పురాణాల్లో సైన్స్
రచన: పోలిశెట్టి బ్రదర్స్
34. మన ప్రాచీన అణువిజ్ఞానం :
సృష్టిలో ఉన్నవి రెండే రెండు.
1. శక్తి
2. పదార్థము
' శక్తి ' విషయం కాస్త ప్రక్కకు పెట్టి, ఇప్పుడు ' పదార్థం ' సంగతి చూద్దాం.
' పదార్థం ' రెండు రకాలు.
1. జీవ పదార్థం
2. జడపదార్థం (అనగా జీవం లేనిది).
ఏది ఏమైనా, మొత్తం పదార్థాలన్నీ మాత్రం పరమాణువుల మయం. ఒక పదార్థాన్ని బాగా చిన్నభాగంగా విభజించుకుంటూ పోతే, చివరకు అది కంటికి కనిపించనంత సూక్ష్మరేణువుగా మిగులుతుంది. అదే ఆ పదార్థానికి చెందిన ' పరమాణువు '. కోట్లకొలదీ పరమాణువులు కూడడం వల్ల పదార్థాలు ఏర్పడుతున్నాయి. జీవులూ, నిర్జీవులూ మొత్తం అన్నీ కూడా పరమాణు నిర్మితాలే! అంటే మనుషులు, పశు పక్ష్యాదులు, సరీసృపాలు, కీటకాలు, సూక్ష్మక్రిములు, వృక్షజాతులు, పాడిపంటలు మొదలైనవే కాకుండా గాలి, అగ్ని, భూమి, నీరు ఇత్యాదులు సైతం పరమాణువులతోనే నిండివున్నాయి. చివరకు నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఏస్టరాయిడ్స్, తోకచుక్కలు మున్నగునవి కూడా పరమాణు సముదాయాలే! పరమాణువు లేనిది సృష్టి లేదని చెప్పవచ్చు.
మనిషికీ, విశ్వానికీ, విశ్వకర్తకూ ఉన్న సంబంధ బాంధవ్యం ఎలాంటిదో తెలుసుకోవడానికి చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పురాణకాలం నుండి ఎందరో దార్శనికులు విశ్వరహస్యాల గురించి తృప్తికరమైన సమాధానాలను ఇవ్వడానికి త్రికరణశుద్ధిగా ప్రయత్నాలు చేశారు. అట్టి ప్రయత్నాలలో కొంతవరకూ సఫలీకృతులైనవారిలో "కణాద మహర్షి" ఒకరు.
కణాదుడు :
అణువిజ్ఞానాన్ని ప్రపంచంలో ప్రప్రథమంగా గ్రంథస్థం చేసిన మహావిజ్ఞాని "కణాద మహర్షి". ఈయన అసలుపేరు "కాశ్యపుడు". కణాల (అణువుల) గురించి వివరించిన మేధావి కాబట్టి ఈయనకు "కణాదుడు" అనే పేరు వచ్చింది. అణువులు, పరమాణువుల గురించి "వైశేషిక సూత్రం" అనే గ్రంథాన్ని ఈయన రచించాడు. ఆ గ్రంథంలో ఈయన చేసిన ప్రతిపాదనలు సమగ్రవంతంగా ఇప్పటికీ ఆమోదయోగ్యమై ఉండడం ఎంతో విశేషం. ఈయన తొలిసారిగా వాడిన ' పరమాణువు ' పదం ఈనాటికీ తిరుగులేకుండా ఉంది. గ్రీకు దార్శనికులైన "లూసీప్సన్, డెమోక్రిటన్" ల సిద్ధాంతాలు, కణాదుని పరమాణు తత్త్వవిజ్ఞానం ముందు వెలవెలపోతున్నాయి.
