మొన్న ఈమధ్య నేను "అంతరిక్షం,గ్రహాలు,నక్షత్రాలు గురించి చర్చించిన తొలి మానవులు భారతీయులు"అని ISRO ప్రయోగం గురించి చెబుతూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది..దానిని చూసి కొందరు మిత్రులు నాతో మెసేంజర్ ద్వారా చర్చించారు.వీరి వాదన చూసిన తరువాత మన తప్పుడు చరిత్ర నేర్పిన భావదారిద్ర్య ప్రభావం మనపై ఎంతలా పనిచేస్తోందనేది స్పష్టంగా తెలిసింది.వీరిలో కొంతమందికి భారతీయ పురాతన సాహిత్యం మీద కనీస అవగాహన,గౌరవం ఏమాత్రం లేవు..
వీరి ఉద్దేశ్యంలో నేను సమాజాన్ని భారతీయ పురాతన సాహిత్యాన్ని పరిశోధించమనటం ద్వారా రేపటితరం భారతీయూలను అభివ్రుద్ధికి దూరం చేస్తున్నానని.దీనిని సమర్దించుకోటానికి వారు చెప్పే ఉదాహరణలు రంగనాయకమ్మ విషవ్రుక్షం,ఐలయ్య హిందువునెట్లైతా లాంటి...ఇంకా కొన్ని వామపక్ష ప్రభావిత రచయితల పుస్తకాలలోనివి..
ఇటువంటి పుస్తకాలను మాత్రమే వీరు ఎందుకు చదువుతున్నారా అని గమనిస్తే ......కళాశాలలో,విశ్వవిద్యాలయాలలో వామపక్ష పార్టీల యూనియన్ లు వల్ల విద్యార్థులు ఇటువంటి పుస్తకాలు ఎక్కవ చదవటం ఒక ఫ్యాషన్ అని..అవి చదివి సాధారణ విద్యార్థులతో వాదులాడి మేధావులలా ఫోజ్ కొట్టడం కోసం...
పరిశోధించటం కంటే నిందించటం సులభం కదా!వీరికి తెలీదు వజ్రాన్ని రాయిలా భావించి హేళన చేస్తున్నారని.
వారిని నేనడిగింది"గొబ్బూరి వెంకటానంద రాఘవరావం" గారు తెలుసా?అని..
వారిచ్చిన సమాధానం "ఆయనెవరు?ఆయనొక పురాణం రాశాడా"?అని..
ఇక వాదన అనవసరం అని నా next post చూడమని end చేశాను..
......గొబ్బూరి వెంకటానంద రాఘవరావు....
జనణం 1892
మరణం 1958
మన తెలుగువారవటం మనకు గర్వకారణం..
ఆధునిక భారతీయ ఖగోళ శాస్ర్థవేత్త..మనకెంతమందికి తెలుసు ఈయన గురించి??
ఆకాశం మీద ఎనిమిదివేళ నక్షత్రాలను టెలిస్కోప్ సహాయం లేకుండానే ఆయన గుర్తుపట్టగలిగేవారు.
"ఋగ్వేదం"లోని ఖగోళ విజ్ఞానాన్ని పరిశోధించి ఎన్నో గొప్పవిషయాలు తెలుసుకున్నారు.వరాహమిహిరుడి సిద్ధాంతాలలో కొన్నింటిని సరిదిద్ధిన ఘనాపాటి..."స్ర్కిప్ట్సర్ ఆఫ్ ది హెవెన్" అను ఆంగ్లపుస్తకం ద్వారా ఎన్నో ఖగోళ విషయాలను తెలియచేశారు.1940 లో ఈ పుస్తకం ప్రపంచ ద్రుష్ఠిని ఆకర్షించింది..ఎందరో ప్రపంచ శాస్ర్తవేత్తలు ప్రశంసలు కురిపించారు..ఈ పుస్తకాన్ని తెలుగులో "జ్యోతిర్వేదం" పేరుతో ముద్రించారు...గ్రీకులు ఖగోళ జ్ఞాణం భారతీయుల నుంచి నేర్చుకున్నదే అని వీరు నిరూపించారు..ఆ నిదర్శనాలను చూపించారు...తనకు పూర్వులైన ప్రపంచ ఖగోళ శాస్ర్థవేత్తల అభిప్రాయాలన్నీ సమీక్షించారు..
సూర్యునికన్నా రోహిణి నక్షత్రం 74రెట్లు పెద్దది.అది భూమికి 67 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
13 లక్షల భూగోళాలు సూర్యగోళంలో అమరుతాయి.
ఆర్ద్ర నక్షత్రంలో 2కోట్ల50లక్షల సూర్యగోళాలు అమరుతాయి......ఇలాంటి విషయాలెన్నో ఎన్నెన్నో...
బాల్డియన్ లు,అసీరియన్ లు,బాబిలోనియన్ లు ఆకాశనక్షత్ర రాశులలో 3వ రాశిని "శివమ్" అని ఎందుకు అన్నారో...లాంటి విషయాలు....
అగస్త్య,ఆరుద్ర,జ్యేష్టాది మహాకాయ నక్షత్రాల ఎదుట సూర్యుడు మినుగురు పురుగు అంటారు ఈయన..
