ఈమధ్య సామాజిక మాధ్యమాలలో ఒక దౌర్భాగ్యపు పోస్ట్ సంచరిస్తోంది. దాని సారాంశం ఏమిటంటే ఒక చిన్న పిల్ల తనకు రాముడిలాంటి సోదరుడు వద్దని, రావణుని లాంటి సోదరుడే అయితే తనని రక్షిస్తాడని, రామునిలా బాధలకు గురిచేయ్యడని సమర్ధిస్తూ, రాముని వలన సీత ఎన్నో ఇక్కట్లు పడిందని.
అసలు నిజంగా రావణుడు అంత గొప్ప సోదరుడా అని ఒకసారి ఆలోచిస్తే అతని గురించి మరిన్ని వివరాలు రామాయణం ఉత్తరకాండలో చెబుతారు.
దశగ్రీవుడు లంకనుండి తన అన్నగారైన కుబేరుని తరిమేసి ఆ రాజ్యానికి అభిషిక్తుడయ్యాక తన సోదరి వికృత రూపిణి అయిన శూర్పణఖను కాలక రాక్షసుని పుత్రుడయిన విద్యుజ్జిహ్వునికి ఇచ్చి వివాహం చేసాడు. కొన్నాళ్ళకు దశకంఠడు దేవతలను, మానవ రాజులను వశపరుచుంటూ వరుణుని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్తూఉంటాడు. దారిలో నాగజాతివారిని ఓడించి మణిపురానికి వెళ్తాడు. అక్కడున్న దైత్యులతో సంధి చేసుకుని కాలకేయులను చంపి తన వారైన రాక్షసులను తింటున్న స్వంత బావమరిది అయిన శూర్పణఖభర్త విద్యుజ్జిహ్వుని తన కత్తితో ఖండించివేస్తాడు. విజయగర్వంతో లంకకు చేరగా శూర్పణఖ తన అన్నను రకరకాల మాటలు అంటుంది. సోదరి భర్తను కూడా కనికరించకుండా విధవను చేసినవాడు తన మానమర్యాదలను మంటగలిపి తన జీవితాన్ని నాశనం చేసావని, అలా చేసి తన బహిర్ప్రాణమైన భర్తను చంపి తనను కూడా మృతురాలిని చేసావు అని నిందిస్తుంది. అప్పుడు ఏవో మాటలు చెప్పి మాయచేసి ఊరడింపచేసి తన పినతల్లి కుమారుడైన ఖరుని సంరక్షణలో దండకారణ్యానికి 14000 మంది రాక్షసులతోడ పంపుతాడు. అక్కడ ఆ రక్కసి తనకు కావలసినది తింటూ, కావలసిన వారితో పొందు కోరుతూ జీవిస్తూ ఉంటుంది. ఇదండీ రావణుని సోదరిప్రేమ.
అదే సోదరి రాముని చూసి మోహించి లక్ష్మణునిచే ముక్కు చెవులు కోయించుకుని ఏడుస్తూ అన్నదగ్గరకు వచ్చి అతడిని నానా దుర్భాషలాడి, సీత మాత అందచందాలు పొగిడి ఆవిడకు నువ్వే భర్త అవ్వదగినవాడవు అని సీతమీద మోహం ప్రజ్వలింపచేస్తుంది. అదే రావణుడు సీతను అపహరించడానికి నిశ్చయించుకున్నాడు. పరదారాపహరణం ధర్మం కాదని తెలిసి కూడా వెళ్లి వాడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. మనం పిల్లలకు నేర్పవలసింది ధర్మం, న్యాయం, సత్యం లాంటి మంచి లక్షణాలు. కానీ అన్ని రకాలుగా భ్రష్టుపట్టిన ఒక రాక్షసుని తెంపరితనాన్ని గొప్పగా పొగుడుతూ అతడు చేసిన మహాపరాధాలను గొప్పగా ప్రచారం చేస్తున్న ఒక జాతికి చెందినా అధములకు, పూర్తిగా అవగాహన లేకుండా అటువంటి వాటిని పంచుతున్న మనకు తేడా ఏముంటుంది. రాముడంటే ధర్మం. రాముడంటే న్యాయం. రాముడంటే సత్యం. రాముడంటే ప్రేమ. రాముడంటే దయ. ఇటువంటి గొప్ప లక్షణాలు కనబడవా? రామో విగ్రహవాన్ ధర్మః. ఆయన ధర్మాన్ని ఆచరించి మనకు మార్గదర్శనం చేసాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. పడినా కూడా ధర్మాన్ని పట్టుకుంటే ఎలా విజయం లభిస్తుందో నిరూపించి ఆదర్శవంతుడు అయ్యాడు. ఆయన ఏమి చేసినా ధర్మ పరిరక్షణ కోసమూ, లోకానికి ఒక సందేశం ఇవ్వడం కోసమూ తప్ప తనకోసం ఏమీ చెయ్యలేదు. ఆయనకూ రావణునికి పోలిక పెట్టడం అన్నది అసలు ఊహకు అందని విషయం. ఒకరు మూర్తీభవించిన దైవమైతే మరొకడు దిగజారుడుతనానికి, తెంపరితనానికి, మూర్ఖత్వానికి, స్వార్ధానికి, లౌల్యానికి ప్రతీక.
ఏదైనా సందేశం వచ్చినప్పుడు ఒక్కసారి మన ధర్మాన్ని గుర్తు చేసుకుని దానిలో చెప్పినది ఎంతవరకు నిజం, దానిలో చెప్పినది ధర్మమా? న్యాయమా అని ఆలోచించి మరొకరికి పంపండి, తప్ప అనాలోచితంగా పంపే ఇటువంటి సందేశాల వల్ల నిజం తెలియని ఎంతో మంది అదే నిజమని నమ్మి భ్రష్టులు అయిపోయే ప్రమాదం వుంది. తస్మాత్ జాగ్రత్త !!!