"పదార్థాన్ని విడగొడితే అణువులు, అణువులను విడగొడితే పరమాణువులు ఏర్పడతాయి" అని కణాదుడు స్పష్టంగా చెప్పాడు. విభిన్నమైన పరమాణువులు ఎన్నో ఉన్నాయని, వాటి విలక్షణమైన కలయిక వల్లనే భూమ్యాకాశాలు, అగ్ని, గాలి, నీరు మొదలైనవన్నీ రూపొందాయని వివరించాడు. పదార్థాలు పరమాణువుల స్థాయికి వచ్చినప్పుడు, ఆ పరమాణువులు తమ విశిష్ట లక్షణాలతో అలరారుతాయని చెప్పాడు.
పదార్థాలుగా రూపొందేటప్పుడు రకరకాల పరమాణువులు కలియడం వల్ల వాటికి ప్రత్యేకమైన ధర్మాలు ప్రాప్తిస్తాయనే సత్యాన్ని ఈ శాస్త్రవేత్త ఆనాడే ప్రకటించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 2 పరమాణువులు కలిస్తే 'ద్వణుకం' అవుతుందనీ, 3 పరమాణువులు కలిస్తే 'త్రణుకం' అవుతుందనీ ఈయన వివరించాడు. ఈ సిద్ధాంత ప్రకారమే వైశేషిక దర్శన అనుయాయులైన శాస్త్రవేత్తలు లోహవిజ్ఞానాన్ని పరిపుష్ఠం చేశారు. సృష్టిలో పదార్థాలన్నీ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సుల కలయికతో ఏర్పడుతున్నాయని వివరించి చెప్పాడు.
పదార్థాలన్నింటికీ మూలమైన పరమాణువులు, సృష్టి నిర్మాణములో ఆధారం అయినందున అవి నిత్యములై ఉంటాయనీ, వాటికి నాశనం లేదనీ చెప్పాడు. తన గ్రంథంలో ఆత్మ, మనస్సుల గురించి కూడా కణాదుడు వివరణ ఇచ్చాడు. మొత్తం మీద ఈయన ' పరమాణువాదము, పరమాణు నిత్యత్వ వాదము, షట్ పదార్థ వాదము, సృష్టివాదము ' మున్నగు వాదాలను ప్రతిపాదించాడు.
"భగవద్గీత" లో కృష్ణపరమాత్మ చెప్పిన కొన్ని మాటలు పరమాణు విజ్ఞానానికి సంబంధించినవే! "అనంతమైన తన ' శక్తి ' విశ్వంలోని ప్రతి అణువునా దాగి ఉన్నదనీ, అనూహ్యమైన రూపం కల తాను అణువుకన్నా అణువుననీ" ఆయన చెప్పడం జరిగింది. అణువుల్లో, పరమాణువుల్లో ' శక్తి ' దాగివున్న విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తల కంటే ముందుగా శ్రీకృష్ణుడే చెప్పాడు. పరమాణువులను విచ్ఛిన్నం చేస్తే అందులో నుండి బ్రహ్మాండమైన శక్తి విడుదలవుతుంది. ఆటంబాంబు ప్రయోగ ప్రక్రియ ఇదే మరి! ఆటంబాంబు కనుగొనని క్రితమే, పరమాణువులో అంతటి బృహత్తరమైన (తన) శక్తి ఉన్నదని శ్రీకృష్ణుడు చెప్పడం గమనించదగిన విషయం.
నేడు పరమాణు విజ్ఞానం అనేక విధాల వికసించి మానవాళికి సేవ చేస్తున్నది. శాస్త్రప్రయోజనం సమాజశ్రేయస్సే కావాలని నిర్దేశించిన ఎంతోమంది భారతీయ శాస్త్రవేత్తల్లో కణాదమహర్షి ఒకరు.
ప్రళయాన్ని సైతం సృష్టించగల పరమాణువుల విషయంలో మనిషికి ఎంతైనా సంయమనం అవసరం. పరమాణు విజ్ఞానాన్ని మానవాళి అభివృద్ధికి వినియోగించాలి గాని, వినాశనానికి వాడుకోకూడదు. ఇది ప్రపంచం గుర్తించవలసిన సత్యం.