శతాబ్దాల నాటి ప్రాచీనులందించిన శాస్త్రవిజ్ఞానంతో ఎన్నెన్నో నూతన అంశాలను ఆవిష్కరించారు. ఖగోళంలోని అంశాలను పౌరాణిక పాత్రలలో ముడిపెట్టి చెప్పిన ప్రాచీన శాస్త్రవేత్తలు, కవులను తన పరిశోధనలకు ఆదర్శంగా ఎంచారు. వారు పాలపుంతను పాలసముద్రమని అభివర్ణిస్తూ, విష్ణువు పాదాల దగ్గర పుట్టిన దివిజగంగ ఆకాశంలో పయనించి శివుని తలమీద వర్షించిందని చెప్పారు. పాలపుంత ఎగువభాగంలో ఒక మూలన ఉన్న ప్రధాన నక్షత్రం విష్ణువు అనే దేముడి నామం కలిగినది. పాలపుంత దిగువభాగంలో చివరలో ఉన్న ప్రధాన నక్షత్రం ఆరుద్ర. ఇది శివుడి పేరు కలిగిఉన్నది. ఈ రెండు సక్షత్రాల నడుమ "హంస" పేరు కలిగిన నక్షత్రం ఒకటి ఉన్నది. హంసకు ఎడమ భాగమున ఉన్నది క్షీరసముద్రమనీ, రెండవ వైపున ఉన్నది దివినుండి భువికి చేరిన గంగ అనీ చెప్పారు. ఈ అంశాలన్నిటినీ రాఘవరావు పరిశీలించి, అధ్యయనం చేసి, ఆ పాలనూ, నీళ్ళను వేరుచేసే హంసతో సహా ఖగోళ చిత్రపటాన్ని తయారుచేసి "భారతి" సాహిత్య మాసపత్రిక (1920 దశకం) లో ప్రచురించారు. ఖగోళ శాస్త్రాన్ని గురించి చిరకాలం పరిశోధనలు చేసి కనుగొన్న వాటిని వేదాల్లోనూ, తైత్తరీయ సంహిత లోనూ, పురాణాలలోనూ , మహాభారతంలోనూ నర్మగర్భితంగా ఉన్న అంశాలతో సమన్వయం చేసి, అధ్భుతమైన విషయాలను ఆవిష్కరింపజేస్తూ "జ్యోతిర్వేదం" పేరుతో తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని ప్రచురించారు. ఇది కేవలం శాస్త్ర గ్రంధమే గాని, జ్యోతిష గ్రంథం కాదు.
.వీలైతే వీరిని ఆదర్శంగా తీసుకుందాం... లేదంటే మూసుకుందాం....ఎక్కువ వాగకుండా..
గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారాది విజయనగరం జిల్లా , పార్వతీపురం
భారత్ మాతా కీ జై!!
Source:wikipedia,jagruthi,google....
రామ్ కనుపూరి
వీరి ఉద్దేశ్యంలో నేను సమాజాన్ని భారతీయ పురాతన సాహిత్యాన్ని పరిశోధించమనటం ద్వారా రేపటితరం భారతీయూలను అభివ్రుద్ధికి దూరం చేస్తున్నానని.దీనిని సమర్దించుకోటానికి వారు చెప్పే ఉదాహరణలు రంగనాయకమ్మ విషవ్రుక్షం,ఐలయ్య హిందువునెట్లైతా లాంటి...ఇంకా కొన్ని వామపక్ష ప్రభావిత రచయితల పుస్తకాలలోనివి..
ఇటువంటి పుస్తకాలను మాత్రమే వీరు ఎందుకు చదువుతున్నారా అని గమనిస్తే ......కళాశాలలో,విశ్వవిద్యాలయాలలో వామపక్ష పార్టీల యూనియన్ లు వల్ల విద్యార్థులు ఇటువంటి పుస్తకాలు ఎక్కవ చదవటం ఒక ఫ్యాషన్ అని..అవి చదివి సాధారణ విద్యార్థులతో వాదులాడి మేధావులలా ఫోజ్ కొట్టడం కోసం...
పరిశోధించటం కంటే నిందించటం సులభం కదా!వీరికి తెలీదు వజ్రాన్ని రాయిలా భావించి హేళన చేస్తున్నారని.
వారిని నేనడిగింది"గొబ్బూరి వెంకటానంద రాఘవరావం" గారు తెలుసా?అని..
వారిచ్చిన సమాధానం "ఆయనెవరు?ఆయనొక పురాణం రాశాడా"?అని..
ఇక వాదన అనవసరం అని నా next post చూడమని end చేశాను..
......గొబ్బూరి వెంకటానంద రాఘవరావు....
జనణం 1892
మరణం 1958
మన తెలుగువారవటం మనకు గర్వకారణం..
ఆధునిక భారతీయ ఖగోళ శాస్ర్థవేత్త..మనకెంతమందికి తెలుసు ఈయన గురించి??
ఆకాశం మీద ఎనిమిదివేళ నక్షత్రాలను టెలిస్కోప్ సహాయం లేకుండానే ఆయన గుర్తుపట్టగలిగేవారు.
