Thursday, 14 September 2017

వేదగణితం - ఒక కథ

*వేదగణితం - ఒక కథ*

చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘన పనస చదివి ఆశీర్వదించాడు.

అప్పుడు ఆ రాజుగారు *ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా* *నేర్చుకుని చదవ వచ్చు! చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను.*అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు *రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోష పరచడానికి ఆడతాను* అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.

రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు. కానీ ఆ పండితుడు *రాజా! ఆట ను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలి గాను అని గొప్పగా చెప్పుకోవచ్చు!* అంటూ సున్నితంగాతిరస్కరించాడు.

*సరే! పండితా! నీ తెలివి ని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు!* అన్నాడు రాజుగారు.

*మహారాజా! చదరంగం లో 64 గడులు ఉంటాయి కదా! ఒక గడిలో ఒక* *గింజ - రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు* *గింజలు - మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -* *నాలుగవ గడికి మళ్లి* *రెట్టింపు 8 గింజలు -*
*.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం.* అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు సరే! అని ఆ పని మంత్రికిపురమాయించాడు.

ఆ పండితుని వెంటమంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు *పండితుడడి గాడు కదా.. మొదటి* *గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు..* *మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు, తర్వాత 8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు.. అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు..* *వెఱ్ఱి పండితుడు.. గింజ లకు గింజలు రెట్టింపు చేసుకుపోయినా ఎన్ని వస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..*

*అలా తీసెయ్యకండి మహారాజా!.. ఆ పండితు డేమీ వెర్రిబాగులవాడు కాదు..*

*ఎందుచేత..?* అన్నాడు రాజుగారు.

*లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!!!*

*ఎందుకు..?* ఆశ్చర్య పోతూ అడిగాడు మహారాజు

ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటల కొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణం లో చెప్పేసాడు మహారాజా! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపక మాల పద్యం కూడా చెప్పాడు.

*అలాగా.. ఏమిటా పద్యం..?*

*ఇదుగో.. వినండి మహారాజా !*

శర శశి షట్క చంద్ర శర
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ ధర గగనాబ్ధి వేద గిరి
తర్క పయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు సంఖ్యకు
నిజంబగు తచ్చతురంగ గేహ విస్తర మగు రెట్టికగు
సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

పద్యం విన్న మహారాజు *దీన్లో తేలిన లెక్కెక్క డుంది..?అంతా బాణా లూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలుతప్ప..*

*అదే మహారాజా! మన దేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరము లతో అనల్పార్థ సాధకం గా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..*

‘సరే… సరే.. విప్పి చెప్పు..’

*ఈ పద్యంలో లెక్క చిక్కు విడిపోవాలంటే మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతా లుగా ఏర్పాటు చేసుకున్నారు.

ఈ పద్యంలో

*శర, సాయక,* -  అనే పదాలకు అర్థం బాణాలు అని.( మన్మథుని పంచ సాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.

*గగన, వియత్ - 0*
(ఆకాశం గగనం శూన్యం)

*శశి, చంద్ర, తుహినాంశు -1*(చంద్రుడొకడే భూమి కి )
*షట్కము - 6*
*రంధ్ర - 9*
(నవరంధ్రాలు)
*నగ, గిరి, భూధర - 7*
*అగ్ని - 3*
(మూడగ్నులు; గార్హపత్యాగ్ని,దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)
*అబ్ధి, పయోనిధి - 4*
*వేద -4*
(చతుర్వేదములు)
*తర్క - 6*
(షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)
*పద్మజాస్య - 4*
(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)
*కుంజర - 8*
(అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెల సంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’
శర శశి షట్క చంద్ర శర
5     1     6         1    5
సాయక రంధ్ర వియత్
5            9       0
నగాగ్ని భూ
    7       3
ధర గగనాబ్ధి వేద గిరి
  7     0  4      4    7
తర్క పయోనిధి
6         4
పద్మజాస్య కుం
    4    
జర తుహినాంశు
8         1
సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు   సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

*అంకెలులెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. "అంకానాం వామతో గతిః"* - కుడి నుంచి ఎడమకు చేర్చి చదువు కోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.
*1,84,46,74,40,73,70,95,51,615*

*ఒకకోటి 84లక్షల 46 వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615*

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
*ఒక ఘనమీటరు విస్తృతి గల గాదెలో దాదాపు* *ఒకటిన్నర కోటి గింజ లు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,*
*4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు* *దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..*

*పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు..* అంటే *భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.*

పోనీ *లెక్కపెట్టడానికి ఎంత సమయం* *పడుతుందో అంటే*
*సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సం.।।లు...*

అదీ సంగతి…

వేదపండితులతో వేళా కోళం తగదు మహారాజా!… *నిజానికి అతడు చదివిన ఘనపనస* *కూడా లెక్కలకు,ధారణ శక్తికి సంబంధించినదే!* *ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘణాపాటి కాలేరు.* అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించ పరిచారు. ఇప్పుడు ఏం చేయడం? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది.

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకుల నుండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు.

ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నేఅడుగుదాము.అని ఆ పండితున్ని పిలిపించిక్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏంచేయాలో చెప్పుమన్నాడు.

ఆ పండితుడు *రాజా! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము.ధాన్యంబదులు గా అవును ఇవ్వండి చాలు!* అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.
 

ఐరాసలో తొలిసారి దీపావళి వేడుక

*🚩ఐరాసలో తొలిసారి దీపావళి వేడుక🌴*
ఐక్యరాజ్యసమితి:
🌹భారతీయుల సమున్నత సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే దివ్వెల పండుగ దీపావళి తొలిసారి ఐక్యరాజ్యసమితిలో వెలుగులు నింపింది.
 దీపావళిని పురస్కరించుకుని ఐరాస కార్యాలయంలో ఈ పండుగ ఘనంగా జరిగింది. ప్రధాన కార్యాలయాన్ని దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. 'హ్యాపీ దీపావళి' సందేశం దీపకాంతులతో వెలుగులు విరజిమ్ముతూ కార్యాలయ శోభను మరింత పెంచింది. 'ఐరాసలో దీపావళి పండుగ జరుపుకోవడం ఇదే తొలిసారి' అని *యూఎన్‌లో భారత రాయబారి సైయద్ అక్బరుద్దీన్ తన సంతోషాన్ని ఓ ట్వీట్‌లో అందరితో పంచుకున్నారు*. ఇందుకు చొరవ తీసుకున్న *జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ పీటర్ థామ్సన్‌కు ధన్యవాదాలు తెలిపారు*.
ఐరాస ప్రధాన కార్యాలయం మీదుగా వెళ్లేవారు కార్యాలయంపై వెలుగుజిలుగులు వెదజల్లుతున్న దీపావళి సందేశాన్ని, ఆ శోభను తమ కెమెరాల్లో క్లిక్ మనిపిస్తున్న ఫోటోలను కూడా అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. చీకటిని తరిమికొట్టి మానవాళి జీవితాల్లో సరికొత్త ఆశలు, వెలుగులు నింపే పండుగ దీపావళి అని, చెడుపై మంచి సాధించే విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. దీపావళి ప్రాధాన్యత గుర్తిస్తూ 2014 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితిలోని పలు సభ్యదేశాలు కూడా దీపావళి పండుగ జరుపుకొంటున్నాయి.

♦అధికారికంగా ఆ రోజు యూఎన్‌కు సంబంధించిన ఎలాంటి సమావేశాలు ఉండవు.

బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి

బ్రాహ్మణులు చేసిన పాపం ఏమిటి?
----------------------------------------------------

చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అనుకుని క్షమించి వదలివేసింది.

 అంతకుమించి...మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వవిద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి.

కానీ... ధర్మ పరిరక్షణకు, సమాజ సంక్షేమానికి కట్టుబడిన బ్రాహ్మణులు మాత్రం ఆధునిక భారతావనిలో పీడనకు గురవతూనే ఉన్నారు.

గత రెండు శతాబ్దాలుగా ఈ విధమైన బ్రాహ్మణ వ్యతిరేకవాదం సమాజంలో వేళ్లూనుకుపోయింది.

ఇతరులెవరికీ విద్యాబుద్ధులు నేర్చుకునే అవకాశాన్ని బ్రాహ్మణులు ఇవ్వలేదనేది వారు చేసే వితండవాదం.

సమాజంలో తమదే ఉన్నతస్థానమని చాటుకునేందుకే బ్రాహ్మణులు హిందూ ధర్మశాస్త్రాలను స్వయంగా రూపొందించుకున్నారని, సమాజంలో తలెత్తిన వైపరీత్యాలకు ఈ ధోరణే కారణమైందనేది చాలామంది మేధావుల అభిప్రాయం కూడా.

