దేశంలో మంత్రులు అందరికీ ఆదర్శం ఇది చదివి కొందరు సిగ్గుతెచ్చుకోవాలిఅశోక్గజపతిరాజు ఆగర్భ శ్రీమంతుడు అయినా అత్యంత నిరాడంబరంగా మెలగటం ఆయన గొప్పదనం. ఆఫ్టరాల్ ఎంపీపీ, ఎంపీటీసీలే కారు వెనుక నెంబర్ప్లేట్పై రెడ్ కలర్ స్ట్రిప్ వేసుకుని వీవీవీఐపీల్లా ఫోజులు కొడుతుంటారు. ఎక్కడన్నా సెక్యురిటీ లేదా చెక్పోస్టు ఆపితే నేను ఫలాన నాయకుడి కొడుకుని బామ్మర్దిని అంటూ టోల్గేట్లపైనా చెక్పోస్టులపైనా దాడులు చూశాం. అధికారం నషా నెత్తికెక్కి జనం నెత్తినెక్కి కూర్చున్న నాయకులు ఎందులో అయినా దూకి చావాలి పూసపాటి అశోక్గజపతిరాజు గారి గురించి తెలిస్తే. రాజుగారు ఈయన తన కుమార్తెను విజయనగరం నుంచి విశాఖకు బస్సులో పంపేవారు చదువు కోసం.
తన కారు తానే శుభ్రం చేసుకునేవారు. కేంద్ర విమానయాన మంత్రిగా ఉన్నా నిరాడంబరంగా పనిచేసుకుపోతారు. అందరితోపాటు వరుసలో నిల్చుని తనిఖీలకు వెళతారు. టికెట్ పంచ్ కొట్టి మరీ మెట్రో రైలులో ప్రయాణిస్తారు. విమానాశ్రయంలోనూ వరుసలో నిలబడతారు. కేంద్రమంత్రిగా అందులోనూ విమానయానం అంటే ప్రపంచంలోని ప్రముఖులు అందరు తమ ముందు వచ్చి నిలబడే శాఖ అది. అలాంటికి అధిపతి అయినా తాను ఓ సాధారణ ప్రయాణికుడిలా ఉండటం చూసి ప్రధాని నరేంద్రమోడీ అందరి వద్దా ఆయన గురించి చెబుతున్నారు. ఆయనను చూసి నేర్చుకోవాలని ప్రధాని సూచిస్తున్నారు. నిజానికి విమానయాన మంత్రి అనగానే ఎవరూ ఆపకుండానే నేరుగా కారు దిగి విమానం ఎక్కేయటమే. కానీ… ఆయన అలా చేయరు. అందరు ప్రయాణికులతోపాటు వరుసలో నిలబడతారు. రెండు చేతులు పైకెత్తి చెకింగ్ చేయించుకుంటారు. మంత్రిగారన్న భయంతో సెక్యూరిటీ అధికారులు చెకింగ్ చేయకుండా వదిలేస్తే ‘మీ డ్యూటీ మీరు చేయండి, తప్పులేదు’ అని వారికి సూచిస్తారు. ఇక… టెర్మినల్ నుంచి విమానం వరకు బస్సులో వెళ్లాల్సి వచ్చినా, మంత్రికి ఉండే ప్రత్యేక వాహనం ఉపయోగించరు. బస్సులో అందరితో కలిసే వెళతారు. ఇక… విమానాశ్రయానికి ఆయన కారులో కాకుండా మెట్రో రైలులో ప్రయాణిస్తారు.అక్కడా కూడా ‘నేను మంత్రి’ని అనే ఆర్భాటం చూపించరు. మిగిలిన ప్రయాణికులతోపాటు క్యూలో నిల్చుని… మెట్రో టికెట్ పంచ్ చేయించుకుని, గేటు దాటి వెళతారు. ఇతర కేంద్ర మంత్రులూ ఏరోసిటీలో ప్రయాణించినప్పటికీ… ఇలా క్యూలో నిలబడటం, టికెట్ పంచ్ చేయించుకోవడం ఉండదు. వారికోసం ముందుగానే గేట్లు తెరుచుకుంటాయి. ఇంకా చెప్పాలంటే… మెట్రో కార్డు ఉన్న ఏకైక కేంద్ర మంత్రి అశోక్. ఏ విమానంలోనైనా ఎగ్జిక్యూటివ్/బిజినెస్ క్లాస్లో ప్రయాణించే అధికారం/అవకాశం అశోక్ గజపతికి ఉంటుంది. ఆయన దీనిని కూడా ఉపయోగించుకోరు. సాధారణ క్లాస్లోనే ప్రయాణిస్తారు. ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లలో కాఫీ తాగటానికి రెస్టారెంటుకు వెళ్లినా ఓ మూల ప్లాస్లిక్ కుర్చీలో కూర్చుని తింటారు. ఆయన 7సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఎంపీ. దాదాపు రాష్ట్రంలో అన్ని ముఖ్యమైన మంత్రిత్వశాఖలు నిర్వహించిన ఓ సీనియర్ రాజకీయవేత్త కావటమేనా ఈయన గొప్పతనం అంటే అదీ కాదు. కోరుకొండ సైనిక్ స్కూల్ స్థాపన కోసం 1961-62లో కేంద్ర ప్రభుత్వానికి కోరుకొండ ప్యాలెస్తో సహా సుమారు వెయ్యి ఎకరాల స్థలం దానం చేసిన మహా దాత. విద్యావంతుడు. గుణవంతుడు. శీలవంతుడు. అలాంటి వ్యక్తి నిరాడంబరంగా ఉంటే ఏమీ లేని ఆకుల్లాంటి వాళ్లు ఎగిరెగిరి పడటం సిగ్గుచేటు.
