Tuesday, 3 October 2017

డి. యస్. భార్గవ అనే భారతీయ environmental engineer/professor of hydrology తన జీవితకాలాన్ని మొత్తం గంగ యొక్క అద్భుతమైన శక్తిని గురించి పరిశోధించడానికే అంకితం చేశారు. గంగకు తనను తాను ప్రక్షాళణ చేసుకునే శక్తి మిగితా నదులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని తన 3 ఏళ్ళ పరిశోధనలో తేల్చారు. మిగితా నదులతో పోలిస్తే గంగ తన బయోకెమికల్ ఆక్సిజెన్ డిమాండ్ స్థాయిని అత్యంత వేగంగా తగ్గించగలదని, ఇతర నదులకంటే 15 నుంచి 20 రెట్ల వేగంగా తనలో కలిసిన వ్యర్ధాలను తొలగించుకోగలదని ఆయన పరిశోధనలో తేలింది.

న్యూడిల్లీ మలేరియా పరిశోధన కేంద్రం వారు ఇతర నది జలాలు దోమల పునరుత్పత్తికి దోహదపడతాయి. కాని గంగానది ఎగువజలాలు మాత్రం దోమల పునరుత్పత్తి ఉండదు. అక్కడ దోమలు పునరుత్పత్తి కాకుండా నిరోదిస్తుంది గంగమ్మ తల్లి జలం. అంతేకాదు! ఇతర జలాల్లో గంగా జలాలను కలిపితే ఆ నీరు కూడా దోమల పునరుత్పత్తిని నిరోదిస్తుంది.

ప్రధానంగా 2 చెబుతున్నారు పరిశోధకులు.

1) గంగలో బ్యాక్టీరియోఫేజ్ (Bacteriophage) ఉండడం వలన అది సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.

2) శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని కారణం/ శక్తి గంగానదిలో ఉండడం వలన, అది వాతావరణంలో ఉన్న ఆక్సిజెన్ ను తీసుకునేందుకు అసాధారణమైన సామర్ధ్యాన్ని ఇస్తోంది. దీనినే Mystery Factor/Mystery X Factor అని పిలుస్తున్నారు.

బ్యాక్టీరియోఫేజ్ అంటే బ్యాక్టీరియను చంపే వైరసులు. ఏ విధంగానైతే పిల్లి ఎలుకను తింటుందో, అదే విధంగా ఈ వైరస్లు బ్యాక్టీరియాలని నాశనం చేస్తాయి. నిజానికి హాంకిన్, 1896 లో గంగ యొక్క యాంటి-బ్యాక్టీరియల్ లక్షణం గురించి ఒక నివేదిక ఇచ్చారు. అదే ఆధునికకాలంలో బ్యాక్టీరియోఫేజ్ గురించి చెప్పిన తొలి డాక్యుమెంటేషన్. హెరెల్ల్ గంగ యొక్క ఈ విశిష్టవంతమైన లక్షణాన్ని గమనించి, గంగలో ఉన్న ఈ వైరస్ బ్యాక్టీరియోఫేజే అని చెప్పారు.

గంగాజలంలో ఆక్సిజేన్ స్థాయులు అధికంగా ఉండడమే చేతనే గంగ నీరు సుదీర్ఘకాలం పాటు తాజాగా ఉంటాయి. గంగ నీటిని ఇతర జలాలకు తగినంత మోతాదులో కలిపినప్పుడు, ఇతర జలాల్లోకి ఈ బ్యాక్టీరియోఫేజ్ వ్యాపించి,ఆ నీటిని కూడా శుద్ధి చేస్తుంది. దానిలో ఉన్న క్రిములను సమూలంగా నాశనం చేస్తుంది. అందుకే పురాతన హిందువులు, గంగాజలాన్ని తమతో పాటు తమ స్వస్థలాలకు తీసుకువెళ్ళి, అక్కడ ఉన్న జలవనరులలో కలిపేవారు. అదే ఈరోజు కూడా ఆచరిస్తున్నాం కాని మనకు కారణం తెలియదు, అవి కలపడం వలన కలిగే ప్రయోజనం కూడా తెలియదు.