రచన: పోలిశెట్టి బ్రదర్స్
34. మన ప్రాచీన అణువిజ్ఞానం :
సృష్టిలో ఉన్నవి రెండే రెండు.
1. శక్తి
2. పదార్థము
' శక్తి ' విషయం కాస్త ప్రక్కకు పెట్టి, ఇప్పుడు ' పదార్థం ' సంగతి చూద్దాం.
' పదార్థం ' రెండు రకాలు.
1. జీవ పదార్థం
2. జడపదార్థం (అనగా జీవం లేనిది).
ఏది ఏమైనా, మొత్తం పదార్థాలన్నీ మాత్రం పరమాణువుల మయం. ఒక పదార్థాన్ని బాగా చిన్నభాగంగా విభజించుకుంటూ పోతే, చివరకు అది కంటికి కనిపించనంత సూక్ష్మరేణువుగా మిగులుతుంది. అదే ఆ పదార్థానికి చెందిన ' పరమాణువు '. కోట్లకొలదీ పరమాణువులు కూడడం వల్ల పదార్థాలు ఏర్పడుతున్నాయి. జీవులూ, నిర్జీవులూ మొత్తం అన్నీ కూడా పరమాణు నిర్మితాలే! అంటే మనుషులు, పశు పక్ష్యాదులు, సరీసృపాలు, కీటకాలు, సూక్ష్మక్రిములు, వృక్షజాతులు, పాడిపంటలు మొదలైనవే కాకుండా గాలి, అగ్ని, భూమి, నీరు ఇత్యాదులు సైతం పరమాణువులతోనే నిండివున్నాయి. చివరకు నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఏస్టరాయిడ్స్, తోకచుక్కలు మున్నగునవి కూడా పరమాణు సముదాయాలే! పరమాణువు లేనిది సృష్టి లేదని చెప్పవచ్చు.
మనిషికీ, విశ్వానికీ, విశ్వకర్తకూ ఉన్న సంబంధ బాంధవ్యం ఎలాంటిదో తెలుసుకోవడానికి చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పురాణకాలం నుండి ఎందరో దార్శనికులు విశ్వరహస్యాల గురించి తృప్తికరమైన సమాధానాలను ఇవ్వడానికి త్రికరణశుద్ధిగా ప్రయత్నాలు చేశారు. అట్టి ప్రయత్నాలలో కొంతవరకూ సఫలీకృతులైనవారిలో "కణాద మహర్షి" ఒకరు.
కణాదుడు :
అణువిజ్ఞానాన్ని ప్రపంచంలో ప్రప్రథమంగా గ్రంథస్థం చేసిన మహావిజ్ఞాని "కణాద మహర్షి". ఈయన అసలుపేరు "కాశ్యపుడు". కణాల (అణువుల) గురించి వివరించిన మేధావి కాబట్టి ఈయనకు "కణాదుడు" అనే పేరు వచ్చింది. అణువులు, పరమాణువుల గురించి "వైశేషిక సూత్రం" అనే గ్రంథాన్ని ఈయన రచించాడు. ఆ గ్రంథంలో ఈయన చేసిన ప్రతిపాదనలు సమగ్రవంతంగా ఇప్పటికీ ఆమోదయోగ్యమై ఉండడం ఎంతో విశేషం. ఈయన తొలిసారిగా వాడిన ' పరమాణువు ' పదం ఈనాటికీ తిరుగులేకుండా ఉంది. గ్రీకు దార్శనికులైన "లూసీప్సన్, డెమోక్రిటన్" ల సిద్ధాంతాలు, కణాదుని పరమాణు తత్త్వవిజ్ఞానం ముందు వెలవెలపోతున్నాయి.
