.బాగా కోలుకుని శక్తిని పుంజుకున్న మీదట నీతో యుద్ధం చేస్తాను" అన్నాడు..
రాముడు నేను దైవాన్నని ఎప్పుడూ చెప్పుకోలేదు. నరుడినని చెప్తూ మానవజాతికి విశేషమైన గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టినందుకు మొత్తం మానవజాతి అంతా ఆయనకి ఋణపడి పోయింది.
భవసాగరాన్ని దాటాలనుకునేవారికి దివ్యౌషదం "శ్రీరామ" నామామృతం..
"శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష"
No comments:
Post a Comment