"ఋగ్వేదం"లోని ఖగోళ విజ్ఞానాన్ని పరిశోధించి ఎన్నో గొప్పవిషయాలు తెలుసుకున్నారు.వరాహమిహిరుడి సిద్ధాంతాలలో కొన్నింటిని సరిదిద్ధిన ఘనాపాటి..."స్ర్కిప్ట్సర్ ఆఫ్ ది హెవెన్" అను ఆంగ్లపుస్తకం ద్వారా ఎన్నో ఖగోళ విషయాలను తెలియచేశారు.1940 లో ఈ పుస్తకం ప్రపంచ ద్రుష్ఠిని ఆకర్షించింది..ఎందరో ప్రపంచ శాస్ర్తవేత్తలు ప్రశంసలు కురిపించారు..ఈ పుస్తకాన్ని తెలుగులో "జ్యోతిర్వేదం" పేరుతో ముద్రించారు...గ్రీకులు ఖగోళ జ్ఞాణం భారతీయుల నుంచి నేర్చుకున్నదే అని వీరు నిరూపించారు..ఆ నిదర్శనాలను చూపించారు...తనకు పూర్వులైన ప్రపంచ ఖగోళ శాస్ర్థవేత్తల అభిప్రాయాలన్నీ సమీక్షించారు..
సూర్యునికన్నా రోహిణి నక్షత్రం 74రెట్లు పెద్దది.అది భూమికి 67 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
13 లక్షల భూగోళాలు సూర్యగోళంలో అమరుతాయి.
ఆర్ద్ర నక్షత్రంలో 2కోట్ల50లక్షల సూర్యగోళాలు అమరుతాయి......ఇలాంటి విషయాలెన్నో ఎన్నెన్నో...
బాల్డియన్ లు,అసీరియన్ లు,బాబిలోనియన్ లు ఆకాశనక్షత్ర రాశులలో 3వ రాశిని "శివమ్" అని ఎందుకు అన్నారో...లాంటి విషయాలు....
అగస్త్య,ఆరుద్ర,జ్యేష్టాది మహాకాయ నక్షత్రాల ఎదుట సూర్యుడు మినుగురు పురుగు అంటారు ఈయన..
శతాబ్దాల నాటి ప్రాచీనులందించిన శాస్త్రవిజ్ఞానంతో ఎన్నెన్నో నూతన అంశాలను ఆవిష్కరించారు. ఖగోళంలోని అంశాలను పౌరాణిక పాత్రలలో ముడిపెట్టి చెప్పిన ప్రాచీన శాస్త్రవేత్తలు, కవులను తన పరిశోధనలకు ఆదర్శంగా ఎంచారు. వారు పాలపుంతను పాలసముద్రమని అభివర్ణిస్తూ, విష్ణువు పాదాల దగ్గర పుట్టిన దివిజగంగ ఆకాశంలో పయనించి శివుని తలమీద వర్షించిందని చెప్పారు. పాలపుంత ఎగువభాగంలో ఒక మూలన ఉన్న ప్రధాన నక్షత్రం విష్ణువు అనే దేముడి నామం కలిగినది. పాలపుంత దిగువభాగంలో చివరలో ఉన్న ప్రధాన నక్షత్రం ఆరుద్ర. ఇది శివుడి పేరు కలిగిఉన్నది. ఈ రెండు సక్షత్రాల నడుమ "హంస" పేరు కలిగిన నక్షత్రం ఒకటి ఉన్నది. హంసకు ఎడమ భాగమున ఉన్నది క్షీరసముద్రమనీ, రెండవ వైపున ఉన్నది దివినుండి భువికి చేరిన గంగ అనీ చెప్పారు. ఈ అంశాలన్నిటినీ రాఘవరావు పరిశీలించి, అధ్యయనం చేసి, ఆ పాలనూ, నీళ్ళను వేరుచేసే హంసతో సహా ఖగోళ చిత్రపటాన్ని తయారుచేసి "భారతి" సాహిత్య మాసపత్రిక (1920 దశకం) లో ప్రచురించారు. ఖగోళ శాస్త్రాన్ని గురించి చిరకాలం పరిశోధనలు చేసి కనుగొన్న వాటిని వేదాల్లోనూ, తైత్తరీయ సంహిత లోనూ, పురాణాలలోనూ , మహాభారతంలోనూ నర్మగర్భితంగా ఉన్న అంశాలతో సమన్వయం చేసి, అధ్భుతమైన విషయాలను ఆవిష్కరింపజేస్తూ "జ్యోతిర్వేదం" పేరుతో తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని ప్రచురించారు. ఇది కేవలం శాస్త్ర గ్రంధమే గాని, జ్యోతిష గ్రంథం కాదు.
.వీలైతే వీరిని ఆదర్శంగా తీసుకుందాం... లేదంటే మూసుకుందాం....ఎక్కువ వాగకుండా..
గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారాది విజయనగరం జిల్లా , పార్వతీపురం
భారత్ మాతా కీ జై!!
Source:wikipedia,jagruthi,google....
రామ్ కనుపూరి
No comments:
Post a Comment