ఇంకా చెప్పాలంటే, బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులకు యాంటి-బ్యాక్టీరియల్ ఔషధం గంగాజలం. ఈ నీటిని వాడేవారు కనుకే పురాతన హిందువులు ఎటువంటి యాంటి-బయోటిక్ మందులు వాడకున్నా, ఏ రోగం లేకుండా జీవితాంతం సుఖంగా గడిపేవారు. అతి తక్కువ పరిశోధనలు జరుగునప్పటికి, ఈ నీటిని బ్యాక్టీరియోఫేజ్ థెరపికి ఉపయోగించవచ్చని పరిశోధకుల అంటున్నారు. ఇటువంటి పరిశోధనలు సోవియట్ యూనియన్ లో చాలా ఎక్కువగా జరిగాయి. ఎందుకంటే హెరెల్ల్ గంగానది యొక్క బ్యాక్టీరియోఫేజ్ నే ప్రపంచానికి పరిచయం చేశాక, రష్యాలో ఆయన పేరు మీద ఒక పరిశోధన సంస్థ కూడా ఏర్పడింది.

నేడు అనేక హానికారక బ్యాక్టీరియ యాంటి-బయోటిక్స్ ను తట్టుకుని నిలబడే సామర్ధ్యం పొందాయి.

ప్రపంచంలో చాలా యాంటి-బయోటిక్స్ విఫలమవుతున్నాయి. అందువల్ల ప్రజలలో రోగనిరోధకత క్షీణించి, వారి చికిత్స చేయడం కూడా వైద్యులకు చాలా సంక్లిష్టంగా మారుతోంది. మానవజాతి యాంటి-బయోటిక్స్ కి పూర్వం ఉన్న శకంలోనికి వెళ్ళిపోతోందనే ఆందోళన మొదలైంది. అత్యవసరంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అభివృద్ధి చేయడమే అతి ముఖ్యమైన అంశాలుగా ఆధునిక వైద్యము, బయోటెక్నాలజి రంగాలు కృషి చేస్తున్నాయి...

ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో గంగ నీటితో యాంటి-బయోటిక్ ను తయారుచేసి ఔషధంగా కనుక ఇస్తే కనుక ప్రజలు ఏ రోగం లేకుండా, మందులు వాడకుండా హాయిగా బ్రతకవచ్చని గంగ నది మీద పరిశోధనలు చేసిన అనేక మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు తెగేసిచెప్తున్నారు. ఇంత గొప్పది మన గంగమ్మ. ఇన్ని విశిష్టవంతమైన లక్షణాలు మన గంగమ్మ తల్లికే సొంతం. ఇది హిందువులకు, భారతదేశానికి గర్వకారణం.

మన గంగమ్మ గురించి ఆధునికకాలంలో జరిగిన పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?

గత 50 సంవత్సరాల క్రితం నమోదైన పరిశోధనా వివరాల ప్రకారం, కలుషిత జలాల్లో కేవలం కొన్ని చుక్కల గంగాజలం చేరిస్తే కలుషిత జలాలు పరిశుభ్రమై, రోగకారక క్రిములను నాశనం చేసేవి. అందుకే మన హిందువులు గంగాతీరంలో ఉన్న తీర్ధయాత్రలకు వెళ్ళినప్పుడు తప్పకుండా, గంగాజలం తీసుకువచ్చి నలుగురికి పంచుతారు. పురాణాల్లో కూడా మన అనేక కధలు కనిపిస్తాయి. ఎందరో రాజు ఎంతో ధనం ఖర్చు పెట్టి పట్టాభీషేకాలకు, ఇతర పూజా కార్యక్రమాలలో వాడడం కోసం గంగా జలం తెప్పించుకునేవారు. ఈరోజుకి కూడా అనేకమంది హిందువులు పవిత్రకార్యక్రమాల్లో వాడేందుకు గంగాజలం తెప్పించుకుంటున్నారు.మనవేవి మూడనమ్మకాలు కావు. మనకు తెలియనంత మాత్రాన మన ఆచారసంప్రదాయాలను కించపరచకండి.