"పదార్థాన్ని విడగొడితే అణువులు, అణువులను విడగొడితే పరమాణువులు ఏర్పడతాయి" అని కణాదుడు స్పష్టంగా చెప్పాడు. విభిన్నమైన పరమాణువులు ఎన్నో ఉన్నాయని, వాటి విలక్షణమైన కలయిక వల్లనే భూమ్యాకాశాలు, అగ్ని, గాలి, నీరు మొదలైనవన్నీ రూపొందాయని వివరించాడు. పదార్థాలు పరమాణువుల స్థాయికి వచ్చినప్పుడు, ఆ పరమాణువులు తమ విశిష్ట లక్షణాలతో అలరారుతాయని చెప్పాడు.
పదార్థాలుగా రూపొందేటప్పుడు రకరకాల పరమాణువులు కలియడం వల్ల వాటికి ప్రత్యేకమైన ధర్మాలు ప్రాప్తిస్తాయనే సత్యాన్ని ఈ శాస్త్రవేత్త ఆనాడే ప్రకటించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 2 పరమాణువులు కలిస్తే 'ద్వణుకం' అవుతుందనీ, 3 పరమాణువులు కలిస్తే 'త్రణుకం' అవుతుందనీ ఈయన వివరించాడు. ఈ సిద్ధాంత ప్రకారమే వైశేషిక దర్శన అనుయాయులైన శాస్త్రవేత్తలు లోహవిజ్ఞానాన్ని పరిపుష్ఠం చేశారు. సృష్టిలో పదార్థాలన్నీ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సుల కలయికతో ఏర్పడుతున్నాయని వివరించి చెప్పాడు.
పదార్థాలన్నింటికీ మూలమైన పరమాణువులు, సృష్టి నిర్మాణములో ఆధారం అయినందున అవి నిత్యములై ఉంటాయనీ, వాటికి నాశనం లేదనీ చెప్పాడు. తన గ్రంథంలో ఆత్మ, మనస్సుల గురించి కూడా కణాదుడు వివరణ ఇచ్చాడు. మొత్తం మీద ఈయన ' పరమాణువాదము, పరమాణు నిత్యత్వ వాదము, షట్ పదార్థ వాదము, సృష్టివాదము ' మున్నగు వాదాలను ప్రతిపాదించాడు.
"భగవద్గీత" లో కృష్ణపరమాత్మ చెప్పిన కొన్ని మాటలు పరమాణు విజ్ఞానానికి సంబంధించినవే! "అనంతమైన తన ' శక్తి ' విశ్వంలోని ప్రతి అణువునా దాగి ఉన్నదనీ, అనూహ్యమైన రూపం కల తాను అణువుకన్నా అణువుననీ" ఆయన చెప్పడం జరిగింది. అణువుల్లో, పరమాణువుల్లో ' శక్తి ' దాగివున్న విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తల కంటే ముందుగా శ్రీకృష్ణుడే చెప్పాడు. పరమాణువులను విచ్ఛిన్నం చేస్తే అందులో నుండి బ్రహ్మాండమైన శక్తి విడుదలవుతుంది. ఆటంబాంబు ప్రయోగ ప్రక్రియ ఇదే మరి! ఆటంబాంబు కనుగొనని క్రితమే, పరమాణువులో అంతటి బృహత్తరమైన (తన) శక్తి ఉన్నదని శ్రీకృష్ణుడు చెప్పడం గమనించదగిన విషయం.
నేడు పరమాణు విజ్ఞానం అనేక విధాల వికసించి మానవాళికి సేవ చేస్తున్నది. శాస్త్రప్రయోజనం సమాజశ్రేయస్సే కావాలని నిర్దేశించిన ఎంతోమంది భారతీయ శాస్త్రవేత్తల్లో కణాదమహర్షి ఒకరు.
ప్రళయాన్ని సైతం సృష్టించగల పరమాణువుల విషయంలో మనిషికి ఎంతైనా సంయమనం అవసరం. పరమాణు విజ్ఞానాన్ని మానవాళి అభివృద్ధికి వినియోగించాలి గాని, వినాశనానికి వాడుకోకూడదు. ఇది ప్రపంచం గుర్తించవలసిన సత్యం.
No comments:
Post a Comment