అయితే ఈ రకమైన వాదనల్లో హేతుబద్ధతగానీ, వాటికి చారిత్రక ఆధారాలుగానీ లేవు. ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే అదే నిజమవుతుందనే నానుడికి ఇలాంటి వాదనలు అద్దం పడతాయి.

బ్రాహ్మణులు ఎప్పుడూ పేదలే.
వారెప్పుడూ భారతదేశాన్ని పాలించలేదు. చరిత్రలో బ్రాహ్మణులెవరైనా ఏదైనా భూభాగాన్ని పాలించారనడానికి చారిత్రక ఆధారమేదైనా ఉందా?

(సమైక్య భారతావనికోసం చంద్రగుప్త వౌర్యుడికి చాణక్యుడు సహకరించాడు. చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాక చాణక్యుడి కాళ్లపై పడి రాజగురువుగా కొనసాగుతూ తన ఆస్థానంలోనే ఉండిపొమ్మని వేడుకున్నాడు. అప్పుడు చాణుక్యుడు ‘నేను బ్రాహ్మణుడిని. పిల్లలకు విద్యాబుద్ధులు గరపడం నా ధర్మం. వారు భిక్షమెత్తుకుని తెచ్చిందే నాకు జీవనాధారం. కాబట్టి నేను నా గ్రామానికి వెళ్లిపోవడమే ధర్మం’ అని జవాబిచ్చాడు).

పురాణాల్లోగాని, చరిత్రలోగానీ ధనవంతులైన బ్రాహ్మణులు ఉన్న ఉదంతాన్ని ఒక్కటైనా చెప్పగలరా?

కృష్ణ భగవానుడి జీవితగాథలో సుధాముడి (కుచేలుడు)కి ప్రత్యేక స్థానం ఉంది. సుధాముడు పేద బ్రాహ్మణుడు కాగా కృష్ణుడు యాదవుడు. ప్రస్తుతం యాదవులు ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) జాబితాలో ఉన్నారన్నది గమనార్హం. బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి. ఆయన కిరాతుడని పురాణాలు చెబుతున్నాయి. కిరాతులు ఇప్పుడు ఎస్టీలుగా కొనసాగుతున్నారు.

మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి. భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారు. బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు. మరి..ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా?

వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు. కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన. బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు?

చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే?
ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం.
ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది. ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం.

ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు?
తిరువళ్లువార్ తిరుక్కురళ్‌ను ఎలా లిఖించగలిగాడు?
ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా?
మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా?

వశిష్టుడు, వాల్మీకి, కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, మహావీరుడు, తులసీదాసు, కబీర్, వివేకానంద...వీరంతా బ్రాహ్మణేతరులే.

వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా?

అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ?

 మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే! ఆయన ఓ క్షత్రియుడు.

కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు.

ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి. అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే.

అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు. గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు. బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి. ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.

 ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా? వారణాసి, గంగాఘాట్, హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు. పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు. ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరికి, వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు. కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు. ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా?

ఎందుకంటే వారు హింసను వదిలి అహింసా జీవనాన్ని గడిపేవారు.

(భారత్‌కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్.. పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు. దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని). సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు. జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు.

కాశ్మీర, గాంధార దేశాల్లో (ఇప్పటి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లోని భాగాలు) సారస్వత బ్రాహ్మణులను విదేశీ ఆక్రమణదారులు ఊచకోత కోశారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మలు మచ్చుకైనా కనిపించరు. ఇంతలా మారణహోమం జరుగుతున్నప్పుడు ఏ ఒక్క సారస్వత బ్రాహ్మడైనా తిరగబడిన దాఖలాలు ఉన్నాయా?

ఎందుకంటే వారు తాపస జీవనాన్ని వృత్తిగా ఎంచుకున్న వారు.

(పాకిస్తానీ మిలిటెంట్ల దురాగతాలకు తాళలేక కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు. ఉగ్రవాదులు చేపట్టిన కాశ్మీరీ లోయ ‘ప్రక్షాళన’ కార్యక్రమానికి తాళలేక కాశ్మీరీ పండిట్లు విలువైన తమ ఆస్తిపాస్తులనే కాదు...ప్రాణాలనూ కోల్పోయారు. ఐదు లక్షలమందికి పైగా పండిట్లు కాశ్మీర్ లోయను వదలిపెట్టి వలస పోయారు. వీరిలో 50వేలమందికి పైగా ఇప్పటికీ శరణార్థి శిబిరాల్లోనే కాలం గడుపుతున్నారు. కాశ్మీరీ పండిట్లు ఇంత పీడనకూ, వేదనకూ గురైనా ఎన్నడైనా తిరగపడిన ఉదంతాలు ఉన్నాయా?)

ఎందుకంటే వారు వారు ద్వేషాన్ని వదిలి శాంతి జీవనాన్ని గడిపేవారు.

భారత్‌పైకి అరబ్బు దేశంనుంచి దండెత్తి వచ్చిన మహమ్మద్ బీన్ ఖాసిం బ్రాహ్మణులంతా సున్తీ చేయించుకోవాలని షరతు విధించాడట. వారు నిరాకరించినందుకు పదిహేడేళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు మరణశిక్ష విధించేవాడట. ముస్లిం చరిత్రకారులను ఉటంకిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వాస్తవమిది. భారత్‌పై దండయాత్రలు జరిగిన సమయాల్లోనూ, మొఘలుల కాలంలోనూ వందలు, వేలమంది బ్రాహ్మణులు ఊచకోతకు గురయ్యారు. కానీ...బ్రాహ్మణులు తిరగబడిన ఉదంతాలు ఒక్కటీ కనబడవు.

ఎందుకంటే వారు సౌత్విక జీవనాన్నీ - సాత్విక గుణాలనే సంపదగా భావించేవారు.

19వ శతాబ్దం తొలినాళ్లలో ఓ దీపావళి రోజున టిప్పు సుల్తాన్ సైన్యం మేల్కోటే ప్రాంతంపైకి దండెత్తివచ్చి 800 మందిని ఊచకోత కోసింది. మృతుల్లో అత్యధికులు మాం డ్యం అయ్యంగార్లే. సంస్కృతంలో ప్రవీణులు వారు. (ఇప్పటికీ మేల్కోటేలు దీపావళి పండుగ జరుపుకోరు).

వారణాసిలో రిక్షా తొక్కేవారిలో చాలామంది బ్రాహ్మణులనే విషయం ఎంతమందికి తెలుసు?

ఢిల్లీ రైల్వే స్టేషన్లలో బ్రాహ్మణులు కూలీలుగా పనిచేస్తున్నారనే సంగతి తెలిస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం. న్యూ ఢిల్లీలోని పటేల్‌నగర్‌లో నివసించే రిక్షా కార్మికుల్లో 50శాతం మంది బ్రాహ్మణులే.

ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లలో పనిచేసేవారు, వంటవాళ్లలో 75శాతం మంది బ్రాహ్మణులే.

 మన దేశంలో 60శాతం మంది బ్రాహ్మణులు పేదరికంలో మగ్గుతున్నారు. వేలాది బ్రాహ్మణుల పిల్లలు ఉద్యోగాల వేటలో అమెరికాకు వలస పోతున్నారు. అక్కడ సైంటిస్టులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారు. మన దేశంలో నిపుణుల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వాలు వారిగురించి ఎందుకు ఆలోచించడం లేదు?

గత కాలపు బ్రాహ్మణ సమాజం మొత్తం పులుకడిగిన ముత్యం కాకపోవచ్చు. వారిలో ఏ కొద్దిమంది చేతులకో రక్తం అంటి ఉండవచ్చు. వారు చేసిన తప్పులను మొత్తం బ్రాహ్మణులందరికీ అంటగట్టడం సబబేనా?

సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలును ఈ ప్రపంచం ఏనాడో మరచిపోయింది. బ్రాహ్మణులు కేవలం వేదాలు, గణిత, ఖగోళ శాస్త్రాల అధ్యయనానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయుర్వేద, ప్రాణాయామ, కామసూత్ర, యోగ, నాట్య శాస్త్రాలను అభివృద్ధి చేసి మానవాళికి అందించిన ఘనత నిస్సందేహంగా వారిదే.

బ్రాహ్మణులు స్వార్ధపరులే అయితే, విలువైన ఈ శాస్త్రాలన్నిటిమీద హక్కు తమదే అని చాటుకునేవారు. అతి ప్రాచీనమైన శాస్త్రాలపై తమ పేర్లు లిఖించుకుని ఉండేవారు.

‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అనే ఒకే ఒక్క ఆశయంతో మానవాళి సంక్షేమంకోసం తమ జీవితాలను త్యాగం చేశారు. అందుకు ప్రతిఫలంగా బ్రాహ్మణుల్ని శిలువపైకి ఎక్కించేందుకు ఈ లోకం ప్రయత్నిస్తోంది. ఎంత విచారకరం!

"చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతు . లోకాసమస్తా సుఖినోభవంతు. " అనేది తరతరాలుగా వస్తున్న ప్రార్థన.
అంటే నాలుగు సముద్రాల వరకు వ్యాపించిన ఈ భూమిపై నివసించే ఆవులూ -బ్రాహ్మణులు శుభకరంగా ఉండు గాక ! అప్పుడే ఈ లోకం లో కూడా ధర్మం వృద్ధి చెంది సుభిక్షంగా ఉంటుందని అర్థం.

ఇప్పుడు ఆవులకూ విలువ ఇవ్వడం లేదు .
బ్రాహ్మణులనూ ఉద్దేశపూర్వకంగా అణిచి వేస్తున్నారు.

ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించండి!


భారతీయ శ్లోకాల్లో సైన్స్

భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు…!!

భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం… అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో రెండంటే రెండు నీటి బిందువులు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.


1. హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం

2. గాయత్రి మంత్రం...



ముందుగా తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…

“యుగ సహస్ర యోజన పర భానూ!

లీల్యోతాహి మధుర ఫల జానూ”!!

దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…

యుగ= 12,000 దివ్య సంవత్సరములు

సహస్ర=1000

యోజన్= 8 మైళ్ళు

యుగ x సహస్ర x యోజన= పర్ భాను

12000 x 1000 x 8 మైళ్ళు=96000000 మైళ్ళు

1 మైళు = 1.6 కిలో మీటర్లు

96000000 మైళ్ళు = 96000000 x 1.6 కిలో మీటర్లు =

153600000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)



ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు.



హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.



ఇప్పుడు గాయత్రీ మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. మహిమ అనంగానే అదేదో మ్యాజిక్కు, మాయ అని కాకుండా మహిమను ఙ్ఞానమార్గంగా తీసుకుందాం. అప్పుడే ఙ్ఞానాభివృధ్ధి కలుగుతుంది.



అమెరికన్ శాస్త్రవేత్త డా.హోవార్డ్ స్టెయిన్జెరిల్.. గాయత్రీ మంత్ర బీజాక్షరముల ధ్వనులపై తనయొక్క లేబొరేటరీలో పరిశోధన చేయగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు…



ఆయన తెలిపిన వివరాలు ఏంటంటే…



గాయత్రీ మంత్రం ఉఛ్ఛారణ జరుగుతున్నప్పుడు 1,10,000 ధ్వని తరంగాలు ఒక్క సెకనులోనే విడుదలయ్యాయని, ఈ ప్రపంచంలో మరే శ్లోకానికి గాని, పదాలకు గాని ఇంతటి శక్తి లేదని తేల్చి చెప్పాడు.



గాయత్రీ మంత్రోఛ్చారణ సమయంలో బీజాక్షర విస్ఫోటనం సంభవిస్తుంది. అది వినినా లేదా పఠించిన అయా వ్యక్తులకు మానసిక వికాసం పరిఢవిల్లుతుంది అని ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో కూడా అది స్పష్టమయింది.



ఈ విషయాన్ని గ్రహించిన ఎన్నో ఇతర దేశాలు గత రెండు సంవత్సరముల నుండి సూర్యోదయ సమయమందు పఠనం లేదా శ్రవణం చేయడం వారి జీవితాలలో ఒక భాగంగా చేసుకున్నారు.



వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!

ఇదీ మన భారత వైశిష్ట్యం…

ఇదీ మన వేద విఙ్ఞాన సారం…

ప్రతి భారతీయుడికి గర్వకారణం…

మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం…!!

అక్షతలు ఎందుకు వేస్తారు

*అక్షతలు ఎందుకు వేస్తారు*

తలంబ్రాలు లేని పెళ్లిని ఊహించలేము, అలాగే అక్షతలు లేని ఆశీర్వచనాన్ని కూడా సంపూర్ణంగా భావించలేము.

ఇంట్లో పూజ చేసుకున్నా, రాములవారి కళ్యాణానికి వెళ్లినా... చేతిలో అక్షతలు లేకపోతే మనసులో ఏదో చింత. ఇంతకీ ఆ అక్షతలకి ఎందుకంత ప్రాముఖ్యత?

*అక్షతలు అంటే  క్షతం కానివి. క్షతం అంటే గాయపడటం, విరిగిపోవడం అన్న అర్థం వస్తుంది. కాబట్టి క్రతువులలో వినియోగించే నిండైన బియ్యాన్ని అక్షతలు అంటారు.

 ఇప్పుడంటే జీవితాలలో సుఖం ఎక్కువైపోయి అన్నం విలువ తెలియడం లేదు. కానీ ఆహారం లేని జీవితాన్ని ఊహించుకోలేం కదా! ధాన్యం కేవలం ఆ ఆహారానికి మాత్రమే కాదు, జీవితంలోని సమృద్ధికి కూడా సూచనగా భావిస్తుంటారు పెద్దలు. అందుకనే మంచికైనా, చెడుకైనా విరగని బియ్యపు గింజలని (అక్షతలు) వినియోగిస్తుంటారు.

*పూజలలో* – భగవంతుని పూజించే సమయంలో అక్షతలను వినియోగించడం పరిపాటి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. పూజలో ఏ ద్రవ్యం లేకపోయినా కూడా ఆ స్థానంలో అక్షతలను ఉపయోగించవచ్చు. అలా ఎలాంటి లోటూ లేకుండా పూజ సాగిపోయేందుకు అక్షతలు తోడ్పడతాయి. ఇక పూజ పూర్తయిన తరువాత ఆ ఫలాన్ని నలుగురికీ అందించేందుకు కూడా పూజాక్షతలను అందించడం పరిపాటి అయంది.

*ఆశీర్వచనంలో* – పిల్లలు సుఖసంతోషాలతో జీవించాలని, పెద్దలు తల మీద అక్షతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇలా బ్రహ్మరంథ్రం మీద అక్షతలు చల్లడం వల్ల, వారిలోని సానుకూల తరంగాలు మనకి చేరతాయని చెబుతారు. ఒకరి నుంచి ఒకరికి ఇలా ‘శక్తిపాతం’ ద్వారా అనుగ్రహం లభించేందుకు అక్షతలు తోడ్పడతాయి.

*తలంబ్రాలు*– పెళ్లిలో వధూవరులు ఒకరి తల మీద మరొకరు పసుపు కలిపిన బియ్యాన్ని పోసుకోవడం చూసేదే. విరగని బియ్యంలాగా తమ జీవితాలు కూడా అక్షతంగా సాగిపోవాలని ఇందులో ఓ సూచన కనిపిస్తుంది. అంతేకాదు! ఒకరిమీద ఒకరు తలంబ్రాలు పోసుకునే చర్యతో వారిరువురి మధ్యా ఒక అయస్కాంత చర్య ఏర్పడుతుందనీ... అది వారు జీవితాంతం కలిసిమెలిసి ఉండటానికి తోడ్పడుతుందనీ చెబుతారు. అదేమో కానీ తలంబ్రాలు పోసుకునే క్రతువుతో ఇద్దరిమధ్యా చనువు ఏర్పడటం మాత్రం అందరూ గమనించేదే!

*ఏ రంగు బియ్యం?* –  పసుపు హిందువులకు శుభసూచకం, పైగా క్రమిసంహారక శక్తి కలిగిన ద్రవ్యం. అందుకే శుభకార్యాలలో పసుపుతో చేసిన అక్షతలను మాత్రమే ఉపయోగించాలి. తెల్లటి బియ్యాన్ని అక్షతలుగా అశుభకార్యాలలోనూ, ఎరుపురంగు బియ్యాన్ని అక్షతలుగా అమ్మవారి పూజలోనూ వాడటం ఆనవాయితీ.

పసుపు కలిపిన బియ్యం వెనుక మరో మర్మం కూడా కనిపిస్తుంది. మనఃకారకుడైన చంద్రునికి బియ్యం ప్రీతి కలిగిస్తాయి అని చెబుతారు. అందుకే జాతకంలో చంద్రునికి సంబంధించిన దోషాలకు పరిహారంగా బియ్యాన్ని దానం చేయమంటారు. ఇక పసుపు గురుగ్రహానికి ఇష్టమైన రంగు. గురుడు అదృష్టం, కీర్తి, సంతాన ప్రాప్తి, విద్య, ఆరోగ్యం... వంటి సకల శుభాలకూ కారకుడు. అంటే అక్షతలు ఇటు చంద్రునికీ, అటు గురునికీ కూడా ప్రీతి కలగచేసి సకల శుభాలనూ అందిస్తాయన్నమాట.