గంగకు ప్రత్యేకతకు కారణం దానిలో ఉన్న బ్యాక్టీరియోఫేజ్. అది ఎంతో శక్తివంతమైనది. గంగోత్రిలో మొదలై, గంగాసాగరం వరకు ఇది గంగలో చేరిన మొత్తం క్రిములను సమూలంగా నాశనం చేసి, గంగను శుద్ధి చేస్తుంది. అది కూడా కేవలం 24 గంటల్లోనే 2525 కిలోమీటర్ల గంగ పరిశుద్ధమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలా శుద్ధి చేశాక ఈ బ్యాక్టీరియోఫేజ్ ఆనవాళ్ళు కూడా గంగలో కనిపించవు. కాని ఇదంతా 50 ఏళ్ళ క్రితం మాట అంటారు గంగ మీద పరిశోధన చేసిన రమేష్ చంద్ర గారు.

అందుకంటే గంగా ప్రవాహాన్ని అడ్డుకునే డ్యాములు వంటి వాటి వలన ఈ బ్యాక్టీరియోఫేజ్ క్రింది ప్రాంతానికి అంత వేగం వ్యాపించటంలేదు. ఈ ప్రైక్రియా కాస్త నెమ్మదించింది. మరి ఇన్ని కోట్లమంది గంగలో స్నానం చేస్తుంటే గంగ కలుషితం కాదా? గంగలో స్నానం చేయడం వలన అంటువ్యాధులు రావా?

ఈ పవిత్ర కుంభమేళా సమయంలో 10 కోట్ల మంది భక్తజనం త్రివేణిసంగమంలో పవిత్రస్నానం చేస్తారని అంచనా. ఇన్ని కోట్ల మంది త్రివేణి సంగమమనే ఒక చిన్న ప్రదేశంలో స్నానం చేస్తే కొత్త రోగాలు వ్యాపించవా?
మనం గతభాగాలలో చెప్పుకున్నాం. గంగలో బ్యాక్టీరియోఫేజ్ ఉందని. దాని ప్రభావాల గురించి విపులంగా తెలుసుకున్నాం. బ్యాక్టీరియోఫేజ్ మానవ వ్యర్ధాలు, వారి శరీరం నుండి వచ్చే క్రిముల మీద ఆధారపడి జీవిస్తాయి. మానవులు నదిలో స్నానం చేసినప్పుడు వారి శరీరం నుండి నదిలో కలిసే క్రిములు వీటికి ఆహరం. ఎంత ఎక్కువమంది స్నానం చేస్తే అంత ఎక్కువగా ఈ బ్యాక్టీరియోఫేజ్ ఉద్భవిస్తాయి. అందుకే కుంభమేళా, పవిత్ర దినాలు, పండుగ రోజుల్లో కోట్లాది మంది గంగలో స్నానం చేసినా ఒక్క అంటువ్యాధి కూడా వ్యాపించదు. ఆ నీరు కూడా కలుషితం కాదు. వినడానికి వింతగానే ఉన్నా ఎంత ఎక్కువమంది స్నానం చేస్తే గంగ అంత పరిశుద్ధమవుతోంది అని గంగ మీద పరిశోధనలు జరిపిన వారు చెప్పే మాట.

అంతేకాదు మరొక ఆసక్తికరమైన అంశం, ఈ మధ్యే బ్రిటిష్ వారి పరిశోధనలలో తెలింది. ఈ పవిత్ర కుంభమేళా సమయంలో పవిత్రస్నానం చేసినవారికి మానసిక రోగాలనుండి విముక్తి లభించిందట. చాలా శారీరిక రోగాలు తగ్గిపోతున్నాయట.. ఎంత గొప్పది మన గంగమ్మ తల్లి. నదిలో మునిగితే ఏం వస్తుంది అనేవారికి ఇది సమాధానం కూడా.

No comments:

Post a Comment