తన కారు తానే శుభ్రం చేసుకునేవారు. కేంద్ర విమానయాన మంత్రిగా ఉన్నా నిరాడంబరంగా పనిచేసుకుపోతారు. అందరితోపాటు వరుసలో నిల్చుని తనిఖీలకు వెళతారు. టికెట్ పంచ్ కొట్టి మరీ మెట్రో రైలులో ప్రయాణిస్తారు. విమానాశ్రయంలోనూ వరుసలో నిలబడతారు. కేంద్రమంత్రిగా అందులోనూ విమానయానం అంటే ప్రపంచంలోని ప్రముఖులు అందరు తమ ముందు వచ్చి నిలబడే శాఖ అది. అలాంటికి అధిపతి అయినా తాను ఓ సాధారణ ప్రయాణికుడిలా ఉండటం చూసి ప్రధాని నరేంద్రమోడీ అందరి వద్దా ఆయన గురించి చెబుతున్నారు. ఆయనను చూసి నేర్చుకోవాలని ప్రధాని సూచిస్తున్నారు. నిజానికి విమానయాన మంత్రి అనగానే ఎవరూ ఆపకుండానే నేరుగా కారు దిగి విమానం ఎక్కేయటమే. కానీ… ఆయన అలా చేయరు. అందరు ప్రయాణికులతోపాటు వరుసలో నిలబడతారు. రెండు చేతులు పైకెత్తి చెకింగ్ చేయించుకుంటారు. మంత్రిగారన్న భయంతో సెక్యూరిటీ అధికారులు చెకింగ్ చేయకుండా వదిలేస్తే ‘మీ డ్యూటీ మీరు చేయండి, తప్పులేదు’ అని వారికి సూచిస్తారు. ఇక… టెర్మినల్ నుంచి విమానం వరకు బస్సులో వెళ్లాల్సి వచ్చినా, మంత్రికి ఉండే ప్రత్యేక వాహనం ఉపయోగించరు. బస్సులో అందరితో కలిసే వెళతారు. ఇక… విమానాశ్రయానికి ఆయన కారులో కాకుండా మెట్రో రైలులో ప్రయాణిస్తారు.అక్కడా కూడా ‘నేను మంత్రి’ని అనే ఆర్భాటం చూపించరు. మిగిలిన ప్రయాణికులతోపాటు క్యూలో నిల్చుని… మెట్రో టికెట్ పంచ్ చేయించుకుని, గేటు దాటి వెళతారు. ఇతర కేంద్ర మంత్రులూ ఏరోసిటీలో ప్రయాణించినప్పటికీ… ఇలా క్యూలో నిలబడటం, టికెట్ పంచ్ చేయించుకోవడం ఉండదు. వారికోసం ముందుగానే గేట్లు తెరుచుకుంటాయి. ఇంకా చెప్పాలంటే… మెట్రో కార్డు ఉన్న ఏకైక కేంద్ర మంత్రి అశోక్. ఏ విమానంలోనైనా ఎగ్జిక్యూటివ్/బిజినెస్ క్లాస్లో ప్రయాణించే అధికారం/అవకాశం అశోక్ గజపతికి ఉంటుంది. ఆయన దీనిని కూడా ఉపయోగించుకోరు. సాధారణ క్లాస్లోనే ప్రయాణిస్తారు. ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లలో కాఫీ తాగటానికి రెస్టారెంటుకు వెళ్లినా ఓ మూల ప్లాస్లిక్ కుర్చీలో కూర్చుని తింటారు. ఆయన 7సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఎంపీ. దాదాపు రాష్ట్రంలో అన్ని ముఖ్యమైన మంత్రిత్వశాఖలు నిర్వహించిన ఓ సీనియర్ రాజకీయవేత్త కావటమేనా ఈయన గొప్పతనం అంటే అదీ కాదు. కోరుకొండ సైనిక్ స్కూల్ స్థాపన కోసం 1961-62లో కేంద్ర ప్రభుత్వానికి కోరుకొండ ప్యాలెస్తో సహా సుమారు వెయ్యి ఎకరాల స్థలం దానం చేసిన మహా దాత. విద్యావంతుడు. గుణవంతుడు. శీలవంతుడు. అలాంటి వ్యక్తి నిరాడంబరంగా ఉంటే ఏమీ లేని ఆకుల్లాంటి వాళ్లు ఎగిరెగిరి పడటం సిగ్గుచేటు.
No comments:
Post a Comment