Thursday, 21 December 2017

మయాన్‌ మూలాలు మనవే

మయాన్‌ మూలాలు మనవే..!
సనాతన ధర్మం.. దాని మూలాల సమస్తవిశ్వమంతా విస్తరించానేది వాదన కాదు.. నిర్హేతుక వాస్తవం. ఇందుకు ఎన్నో ఉదాహరణలు.. నిదర్శనాలు తాజాగా కనిపిస్తున్నాయి. సముద్రగర్భంలోని ఇండియన్‌ ప్లేట్‌ కదలికల ఆధారంగా దక్షిణ భారతం నుంచి ప్రస్తుతం కొన్ని దేశాలు విడిపోయాయి. ఇందుకు సముద్ర గర్భంలో కలిసిపోయిన కుమారి కాండం.. ఈ మధ్యే మడగాస్కర్‌ దగ్గర కనుగొనడం విశేషం.
దక్షిణ అమెరికా పిరమిడ్లు, మయాన్‌ నాగరికత ఇంచుమించుగా చాలా దగ్గరగా ఉంటాయి. ఈజిఫ్షియన్లు మిగిలిన వారికి ప్రేరణగా నిలిచారని చెప్పవచ్చు. ఇదే నేపథ్యంలో ఈజిఫ్షియన్లు పూర్వ దక్షిణ భారత దేశానికి చెందినవారని చెప్పాలి. ఈజిఫ్షియన్లుకు సనాతన ధర్మం, పూర్వ దక్షిణ భారతంలో అనేక అంశాల మధ్య సారూపత్యలు ఉన్నాయి.
సోమ-వంగ వంశంలో మొదటి చక్రవర్తి అయిన విశ్వామిత్రడు.. మను-వినా చక్రవర్తుల మధ్య జరిగిన యుద్ధం.. అనంతర పరిణామాలతో బ్రాహ్మణులను ప్రస్తుత ఈజిఫ్టు రాజధాని కైరో (అప్పట్లో మార్సా అని పిలిచేవారు) వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ''కాలుక్క-భట్టా'' రచించిన భారత చరిత్రలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈజిఫ్షియన్‌ మొదటి చక్రవర్తి చక్రవర్తిగా మను-వినా వ్యవరించారని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ప్రాంతాలు.. ఆధారాలు
ఇప్పుడు చారిత్రక నగరాలుగా ఉన్న అనేక పట్టణాల పేర్లను పరిశీలిస్తే.. ఆర్యా.. ప్రస్తుతం ఇరాన్‌ అని పిలుస్తున్నాం. గతంలో పర్షియా అని పిలిచేవాళ్లం. ఇక బారియాను సౌదీ అరేబియా అని, మార్సాను కైరో అని, మసుర్‌, మిసుర్‌లను మిస్రో అని పిలుస్తున్నాం. ఇక ఈజిఫ్టు చరిత్ర, న్యాయచట్టాలు, సామాజిక కట్టుబాట్లు, కళలు, సాహిత్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని పరిశీలిస్తే.. అవన్నీ భారతదేశంలో విలసిల్లిన పూర్వ వేదకాలం నాటివేనన్న విషయం అవగతం అవుతుంది. ఈజిఫ్టుకు చెందిన రెండో సబ్‌ రాస్‌ (పూర్వ ఈజిఫ్టు 5.2)లో భారతదేశంలోని ఆచార వ్యవహారాలకు దగ్గర సంబంధాలున్నట్లు ఉంటుంది.
ఆచారాలు - వ్యవహారాలు
మయాన్‌ నాగరికత విషయానికి వస్తే వారు పాటించే ఆచార వ్యవహారాలు, కర్మ సిద్ధాంతంపై నమ్మకాలు.. విశ్వాసాలు అన్నీ భారతదేశానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇదే భారతదేశంలోని పూర్వ వేద కాలానికి మయాన్‌ పూర్వీకులకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తోంది. ఇక మయాన్ల గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది. భౌగోలిక పరిస్థితులు, భూ కదలికల వల్ల వీరు భారత ఉప ఖండం నుంచి వేరు పడ్డారు. ఇక రామాయణంలో సైతం నాగ-మయా గిరిజనుల గురించి ప్రస్తావన ఉంది. నాగులను సనాతన ధర్మంలో దేవుళ్లుగా కొలుస్తారు. బాబిలోనియా సంస్కృతి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
నాగుపాములు -- సంబంధం
'నాగ' అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. నాగ అంటే విషం ఉన్నది పాము అని అర్థం. ఇక విషయానికి వస్తే నాగుపామును శివపార్వుతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామిగా అరాధిస్తాం.. అదే విధంగా మయాన్లు సైతం కుకుల్కోన్‌ దేవుడుగా పూజిస్తారు. పూర్వ వేదకాలంలో భారతదేశం నాలుగు ప్రధాన భాగాలుగా విడిపోయింది. సింధూనదీ పరివాహక ప్రాంతంలో నివసించే వారిని అసురులు.. నాగులు, యక్షులు (కుబేరుడు, ఇతరులు), మయాలు. వీరినే ఇప్పుడు ద్రావిడులు అంటున్నారు. మయాలు అత్యంత ధైర్య వంతులు, మూఢనమ్మకాలను బలీయంగా విశ్వసించేవారు. పూర్వవేదకాలంలోనే అంతర్జాతీయస్థాయిలో నౌకా వ్యాపారాన్ని నిర్వహించేవారు. నౌకలను నిర్మించడంలోనూ వీరికి వీరే సాటి. ఈ నౌకల్లోనే కుబేరుడు వంటి యక్షులు ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవారు. రావణలంకగా పేరొందిన సనుకేని (ప్రస్తుతం శ్రీలంక) దక్షిణ భారతదేశంతో కలిసిపోయి ఉండేది.
గ్రహాలు.. కాలగణన
సింధూ నాగరికులు బృహస్పతి గ్రహ కదలికల ఆధారంగా కాలగణన చేసేవారు. అదే మయాన్లు శుక్రగ్రహ గమనాన్ని కాలగణనకు తీసుకున్నారు. ఇక్కడే ఒక విషయాన్ని మనం గుర్తు చేసేకోవాలి.. దేవతలకు బృహస్పతి గురువు అయితే.. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. దేవ రాక్షస గణాల మధ్య జరిగిన యుద్ధాలను గుర్తు చేసుకోవాలి. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లోని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బీజీ సిద్ధార్థ్‌ విశ్లేషించారు. భారత్‌ - మెక్సికోలు ఒకే అక్షాంశంపై వ్యతిరేక దిశలో ఉంటాయి. హిందువుల చరిత్ర.. సముద్ర అంతర్భాగాల్లో నిక్షిప్తమై ఉంది. ఈ మధ్యే మెక్సికో సముద్ర తీరంలో హిందువుల శిల్పాలు వెలుగు చూశాయి. మయాన్ల దేవతగా కొలిచే తాబేలుపై ఉండే 12 స్థంభాలు భారతీయ శిల్ప కళకు సాక్ష్యంగా నిలుస్తుందని డాక్టర్‌ గణపతి స్థపతి పేర్కొన్నారు. మయాన్‌ శిల్ప కళను చూసిన పరిశీలిస్తే.. వారు పూర్వకాలంలో హిందువులే అన్న విషయం స్పష్టమవుతుందని గణపతి స్థపతి పేర్కొన్నారు

No comments:

Post a Comment