లోకాసమస్తా సుఖినోభవంతు💐

వారానికి 7 రోజులు ఎందుకు

#వారానికి 7 రోజులు ఎందుకు??
#రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది??
#ఆదివారం తర్వాత సోమవారం_ఎందుకు?
మంగళ వారం రావొచ్చుగా??
మనలో కూడా చాలా మందికి
తెలియని విషయాలు తెలుసుకుందాం..
#ప్రపంచంలోఏదేశానికి లేని జ్ఞాన సంపద మన సొత్తు..
ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి...
మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే
ఏంటో తెలియక ముందే నవ గ్రహలను
గుర్తించిన ఘనత మనదే..
ఎప్పుడు సూర్యోదయం అవుతుంది?
ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది?
#ఎప్పుడు_చంద్రగ్రహణం?
#ఎప్పుడు_సూర్యగ్రహణం?
ఏ కార్తె లో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా
మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే..
ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే..
పైన ప్రశ్నకి జవాబు:-
మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది.
ఆదివారము, సోమవారము, మంగళ వారము,
బుదవారము, గురువారము,
శుక్రవారము, శని వారము. ఇవి ఏడు.
ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు
ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది.
నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో
భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు
ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే
ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.
భారత కాలమానంలో #హోరా అనగా ఒక గంట అని అర్థం.
దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు #HOUR .
ఒక రోజుకు 24 గంటలుంటాయి,
అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న
24 గంటలు (24 హోరాలు) కూడా
ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి
ఆ హోరాలకి ఏడు పేర్లున్నాయి.
అవి వరుసగా.. (ఈ వరుసలోనే) శని, గురుడు,
కుజుడు, రవి, శుక్ర, బుద,
చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి.
ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి..
7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక
మల్లి మొదటి హోరాకి వస్తుంది.. అంటే
శని హోరా నుండి చంద్ర హోరాకి మల్లి శని హోరాకి..
ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో
ప్రారంభం అయి మూడు సార్లు పూర్తికాగా
(3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు)
22వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది.
23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది.
24 వ హోరా బుధ హోర అవుతుంది.
దాంతో ఒక రోజు పూర్తవుతుంది.
ఆ తర్వాత హోరా 25వ హోరా.. అనగా
తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా.
అనగా సోమవారము.. అనగా
చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది.
ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో
ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.
చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమవారము.
ఈ విధంగానే మిగిలిన దినములు కూడా
ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి
రవి(సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం,
ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే..సో ఆదివారం,
భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం
(కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు)
ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి...
ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి?
మంగళ వారమ్ రాకూడదా??
రాదు.. ఎదుకంటే
ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది,
తరువాత రోజు అంటే సోమవారం
చంద్ర హోరాతో ప్రారంభం అయ్యింది కాబట్టి..
ఇది మన భారతీయుల గొప్పతనం..
ఈ విషయాలు తెలియక మనల్ని మనం
చిన్న చూపు చూసుకుంటాం..
ప్రపంచంలో దేశమయినా
మన పద్దతి ఫాలో అవ్వాల్సిందే
కానీ మనకి మాత్రం మనం అన్నా
మన దేశమన్నా లోకువ...
ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు
పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని
ప్రపంచమంతా అనుసరిస్తున్నది..

శ్రీరాముడే భారతీయుల అంతరాత్

శ్రీరాముడే భారతీయుల అంతరాత్మ;

తండ్రితో రాముడు;
నీవు అరణ్యాలకి వెళ్ళాలని చెప్పడానికి దశరధ మహారాజు సంశయిస్తున్నాడని చెప్పిన కైకేయితో..రాముడు " అమ్మా!నా తండ్రిగారి ఆజ్ఞ్య ఏదైనప్పటికీ నేను అగ్నిలో దూకవలసి వచ్చినప్పటికీ మారు మాట్లాడకుండా నెరవేరుస్తాను..ఐతే తండ్రి గారే  స్వయంగా ఆదేశం ఇవ్వకపోవడం నాకు  దుఖం కలిగిస్తున్నది.."

సోదరబందం;
లక్ష్మణుడు రాముని దైవ సమానంగా భావిస్తే ..రాముడు కూడా లక్ష్మణుడు తోడు లేకుండా తినటానికి గాని, నిద్రించడానికి కూడా  సమ్మతించేవాడు కాదు..

గురువుతో రాముడు;
శివధనుర్బంగం చేయడానికి ప్రగల్బాలు పలుకుతూ వచ్చిన  వీరాధి వీరులందరూ విఫలమౌతున్నారు..
శివధనస్సు ని అవలీలగా ఎక్కుపెట్టగల సామర్ద్యమున్న రాముడు మాత్రం గురువు ఆదేశం వచ్చిన మీదటనే గురువుగారి ఆశీర్వాదం  తీసుకుని ధనుర్భంగం చేశాడు..

భార్య గురించి  రాముడు;
అరణ్యవాసంలో ఉండగా సీత అపహరించబడినప్పుడు రాముడు లక్ష్మణునితో "సీత కనుక మరణించినట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను..ఆమె లేకుండా జీవించడం అనే ఆలోచన కూడా భరించలేను. అయ్యో లక్ష్మణా! సీతను రక్షణ లేకుండా వదిలి వచ్చి నన్ను ఎలా మోసగించావయ్యా?"..

మిత్రుడితో రాముడు;
సుగ్రీవుడు తన కష్టాలన్నీ రాముడితో చెప్పుకున్నప్పుడు రాముడు "సేవయే స్నేహానికి  నిజమైన ఫలం. నీరాజ్యాన్ని, భార్యను తిరిగి పొందడంలో నీకు సహాయం చేయడం నా విధి."

భక్తునితో రాముడు;
సముద్రాన్ని దాటి సీతజాడ కనిపెట్టి ఆమె క్షేమ సమాచారాన్ని హనుమంతుడు రామునికి తెలియచేసినప్పుడు రాముడు " ప్రియ హనుమంతా ! నీవు సీత జాడ కనిపెట్టి నాకు అమితానందాన్ని కలిగించావు..అందుకు ప్రతిగా నీకు సముచితమైన బహుమానం ఇవ్వడానికి నేను ఇప్పుడు ప్రవాస జీవితం గడుపుతున్నందున నీకు నా ఆలింగనాన్ని  మాత్రమే ఇవ్వగలను" అంటూ ప్రేమాభిమానాలతో హనుమంతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు..

శత్రువుతో  రాముడు;
రావణుడు రాముడుకి ఎదురుపడిన మొదటిరోజున రాముడు అతని ధ్వజాన్ని విరిచి, రధాన్ని కూల్చి, రావణుడుని తీవ్రంగా గాయపరిచాడు..నిస్సహాయ స్థితిలో ఉన్న రావణుడితో "ఉదయం నుంచి యుద్ధం చేయడం వల్ల బాగా అలసిపోయి ఉన్నావు..నిరాయుదుడివై ఉన్నావు..ఈ స్థితిలో నిన్ను సంహరించలేను.
నీవు లంకకు తిరిగి వెళ్లి విశ్రాంతి తీసుకో.బాగా కోలుకుని శక్తిని పుంజుకున్న మీదట నీతో యుద్ధం చేస్తాను"  అన్నాడు..

రాముడు నేను దైవాన్నని ఎప్పుడూ చెప్పుకోలేదు. నరుడినని చెప్తూ మానవజాతికి విశేషమైన గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టినందుకు మొత్తం మానవజాతి అంతా ఆయనకి ఋణపడి పోయింది.
భవసాగరాన్ని దాటాలనుకునేవారికి దివ్యౌషదం "శ్రీరామ" నామామృతం..

"శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష"

గురుపూజ

గురువు- గురుపూజ- గురుదక్షిణ

భగవాధ్వజం సార్వదేశికం. ఏకతకు ప్రతీక. రాష్ట్రం, సంస్కృతి, పరంపర, చరిత్ర, బలిదానం, సేవకు ప్రతీక. యుద్ధానికీ ప్రతీక.

గురుకృప లేనిదే జ్ఞానం కలగదు. భక్తి జాగృతం కాదు. కర్మచేసే క్షమత రాదు. ఈశ్వర సాక్షాత్కారం కలగదు.

బ్రహ్మచర్యాశ్రమంలో గురువు వద్ద పొందిన గుణాల వల్ల భావి జీవితం నిర్మాణమవుతుంది- రాముడు, కృష్ణుడు.
భీష్ముడు వంశోద్ధరణ కోసం, ద్రోణుడు వృత్తిగా, అర్జునుడు ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠ ధనుర్ధారి కావాలనే కాంక్షతో ధనుర్విద్య అభ్యసించారు. ఏకలవ్యుడు మాత్రం సాధు జంతువులను, తన గూడెం ప్రజలను క్రూర జంతువులనుండి కాపాడుకోవడం కోసం ధనుర్విద్య అభ్యసించాడు.( జీవన ఉద్దేశాన్ని బట్టి జీవన పరిణామం ఏర్పడుతుంది)

' గురు ' అంటే బృహస్పతి అనే పర్యాయ అర్థం కూడా ఉంది.