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
అసలు నిజంగా రావణుడు అంత గొప్ప సోదరుడా అని ఒకసారి ఆలోచిస్తే అతని గురించి మరిన్ని వివరాలు రామాయణం ఉత్తరకాండలో చెబుతారు.
దశగ్రీవుడు లంకనుండి తన అన్నగారైన కుబేరుని తరిమేసి ఆ రాజ్యానికి అభిషిక్తుడయ్యాక తన సోదరి వికృత రూపిణి అయిన శూర్పణఖను కాలక రాక్షసుని పుత్రుడయిన విద్యుజ్జిహ్వునికి ఇచ్చి వివాహం చేసాడు. కొన్నాళ్ళకు దశకంఠడు దేవతలను, మానవ రాజులను వశపరుచుంటూ వరుణుని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్తూఉంటాడు. దారిలో నాగజాతివారిని ఓడించి మణిపురానికి వెళ్తాడు. అక్కడున్న దైత్యులతో సంధి చేసుకుని కాలకేయులను చంపి తన వారైన రాక్షసులను తింటున్న స్వంత బావమరిది అయిన శూర్పణఖభర్త విద్యుజ్జిహ్వుని తన కత్తితో ఖండించివేస్తాడు. విజయగర్వంతో లంకకు చేరగా శూర్పణఖ తన అన్నను రకరకాల మాటలు అంటుంది. సోదరి భర్తను కూడా కనికరించకుండా విధవను చేసినవాడు తన మానమర్యాదలను మంటగలిపి తన జీవితాన్ని నాశనం చేసావని, అలా చేసి తన బహిర్ప్రాణమైన భర్తను చంపి తనను కూడా మృతురాలిని చేసావు అని నిందిస్తుంది. అప్పుడు ఏవో మాటలు చెప్పి మాయచేసి ఊరడింపచేసి తన పినతల్లి కుమారుడైన ఖరుని సంరక్షణలో దండకారణ్యానికి 14000 మంది రాక్షసులతోడ పంపుతాడు. అక్కడ ఆ రక్కసి తనకు కావలసినది తింటూ, కావలసిన వారితో పొందు కోరుతూ జీవిస్తూ ఉంటుంది. ఇదండీ రావణుని సోదరిప్రేమ.
అదే సోదరి రాముని చూసి మోహించి లక్ష్మణునిచే ముక్కు చెవులు కోయించుకుని ఏడుస్తూ అన్నదగ్గరకు వచ్చి అతడిని నానా దుర్భాషలాడి, సీత మాత అందచందాలు పొగిడి ఆవిడకు నువ్వే భర్త అవ్వదగినవాడవు అని సీతమీద మోహం ప్రజ్వలింపచేస్తుంది. అదే రావణుడు సీతను అపహరించడానికి నిశ్చయించుకున్నాడు. పరదారాపహరణం ధర్మం కాదని తెలిసి కూడా వెళ్లి వాడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. మనం పిల్లలకు నేర్పవలసింది ధర్మం, న్యాయం, సత్యం లాంటి మంచి లక్షణాలు. కానీ అన్ని రకాలుగా భ్రష్టుపట్టిన ఒక రాక్షసుని తెంపరితనాన్ని గొప్పగా పొగుడుతూ అతడు చేసిన మహాపరాధాలను గొప్పగా ప్రచారం చేస్తున్న ఒక జాతికి చెందినా అధములకు, పూర్తిగా అవగాహన లేకుండా అటువంటి వాటిని పంచుతున్న మనకు తేడా ఏముంటుంది. రాముడంటే ధర్మం. రాముడంటే న్యాయం. రాముడంటే సత్యం. రాముడంటే ప్రేమ. రాముడంటే దయ. ఇటువంటి గొప్ప లక్షణాలు కనబడవా? రామో విగ్రహవాన్ ధర్మః. ఆయన ధర్మాన్ని ఆచరించి మనకు మార్గదర్శనం చేసాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. పడినా కూడా ధర్మాన్ని పట్టుకుంటే ఎలా విజయం లభిస్తుందో నిరూపించి ఆదర్శవంతుడు అయ్యాడు. ఆయన ఏమి చేసినా ధర్మ పరిరక్షణ కోసమూ, లోకానికి ఒక సందేశం ఇవ్వడం కోసమూ తప్ప తనకోసం ఏమీ చెయ్యలేదు. ఆయనకూ రావణునికి పోలిక పెట్టడం అన్నది అసలు ఊహకు అందని విషయం. ఒకరు మూర్తీభవించిన దైవమైతే మరొకడు దిగజారుడుతనానికి, తెంపరితనానికి, మూర్ఖత్వానికి, స్వార్ధానికి, లౌల్యానికి ప్రతీక.
ఏదైనా సందేశం వచ్చినప్పుడు ఒక్కసారి మన ధర్మాన్ని గుర్తు చేసుకుని దానిలో చెప్పినది ఎంతవరకు నిజం, దానిలో చెప్పినది ధర్మమా? న్యాయమా అని ఆలోచించి మరొకరికి పంపండి, తప్ప అనాలోచితంగా పంపే ఇటువంటి సందేశాల వల్ల నిజం తెలియని ఎంతో మంది అదే నిజమని నమ్మి భ్రష్టులు అయిపోయే ప్రమాదం వుంది. తస్మాత్ జాగ్రత్త !!!
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
No comments:
Post a Comment