" నేడు (2-10-2016) లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి".
* 1965 సెప్టెంబరు మాసంలో భారత్ పాకిస్తాన్ యుద్దం జరిగింది.
* ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి భారత్ కు అపూర్వ విజయాన్ని సాధించి పెట్టారు.
* .ఈ యుద్ధం ద్వారా పాకిస్తాన్ 1947 లో అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ము కాశ్మీర్ ప్రాంతంలోని హాజీపూర్, కార్గిల్ కొండలు మన ఆధీనంలోకి వచ్చాయి. అంతే కాకుండా పాకిస్తాన్ నగరాలైన లాహోర్, సియోల్ కోటలు మన సైనికుల పరిధిలోకి వచ్చాయి.
* అయితే అప్పటి రష్యా ప్రధాని కోసిగివ్ మధ్యవర్తిత్వంతో భారత , పాకిస్తాన్ మధ్య 1966 జనవరి 4 నుండి 10 వ తేదీ వరకు రష్యాలోని తాష్కెంట్ నగరంలో శాంతి చర్చలు జరిగాయి. ఒక ఒప్పందం కదుర్చుకున్నారు.
* ఒప్పందం ఏమిటంటే మన చేతచిక్కిన లాహోర్,సియోల్ కోటలనుండి సైన్యాన్ని వెనుకకు రప్పించడమేకాకుండా మన ఆధీనంలోకి వచ్చిన మన ప్రాంతాలైన హాజిపూర్, కార్గిల్ కొండలను కూడా పాకిస్తాన్ కు స్వాధీనపరచాలి.
* ఈ ఒప్పందాన్ని లాల్ బహదూర్ శాస్త్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. మనవైన హాజిపూర్, కార్గిల్ కొండలను పాకిస్తాన్ కు దారాదత్తం చేసేందుకు ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. కాని రష్యన్ల ప్రాపకం కోల్పోకూడదని నాటి విదేశాంగమంత్రి స్వరణ్ సింగ్, రక్షణ మంత్రి వై.బి.చవాన్, రష్యాలో భారతరాయబారిగా ఉన్న టి.ఎన్.కౌల్ లు ప్రధానమంత్రిపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చి భారత ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా, ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు, పరోక్షంగా రష్యాకు ప్రయోజనాన్ని కలిగిస్తూ, భారత్ కు నష్టాన్ని కలిగించే ఈ తాష్కెంట్ ఒప్పంద పత్రాలపైన బలవంతంగా సంతకాలు చేయించారు.
* తాష్కెంటు ఒప్పందంపై సంతకాలు చేసిన వెంటనే మనప్రధాని తాష్కెంటులోనే ఆకస్మికంగా మరణించాడు.
* ఆయన మరణాన్ని సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కాని ప్రజలెవరూ నమ్మలేదు, మరణం వెనుక కుట్రకోణం దాగి ఉన్నదని బలంగా విశ్వసించారు, విశ్వసిస్తున్నారు.
* ప్రియతమ ప్రధాని శాస్త్రిగారి మరణరహస్యాన్ని వెలికితీయవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉన్నది. ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించాలని భారతప్రజల ఆకాంక్ష.
" నేడు (2-10-2016) లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి".
* 1965 సెప్టెంబరు మాసంలో భారత్ పాకిస్తాన్ యుద్దం జరిగింది.
* ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నేతృత్వంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి భారత్ కు అపూర్వ విజయాన్ని సాధించి పెట్టారు.
* .ఈ యుద్ధం ద్వారా పాకిస్తాన్ 1947 లో అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ము కాశ్మీర్ ప్రాంతంలోని హాజీపూర్, కార్గిల్ కొండలు మన ఆధీనంలోకి వచ్చాయి. అంతే కాకుండా పాకిస్తాన్ నగరాలైన లాహోర్, సియోల్ కోటలు మన సైనికుల పరిధిలోకి వచ్చాయి.
* అయితే అప్పటి రష్యా ప్రధాని కోసిగివ్ మధ్యవర్తిత్వంతో భారత , పాకిస్తాన్ మధ్య 1966 జనవరి 4 నుండి 10 వ తేదీ వరకు రష్యాలోని తాష్కెంట్ నగరంలో శాంతి చర్చలు జరిగాయి. ఒక ఒప్పందం కదుర్చుకున్నారు.
* ఒప్పందం ఏమిటంటే మన చేతచిక్కిన లాహోర్,సియోల్ కోటలనుండి సైన్యాన్ని వెనుకకు రప్పించడమేకాకుండా మన ఆధీనంలోకి వచ్చిన మన ప్రాంతాలైన హాజిపూర్, కార్గిల్ కొండలను కూడా పాకిస్తాన్ కు స్వాధీనపరచాలి.
* ఈ ఒప్పందాన్ని లాల్ బహదూర్ శాస్త్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. మనవైన హాజిపూర్, కార్గిల్ కొండలను పాకిస్తాన్ కు దారాదత్తం చేసేందుకు ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. కాని రష్యన్ల ప్రాపకం కోల్పోకూడదని నాటి విదేశాంగమంత్రి స్వరణ్ సింగ్, రక్షణ మంత్రి వై.బి.చవాన్, రష్యాలో భారతరాయబారిగా ఉన్న టి.ఎన్.కౌల్ లు ప్రధానమంత్రిపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చి భారత ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా, ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు, పరోక్షంగా రష్యాకు ప్రయోజనాన్ని కలిగిస్తూ, భారత్ కు నష్టాన్ని కలిగించే ఈ తాష్కెంట్ ఒప్పంద పత్రాలపైన బలవంతంగా సంతకాలు చేయించారు.
* తాష్కెంటు ఒప్పందంపై సంతకాలు చేసిన వెంటనే మనప్రధాని తాష్కెంటులోనే ఆకస్మికంగా మరణించాడు.
* ఆయన మరణాన్ని సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కాని ప్రజలెవరూ నమ్మలేదు, మరణం వెనుక కుట్రకోణం దాగి ఉన్నదని బలంగా విశ్వసించారు, విశ్వసిస్తున్నారు.
* ప్రియతమ ప్రధాని శాస్త్రిగారి మరణరహస్యాన్ని వెలికితీయవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉన్నది. ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించాలని భారతప్రజల ఆకాంక్ష.
" నేడు (2-10-2016) లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి".
No comments:
Post a Comment