గురువు అవడం అనేది నిరంతర ప్రక్రియ. అటువంటపుడు శిష్యత్వం కూడా నిరంతరమే.

గురువు శిష్యుడు కావడమనేది గుణాత్మక ప్రక్రియ. శిష్యుడు గురువు అయ్యే ప్రయత్నం సాధనా ప్రక్రియ.

మనం సాధించలేని ప్రక్రియకు సంకేతంగా గురువు ఉండకూడదు. అలా ఉంటే మనం నిరంతరం శిష్యుడిగానే ఉండిపోతాం. గురువుగా మారలేం.

గురువు భూలోక మానవులకే కాదు. దేవలోక దేవతలకూ ఉండేవాడు.

మనిషిని సృష్టించడం దేవుడి ధర్మం కాగా మనిషిని మహాత్ముడిగా పరివర్తన చేయడం గురువు ధర్మం.

గురుశిష్యుల విషయంలో రెండు న్యాయాలు. ఒకటి మార్జాల కిశోర న్యాయం. పిల్లి తన పిల్లను మునిపళ్ళతో పట్టుకుని పోతుంది. ఇందులో మార్జాల కిశోరం(పిల్లి పిల్ల) బాధ్యత ఎంత మాత్రం లేదు. బాధ్యత సాంతం తల్లిదే. కృష్ణార్జునులలో  కృష్ణుడే అర్జునునికి జ్ఞానం బోధించే బాధ్యత స్వీకరించాడు. అర్జునుడు కనీసం అర్థించలేదు.

రెండవ న్యాయం మర్కట కిశోర న్యాయం. కోతిపిల్ల, తల్లి కడుపును కరచి పట్టుకుంటుంది, వదలదు. తల్లి బిడ్డను పట్టుకోదు. ఇందులో బాధ్యత సాంతం మర్కట కిశోరం( కోతి పిల్ల) దే. తల్లి బాధ్యత లేదు. గురువునుండి ఏదైనా పొందాలనుకుంటే,  అది సాధించే బాధ్యత శిష్యుడిదే. ఉపదేశించడం మాత్రమే గురువు బాధ్యత.

 శ్రీ రామానుజాచార్యులు పద్దెనిమిది సార్లు తన గురువైన తిరుకొట్యూరు నంబి వద్దకెళ్ళి తిరుమంత్రం ఉపదేశించమని కోరాడు. అపుడు వారిది మర్కటకిశోర న్యాయం. తిరుమంత్రాన్ని  జనాలందరికీ గోపురం మీదనుంచి అరచి ఉపదేశించినప్పటిది మార్జాలకిశోర న్యాయం.

గురువును శిష్యుడు తత్త్వం తెలుసుకోవడానికి ఆశ్రయించాలి.

ఒక పండితుణ్ణి అవమానించినందుకు నందవంశం నాశనమైంది. అటువంటి చాణక్య గురుపరంపరకు చెందినవారు గురువులు.

గురువు అవమానించబడినందుకు ద్రుపదుడిని బంధించి తెచ్చి గురువుకు గురుదక్షిణగా ఇవ్వడం జరిగింది. అటువంటి అర్జున శిష్యపరంపరకు చెందినది మన జాతి.

పాలలో ఎన్ని పాలు గుమ్మరించినా తోడుకోవు, చిటికెడు పెరుగు కావాల్సిందే. గురువు ఆ పెరుగులాంటి వాడే. జీవితానికి ఓ అర్థాన్ని ప్రసాదిస్తాడు.

గురుదక్షిణ సమర్పణ భావనకు ప్రతీక.

గురుదక్షిణ మన ఆదాయంలో 12 వ భాగం. 24 వ భాగం నుండి ప్రారంభించాలి. సంపాదనలో 1/10 వ భాగం సమాజం కోసం అనేది ప్రాచీన భావన.

గురుదక్షిణ దానం కాదు. తలవంచి సమర్పించాలి. దానం తీసుకోవడం వల్ల భగవంతుడు కూడా వామనుడయ్యాడు.

గురుదక్షిణ అనేది వ్యక్తిగతం, రహస్యం కాదు.

సంఘ ధ్యేయవాక్యం  " స్వయమేవ మృగేంద్రతా " . ఆ ప్రకారమే స్వయంసేవకులు తమ సంస్థను తామే నడుపుకోవడానికి గురుదక్షిణ.

సమర్పణ అనేది కేవలం సంఘానికే కాదు, అవసరమైతే సమాజానికి కూడా అనే భావన పెంచడానికే.

గురుదక్షిణగా మన పూర్వీకులు చెల్లించమన్నంత చెల్లించడానికి మన మన పిసినారి హృదయాలు సహకరించకపోతే పుణ్యాహవాచనం వంటి శుభకర్మలలో చెప్పబడిన ' దక్షిణాం మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యం అహం సంప్రదదే నమమ ' ప్రకారం ఉత్సాహంతో తోచిన సమర్పణ చేయవచ్చు.

సంఘశాఖలో భగవాధ్వజం ముందు మనం చేసిన సమర్పణే ధర్మరక్షణకోసం జరిగే నిజమైన సమర్పణ.

గురుదక్షిణ అనేది గురుపూర్ణిమకు ముందువెనుక ఏదో ఒకరోజు చేసేది. అదే ' గంగాజలి ' అయితే 365 రోజులూ చేసేది. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే గురుపూజ చేస్తాం. ఆ ఒక్కరోజు మాత్రమే జేబులో ఉన్న ద్రవ్యం తీసి గురుదక్షిణ సమర్పించడం ఒక ఎత్తు. గురుపూజ చేసి గురుదక్షిణ సమర్పించిన మరుసటి రోజునుండే రాబోయే గురుపూజ నాడు సమర్పించడానికి సిద్ధంకావడం కోసమే  ' గంగాజలి ' వ్యవస్థ.

సమర్పణ ధనం మాత్రమే కాదు. సంఘకార్యం కోసం సమయ సమర్పణంకూడా చేయాల్సిందే.  ఇందులో ఆప్షన్ లేదు.
గురువు- గురుపూజ- గురుదక్షిణ

భగవాధ్వజం సార్వదేశికం. ఏకతకు ప్రతీక. రాష్ట్రం, సంస్కృతి, పరంపర, చరిత్ర, బలిదానం, సేవకు ప్రతీక. యుద్ధానికీ ప్రతీక.

గురుకృప లేనిదే జ్ఞానం కలగదు. భక్తి జాగృతం కాదు. కర్మచేసే క్షమత రాదు. ఈశ్వర సాక్షాత్కారం కలగదు.

బ్రహ్మచర్యాశ్రమంలో గురువు వద్ద పొందిన గుణాల వల్ల భావి జీవితం నిర్మాణమవుతుంది- రాముడు, కృష్ణుడు.
భీష్ముడు వంశోద్ధరణ కోసం, ద్రోణుడు వృత్తిగా, అర్జునుడు ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠ ధనుర్ధారి కావాలనే కాంక్షతో ధనుర్విద్య అభ్యసించారు. ఏకలవ్యుడు మాత్రం సాధు జంతువులను, తన గూడెం ప్రజలను క్రూర జంతువులనుండి కాపాడుకోవడం కోసం ధనుర్విద్య అభ్యసించాడు.( జీవన ఉద్దేశాన్ని బట్టి జీవన పరిణామం ఏర్పడుతుంది)

' గురు ' అంటే బృహస్పతి అనే పర్యాయ అర్థం కూడా ఉంది.

గురువు అవడం అనేది నిరంతర ప్రక్రియ. అటువంటపుడు శిష్యత్వం కూడా నిరంతరమే.

గురువు శిష్యుడు కావడమనేది గుణాత్మక ప్రక్రియ. శిష్యుడు గురువు అయ్యే ప్రయత్నం సాధనా ప్రక్రియ.

మనం సాధించలేని ప్రక్రియకు సంకేతంగా గురువు ఉండకూడదు. అలా ఉంటే మనం నిరంతరం శిష్యుడిగానే ఉండిపోతాం. గురువుగా మారలేం.

గురువు భూలోక మానవులకే కాదు. దేవలోక దేవతలకూ ఉండేవాడు.

మనిషిని సృష్టించడం దేవుడి ధర్మం కాగా మనిషిని మహాత్ముడిగా పరివర్తన చేయడం గురువు ధర్మం.

గురుశిష్యుల విషయంలో రెండు న్యాయాలు. ఒకటి మార్జాల కిశోర న్యాయం. పిల్లి తన పిల్లను మునిపళ్ళతో పట్టుకుని పోతుంది. ఇందులో మార్జాల కిశోరం(పిల్లి పిల్ల) బాధ్యత ఎంత మాత్రం లేదు. బాధ్యత సాంతం తల్లిదే. కృష్ణార్జునులలో  కృష్ణుడే అర్జునునికి జ్ఞానం బోధించే బాధ్యత స్వీకరించాడు. అర్జునుడు కనీసం అర్థించలేదు.

