Wednesday, 7 February 2018

కాంతివేగమును ఎవరు లెక్కించారు

కాంతివేగమును ఎవరు లెక్కించారు .?
భారతీయుల ఘనత .? విదేశీయుల ఘనత ..?

కానీ పాశ్చాత్య ప్రపంచం,
కాంతివేగాన్ని లేక్కించినది క్రీ.శ 1975లో “రోమార్” అనే ఘనుడు అంటుంది. ఇందులో నిజం లేదు.
1. ప్రసిద్ధ ప్రాచీన భాష్యకారులు కింది బుగ్వేద శ్లోకానికి
“తరణిర్విశ్వధర్శతో జ్యోతిష్క్రుదాసి సూర్య విశ్వమాభాసిరోచనమ్II (1.50.4-బుగ్వేదం)

2. భాష్యంగా సాయనాచార్యులు కాంతి వేగాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకం రాశారు.
“యోఢజనానాం సహస్రం ద్వే ద్వేశాతే ద్వే చ యేజనేI
ఎకేక నిమిషార్దేన క్రమమాణ నమో స్తుతే II”

అనగా అరనిమిషానికి 2202 యేజనాల దురం ప్రయాణించు ఓ కాంతి కిరణమా నీకు నమస్కారము
అని భావం.
ఇక్కడ 1 యోజనము = 9 మైళ్ళ 160 గజాలు. ఇది 9.11 మైళ్ళకు సమానము.
భారతీయ కాలగమన ప్రకారం .. 1 పగలు, రాత్రి = 810000 అర్ద నిమిషాలు. అనగా 1 సెకనుకు 8.75 అర్ద నిమిషాలు. కనుక ప్రతి అరనిమిషమునకు.
2202 X 9.11 = 20060.22 మైళ్ళు అట్లే
20060 X 8.75 = 188064 మైళ్ళు ప్రతి సెకనుకు.
ఇది ఆధునికలు కనుగొన్న కాన్తివేగానికి దాదాపు సమీపముగానే ఉన్నదీ. 20వ శతాబ్దనికి చెందిన శాస్త్రజ్ఞులు, మేకీల్ సన్స్, మోర్లె కాంతి వేగం 1,86,300 మైళ్ళు – ఒక సెకను అని కనుగొని ఉన్నారు. ప్రస్తుతానికి అది ప్రమాణము.  సాయణాచార్యులు చెప్పిన విషయం 1890వ సంవత్సరంలో మాక్సు ముల్లర్ సంకలనం చేసిన “ఋగ్వేదం” అను ఆంగ్ల గ్రంధంలో కూడా ప్రస్తావించబడింది. మాక్సుముల్లర్ సాయణాచార్యులు క్రీ.పూ. 1395లో రచించిన బుగ్వేద భాష్యం నుంచి ఈ విషయాలు గ్రహించారు. దీని అసలు ప్రతి నేడు వడోదరాలోని కేంద్ర గ్రంధాలయంలో భద్రపరచబడి ఉంది.
గమనిక: యోజనం అనగా 9మైళ్ళు అని అర్ధ శాస్త్రంలో చెప్పబడింది. 9మైళ్ళు అనగా 8,000 ధనస్సుల దూరం. ఒక్కొక్క ధనువు పొడవు 6 అడుగులు. కానీ ఆర్యభట్టుడు, బ్రహ్మగుప్తుడు మొదలైన ఖగోళ శాస్త్రజ్ఞులు (500 ఎ.డి) అంచనా ప్రకారం ఒక యోజనం అంటే నాలుగు క్రోసులు. అనగా దాదాపు 8 మైళ్ళు.
భారతదేశంలో పుట్టినందుకు ఆనందపడు... భారతీయునిగా జీవిస్తునందుకు గర్వపడు....
Thotapalli Sridhar Sarma గారి వాల్ నుండి.

1 comment:

  1. అమూల్యమైన రుగ్వేదకాలంనాటి శ్లోకగీతంలోని అద్వితీయమైన ఖగోళ కాంతిసందేశం.....

    ReplyDelete