రెండవ న్యాయం మర్కట కిశోర న్యాయం. కోతిపిల్ల, తల్లి కడుపును కరచి పట్టుకుంటుంది, వదలదు. తల్లి బిడ్డను పట్టుకోదు. ఇందులో బాధ్యత సాంతం మర్కట కిశోరం( కోతి పిల్ల) దే. తల్లి బాధ్యత లేదు. గురువునుండి ఏదైనా పొందాలనుకుంటే,  అది సాధించే బాధ్యత శిష్యుడిదే. ఉపదేశించడం మాత్రమే గురువు బాధ్యత.

 శ్రీ రామానుజాచార్యులు పద్దెనిమిది సార్లు తన గురువైన తిరుకొట్యూరు నంబి వద్దకెళ్ళి తిరుమంత్రం ఉపదేశించమని కోరాడు. అపుడు వారిది మర్కటకిశోర న్యాయం. తిరుమంత్రాన్ని  జనాలందరికీ గోపురం మీదనుంచి అరచి ఉపదేశించినప్పటిది మార్జాలకిశోర న్యాయం.

గురువును శిష్యుడు తత్త్వం తెలుసుకోవడానికి ఆశ్రయించాలి.

ఒక పండితుణ్ణి అవమానించినందుకు నందవంశం నాశనమైంది. అటువంటి చాణక్య గురుపరంపరకు చెందినవారు గురువులు.

గురువు అవమానించబడినందుకు ద్రుపదుడిని బంధించి తెచ్చి గురువుకు గురుదక్షిణగా ఇవ్వడం జరిగింది. అటువంటి అర్జున శిష్యపరంపరకు చెందినది మన జాతి.

పాలలో ఎన్ని పాలు గుమ్మరించినా తోడుకోవు, చిటికెడు పెరుగు కావాల్సిందే. గురువు ఆ పెరుగులాంటి వాడే. జీవితానికి ఓ అర్థాన్ని ప్రసాదిస్తాడు.

గురుదక్షిణ సమర్పణ భావనకు ప్రతీక.

గురుదక్షిణ మన ఆదాయంలో 12 వ భాగం. 24 వ భాగం నుండి ప్రారంభించాలి. సంపాదనలో 1/10 వ భాగం సమాజం కోసం అనేది ప్రాచీన భావన.

గురుదక్షిణ దానం కాదు. తలవంచి సమర్పించాలి. దానం తీసుకోవడం వల్ల భగవంతుడు కూడా వామనుడయ్యాడు.

గురుదక్షిణ అనేది వ్యక్తిగతం, రహస్యం కాదు.

సంఘ ధ్యేయవాక్యం  " స్వయమేవ మృగేంద్రతా " . ఆ ప్రకారమే స్వయంసేవకులు తమ సంస్థను తామే నడుపుకోవడానికి గురుదక్షిణ.

సమర్పణ అనేది కేవలం సంఘానికే కాదు, అవసరమైతే సమాజానికి కూడా అనే భావన పెంచడానికే.

గురుదక్షిణగా మన పూర్వీకులు చెల్లించమన్నంత చెల్లించడానికి మన మన పిసినారి హృదయాలు సహకరించకపోతే పుణ్యాహవాచనం వంటి శుభకర్మలలో చెప్పబడిన ' దక్షిణాం మనసోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్యం అహం సంప్రదదే నమమ ' ప్రకారం ఉత్సాహంతో తోచిన సమర్పణ చేయవచ్చు.

సంఘశాఖలో భగవాధ్వజం ముందు మనం చేసిన సమర్పణే ధర్మరక్షణకోసం జరిగే నిజమైన సమర్పణ.

గురుదక్షిణ అనేది గురుపూర్ణిమకు ముందువెనుక ఏదో ఒకరోజు చేసేది. అదే ' గంగాజలి ' అయితే 365 రోజులూ చేసేది. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే గురుపూజ చేస్తాం. ఆ ఒక్కరోజు మాత్రమే జేబులో ఉన్న ద్రవ్యం తీసి గురుదక్షిణ సమర్పించడం ఒక ఎత్తు. గురుపూజ చేసి గురుదక్షిణ సమర్పించిన మరుసటి రోజునుండే రాబోయే గురుపూజ నాడు సమర్పించడానికి సిద్ధంకావడం కోసమే  ' గంగాజలి ' వ్యవస్థ.

సమర్పణ ధనం మాత్రమే కాదు. సంఘకార్యం కోసం సమయ సమర్పణంకూడా చేయాల్సిందే.  ఇందులో ఆప్షన్ లేదు.

సప్త ఋషులు

సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు....

కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయః స్మృతాః!!

భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.
ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజ్యనీయులే.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు.

 1. కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2. అత్రి మహర్షి:-
 సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3. భరద్వాజ మహర్షి:-
భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

 4. విశ్వామిత్ర మహర్షి:-
విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5. గౌతమ మహర్షి:-
తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6. వశిష్ఠ మహర్షి:-
ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.

 7. జమదగ్ని మహర్షి:-
జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశారు.

భగవద్గీత ఎందుకు చదవాలి

భగవద్గీత ఎందుకు చదవాలి?
     బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని అంటారు. నిజమే! తలరాతను ఎవరూ మార్చుకోలేకపోవచ్చు. కానీ, గీతను చదివితే మాత్రం జీవనరేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది. అర్జునుడు యుద్ధంలోను, మనిషి జీవితంలోను గెలుపు కోసం చదవాల్సింది, నేర్చుకోవాల్సింది గీత నుంచే. భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబదినదని అర్థం. అంతే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవత్ తత్వము, భగవంతుడిని చేరే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌధానికి చేర్చే 18 సోపానాలని వేదాంత కోవిదులు చెబుతారు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత ఈ మూడింటినీ కలిసి ‘ప్రస్థాన త్రయం’ అంటారు. ప్రాస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలిసిన సాధన సంపత్తుల గురించి, నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించివీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు.
      లోకంలో ఉన్న సర్వ విషయాలు గీతలో ఉన్నాయి. ఇందులో లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగామ్. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరింపబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములలో నిక్షిప్తమై ఉంది. అందుకే దీనిని ‘మోక్ష సప్తసతి’ అని కూడా అంటారు. ఉపనిషత్తులను చదవాలి. బ్రహ్మసూత్రాలను మననం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు, వయసు మళ్ళినవారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం చాలమందిలో పాతుకుపోయింది. కానీ, ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది స్పృశించని అంశమంటూ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటాయమానమైన సాహిత్య ఉద్గ్రంథం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకునే నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు.
     గీతలో దైనందిన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? సన్మార్గాన ఎలా నడవాలి? సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది, లోక కల్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం ‘పారాయణ గ్రంథం’ కాదు, ‘అనుష్టాన గ్రంథం’ (అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించదగ్గది). భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యశాస్త్రం, ఆహారవిజ్ఞానశాస్త్రం, నైతికధార్మిక శాస్త్రం. ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రం. మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను ఇది చర్చించింది. అందువల్లే భగవద్గీతను ‘మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం’ అని అన్నారు. గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. భగవద్గీతలో ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న ప్రకృతి గుణాలైన సత్వ, రాజ, స్తమములను నిత్య జీవితంలో జయించడం, ద్వంద్వాములను నిగ్రహించడం, సదాచారం, సమబుద్ధి, సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, సత్వగుణాలను అలవర్చుకోవడం, నిష్కామ కర్మానుష్టానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం, సాత్విక ఆహార నియమాలను పాటించడం, రాజసిక, తామసిక పదార్థాలను విసర్జించడం, ధ్యాన యోగ సాధన ద్వారా నిరంతర దైవచింతన, జ్ఞానాన్ని పొందగోరువారు పాటించాల్సిన నియమాలు, ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలగడం….ఇంకా ఎన్నో విషయాలు విపులీకరించి ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఆచరించిన మనిషి మహనీయుడు అవుతాడు.ప్రస్తుత మానవ జీవితమ పూర్తిగా భౌతిక దృక్పథానికే పరిమితమైంది. స్వార్థమే పరమావధిగా తలుస్తూ, మనశ్శాంతి లేక కాలం గడుపుతున్నాడు. ఈ దృక్పథం మారాలంటే, మనసులో గూడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు తమ దైనందిన వ్యవహారాల్లో ‘గీత’కూ చోటు కల్పించాలి. అప్పుడు స్వీయాభివృద్ధితో పాటు సమాజభివృద్ధి ఎలా సాధ్యామవుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు.

సంస్కృత వాక్యాల మూల వాక్యాలు

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశాను చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

👉 *ధర్మో రక్షతి రక్షిత:*

👉 *సత్య మేవ జయతే*

👉 *అహింసా పరమో2ధర్మ:*

👉 *ధనం మూలమిదం జగత్*

 *జననీ జన్మ భూమిశ్చ*
*స్వర్గాదపి గరీయసి*

👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*

👉 *బ్రాహ్మణానా మనేకత్వం*

👉 *యథా రాజా తథా ప్రజా*

👉 *పుస్తకం వనితా విత్తం*
 *పర హస్తం గతం గత:*

👉 *శత శ్లోకేన పండిత:*

👉 *శతం విహాయ భోక్తవ్యం*

👉 *అతి సర్వత్ర వర్జయేత్*

👉 *బుద్ధి: కర్మానుసారిణీ*

👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*

👉 *భార్యా రూప వతీ శత్రు:*

👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*

👉 *వృద్ధ నారీ పతి వ్రతా*

👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*

👉 *ఆలస్యం అమృతం విషమ్*

👉 *దండం దశ గుణం భవేత్*

👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*

*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*

@ ధర్మ ఏవో హతో హంతి
ధర్మో రక్షతి రక్షిత:
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !🔥

సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.🔥


అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన🔥


ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.🔥


అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !🔥


కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

 🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.🔥

గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

 🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !🔥


రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.🔥


పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)🔥


శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:


🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.🔥


విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.🔥


శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.🔥


అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణుడు నాశన మయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.🔥


సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !🔥


న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.🔥


ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🔥. అప్పుడు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.🔥


ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !🔥


అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.🔥


ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా. 🔥


సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.🔥


విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.

కష్టజీవి శ్రీకృష్ణుడు

కష్టజీవి శ్రీకృష్ణుడు .....

  మీలో చాలామందికి ఈ వ్యాసం యొక్క శీర్షిక (Title) చిత్రంగా తోచవచ్చు -

"శ్రీకృష్ణుడు కష్టజీవి ఏమిటీ?!"   హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు.

       శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు.

ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు

 ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా, పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు.

శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు.

చూశారా! పురిటికందుకే ఎన్ని కష్టాలో!

కేవలం కొన్నిరోజుల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన.

అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. శ్రీకృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది.

కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరమో ఆలోచించండి.

        ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకరయుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ శ్రీకృష్ణుడే జయించాడు.

కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది.

యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు.

        అనంతరం రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ, ఒక హత్యానేరాన్నీ మోశాడు.

ఎన్నో కష్టాలు పడి, పరిశోధించి, శమంతకమణిని సాధించి తెచ్చి, తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు.

జాంబవతిని పెళ్ళాడేముందు, ఆమె తండ్రియైన జాంబవంతునితో భయంకరయుద్ధం చేశాడు.

అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు, మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది.

జీవితమే ఒక పోరాటమయింది శ్రీకృష్ణునికి.

చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే,

చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు.

తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు.

ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు.

కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా,

శ్రీకృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె!

శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు. యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది.

తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగుపెంటలైపోతున్నా,

విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు.

అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి.

శ్రీకృష్ణుని జీవితం పూలపానుపేమీ కాదు; దారుణమైన ముళ్ళబాట. ఆయన జీవితం కులాసాగా గడిచిందో, అష్టకష్టాలతో గడిచిందో ఈసారి మీరే చెప్పండి.

        మనకు చిన్న కష్టం వస్తే చాలు, ఎంతో బాధపడి పోతాం. ఆ కష్టాలకు బాధ్యుడు దేవుడేనని నిందిస్తాం. కాని, భగవంతుడు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా మానవరూపం దాల్చి, మానవులకంటే ఎక్కువ కష్టాలూ, సమస్యలూ అనుభవించి చూపించాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాల్లో వందోవంతు కష్టాలు పడిన మానవులు ఎవరైనా ఉన్నారా?

 

        నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే! కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే! అనుభవించడం కష్టం. కాని, శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు.

వేదం గోప్పదా

వేదం గోప్పదా ????అదిఏలా
అసలు ఈ సాంకేతిక విప్లవం లేని రోజుల్లో పుస్తకాలు లేదా గ్రంధాలు కూడా లేని కాలం నుండి మన వేదం పదిలంగా గురు శిష్య పరంపర ద్వారా కొన్ని కోట్ల తరాలగా సాగుతూ వస్తోంది. అసలు తప్పులు లేకుండా ఎక్కడా కూడా ఒక ఒట్టు, పొల్లు పోకుండా ఎలా వస్తున్నది అని నిరుటి శాస్త్రజ్ఞులు పరిశోధించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన పూర్వులు ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధను చేసేవారు. ప్రతి పదం మెదడులో నిక్షిప్తమయి నోటి ద్వారా ఒకరినుండి మరొకరికి నేర్పబడుతోంది.
వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి  వర్ణం, స్వరం, మాత్ర(ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును.  ఇది నమ్మబుద్ధి కావడం లేదా.
ఒక ఉదాహరణ తీసుకుని ఆలోచిద్దాం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకుని చర్చించుకుందాం
“ I never said she stole my money” - నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు
ఒక వేళ నేను ఒక  పదం మీద ఒత్తి పలికితే ఆ పదానికి వున్న అర్ధం మొత్తం మారిపోతుంది. ఈ పైన చెప్పిన వాక్యంలో ఒకొక్క పదం మీద బలం పెట్టి చూద్దాం
1. “ I” never said she stole my money – నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు. ( అంటే ఇంకెవరో అన్నారు )
2.  I “never” said she stole my money – నేను “ఎప్పుడూ” ఆ ఆమ్మాయి డబ్బు తీసింది అనలేదు ( ఇది సూటిగా అర్ధమయ్యే వాడుక )
3. I never “said” she stole my money – నేనెప్పుడూ ఆ అమ్మాయి డబ్బు తీసింది “అనలేదు” ( అనలేదు కానీ నాకు అనుమానం వుంది, లేదా నమ్మకం వుంది)
4. I never said “she” stole my money – ఆ అమ్మాయి తీసిందని నేను  అనలేదు ( మరెవ్వరో తీసి వుండ వచ్చును )
5. I never said she “stole” my money – ఆ అమ్మాయి దొంగాలించింది అని నేను అనలేదు ( మామూలుగా తీసుకుని ఉండవచ్చును, చేబదులు లేక మరో రకంగా)
6. I never said she stole “my” money – ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు ( కానీ పక్క వాడి డబ్బు దొంగలించి ఉండవచ్చును, లేక ఆ డబ్బు నాది కాక పోవచ్చును)
7. I never said she stole my “money” – ఆ అమ్మాయి నా “డబ్బు” దొంగాలించలేదు ( కానీ మరోకటేదో దొంగలించి ఉండవచ్చు)
చూసారా ఒకొక్క పదం మీద ఒత్తి పలకడం వలన ఒకొక్క అర్ధం మామూలు మన మాటల్లోనే వస్తున్నది. వేద ప్రోక్తమైన మంత్రాలలో ఉచ్చారణ, స్వర, అనుస్వరం ఎంత ప్రాముఖ్యమో మీకు ఈ పాటికి అర్ధమయి వుంటుంది.
ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జత, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు. ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.
క్రమ పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు. జట లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో, అదే ఘనంలో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు. దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాదబడుతుంది.
ఒక ఘనాపాఠీ కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితను నేర్వాలంటే 2000 పైగా పంచశతి( 1 పంచశతి = 50 పాదాలు  => 109,308 పాదాలు. ప్రతి పాదానికి రమారమి 3 పదాలు => 3,30,000 పదాలు, 1 ఘనం 13 సార్లు ఉచ్చరించడం => 4,290,000 ఉచ్చారణలు పైన చెప్పిన 6 మూల సూత్రాలతో  )  చెప్పుకోవాలి. ఇది గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలంటే రమారమి 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి వారు ఎంత త్యాగం చేసి శ్రద్ధతో నేర్చుకుంటే వారు ఘనాపాఠీలు అవుతారు. ఇంత క్లిష్టమైన మన సాంప్రదాయాన్ని కొందరు అయోగ్యులు పిలక బ్రాహ్మణులను, వాళ్ళేమి చేసేది, మేము చదివేస్తాము అని డాంబికాలు పలుకుతారు. ముందుగా ఒకరి పని వారిని చేయ్యనివ్వాలి. పక్కవారిని అగౌరవ పరచకూడదు. అందరం ఎవరి పనులు వారు చేసుకుంటూ సమాజోద్ధారణకు పాటు పడాలి. ఒకరి మీద ఒకరికి అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టిపోయారు తెల్లవాళ్ళు.  మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి. వేదం నిత్యం బ్రతికి వుండాలి. ఇది మన అందరి కర్తవ్యం.


మన తెలుగు పద్య వైభవం

తప్పక చదవండి.. మన తెలుగు పద్య వైభవం - ఎంత గొప్పగా వుందో...

పూర్వం ఒక రామ భక్తుడు....  రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.

ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.
"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.

గవీశపాత్రో నగజార్తిహారీ
కుమారతాతః శశిఖండమౌళిః।
లంకేశ సంపూజితపాదపద్మః
పాయాదనాదిః  పరమేశ్వరో నః॥ ఆశ్చర్య పోయాడు చదవగానే.

అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్  అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు. అర్ధం చూడండి...

గవీశపాత్రః ... గవాం ఈశః  గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.

అనాదిః ... ఆది లేని వాడూ  ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,

అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.

చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం.

అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....

పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.
ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః  అంటే పక్షి అని అర్ధం. వీనామ్  ఈశః  వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.

కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.

అతడు మనలను కాపాడు గాక ....
గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో  విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని  దర్శించగలిగితే వాడు  శైవుడు.  ఇది మన భారతీయ కవితా వైభవము.

ల‌లితాసహ‌స్ర నామాల‌ను ఎవ‌రు ర‌చించారు

ల‌లితాసహ‌స్ర నామాల‌ను ఎవ‌రు ర‌చించారు?
ఈ శ్లోకాల విశిష్ట‌త ఏమిటి?
జ‌గ‌జ్జ‌న‌ని ఆది ప‌రాశ‌క్తి సృష్టే స‌క‌ల విశ్వం. విష్ణుమూర్తి అవ‌తారమైన హ‌య‌గ్రీవుడు  అమ్మ‌వారి వేయి నామాల‌ను అగ‌స్త్య‌మ‌హ‌ర్షికి బోధించారు. స‌క‌ల చ‌రాచ‌ర జ‌గ‌త్తును పాలించే అమ్మ‌వారి స‌హ‌స్ర నామాల‌ను ప‌ఠిస్తే  స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. సాక్షాత్తు త‌ల్లి పార్వ‌తీదేవి మ‌న‌కు ఇచ్చిన గొప్ప‌వ‌రం ఈ నామావ‌ళి. అమ్మ‌వారి యశస్సుని కీర్తిని, శ‌క్తిని తెలిపే నామాల‌ను ప‌ఠిస్తే అనేక మంచి ఫలితాలు క‌లుగుతాయి. ప్ర‌తి మ‌నిషి  జీవితంలో అనేక మైన జాత‌క దోషాలుంటాయి. వీటి నివార‌ణ‌కు మ‌నం ఎన్నో శాంతి ప్ర‌క్రియ‌లు చేస్తుంటాం. అయితే అమ్మ‌వారి ల‌లితా నామాల‌ను చ‌దివితే ఈ జాత‌కదోషాలు మ‌న‌ల‌ను బాధించ‌వు. బ్ర‌హ్మాండ‌పురాణంలో ల‌లితా దేవి సహస్ర నామావ‌ళి వుంది. ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన శ్రీ‌పురం అమ్మ‌వారి నివాస‌స్థ‌లాన్ని సూచించే  శ్రీ‌చ‌క్ర ప్ర‌స్తావ‌న పురాణాల్లో వుంది. అమ్మ‌వారి స్థానం క‌నుక శ్రీ‌చ‌క్రానికి అంత విశిష్ట‌త ల‌భించింది. భండాసురున్ని సంహ‌రించేందుకు జగ‌న్మాత ల‌లితా దేవిగా జ‌న్మించిన‌ట్టు పురాణాలు వెల్ల‌డిస్తున్నాయి. నియ‌మ‌బ‌ద్ధంగా, శుచిగా అమ్మ‌వారి నామాల‌ను ప‌ఠిస్తే అనంత‌మైన ఆనందం క‌లుగుతుంది. ఈ మంత్రాల‌ను వాశిన్యాది దేవ‌త‌లు అమ్మ ఆన‌తి ప్ర‌కారం మొద‌ట ప‌ఠించారు. అనంత‌రం హ‌య‌గ్రీవులు అగ‌స్త్య‌మహ‌ర్షికి ఉపదేశించారు. ఆదిశంక‌రాచార్యులు, భాస్క‌రాచార్యులు సహస్రనామాలపై వ్యాఖ్యానాలు చేశారు. స‌మ‌స్త జ‌గ‌త్తును న‌డిపించే ఆ త‌ల్లి నామావాళిని ఏకాగ్ర‌త‌తో చ‌దివితే మ‌న‌కు అంతా మంచే జ‌రుగుతుంది.

బృహత్కధ

*బృహత్కధ*
పూర్వం దీపకర్ణి అనే రాజు వుండేవాడు. అతనికి చాలాకాలము సంతానము కలగలేదు. ఎన్నో పూజలూ,వ్రతాలూ, యాగాలూ చేసిన తర్వాత ఆయనకు కలలో ఒక ఆదేశం వినపడింది. రాజా! నీవు అడవి లోకి ఒక్కడివే వెళ్ళు. అక్కడ పులిమీద  ఒక మూడేళ్ళ బాలుడు కనిపిస్తాడు.అతడిని తెచ్చి నీ కుమారుడిగా
పెంచుకో అని. దీపకర్ణి అడవికి వెళ్లి పులిమీద కూర్చున్న బాలుడిని తీసుకొని వచ్చి తన కుమారుడిగా ప్రకటించి వాడికి శాతవాహనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు.అతనికి యుక్త వయసు
రాగానే ఒక అందమైన రాజ కన్యక తో వివాహం జరిపించి అతనికి పట్టాభిషేకం చేసి తానూ భార్యతో సహా
వానప్రస్థానికి వెళ్లి పోయాడు.
శాతవాహనుడు  ప్రజానురంజకంగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు.అతని భార్య సంస్కృత పండితురాలు.రాజుకు అంత  సంస్కృత  పరిజ్ఞానం లేదు.ఒక రోజు రాణి తో బాటు వనవిహారానికి వెళ్లి అక్కడి చెరువులో యీత కొట్టడానికి దిగారు.రాజు చిలిపిగా అదే పనిగా రాణి ముఖం  మీద నీళ్ళు చల్లసాగాడు . ఆమె తన ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ "రాజన్ మోదకైస్తా డయా" అంటే రాజా నీళ్ళతో కొట్టవద్దు అని అర్థం (మ ఉదకై: తాడయా) కానీ సంస్కృత  పరిజ్ఞానం అంతగా లేని రాజు మోదకములతో(లడ్డూలతో)కోట్టమంటూ వుందని
ఒడ్డున వున్న పరిచారికలతో లడ్డూలు తెప్పించాడు.రాణి రాజా నేను నీళ్ళతో నన్ను కొట్టవద్దు అని అన్నాను.లడ్డూలతో కొట్టమని కాదు. మీకంత  మాత్రం అర్థం కాలేదా?అని పక పక మని నవ్వింది..
రాజు అహానికి పెద్ద దెబ్బ తగిలింది.ఆమె ఎగతాళికి.
మరుదినం తన ఆస్థానం లో వున్న పండితు లందరినీ సమావేశ పరిచాడు.పండితులారా మీలో యెవరైనా
నాకు అతి త్వరలో సంస్కృతం నేర్పించగలరా అని అడిగాడు.గుణాఢ్యుడు  అనే పండితుడు లేచి రాజా సంస్కృతం నేర్పించ డానికి ఒక సంవత్సర మైనా పడుతుంది.అన్నాడు. రాజు లేదు నాకు ఒక నెల లోపలే
నేర్పించాలి అన్నాడు. అది అసంభవం మహారాజా!అన్నాడు గుణాఢ్యుడు .ఇంకో పండితుడు శర్వవర్మ లేచి మహారాజా!నేను నేర్పించ గలను.మీకు కొంత పరిజ్ఞానము వుంది కనుక అదేమీ కష్టమైన పని కాదు.అన్నాడు.గుణాఢ్యుడు  మాత్రం అది సంభవం కాదు అని వాదించాడు.యిద్దరు పండితులూ వాదించుకున్నారు.ఆఖరుకు గుణాఢ్యుడు సరే అయితే నీవు నెల లోపల రాజుకు  సంస్కృతం నేర్పించ గలిగితే
నేను సంస్కృతం లోమాట్లాడడము,  కావ్యాలు రాయడం కానీ మానేస్తాను. అని ప్రతిజ్ఞ చేశాడు.అలాగే అన్నాడు శర్వవర్మ. నేనుకూడానెలలోపల రాజుకు సంస్కృతము నేర్పించ లేకపోతే    ఈ రాజ్యము విడిచి వెళ్ళిపోయి యింక సంస్కృతం లోమాట్లాడడము కావ్యాలు వ్రాయడం మానేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు.
శర్వవర్మ ఇంటికి వెళ్లి యోచన చేశాడు.అతనేదో గుణాఢ్యుడి పైన అసూయతో ఒక నెలలో నేర్పిస్తానని అన్నాడే కానీ అది సాధ్యము కాదని అతనికీ తెలుసు.దిగులుతో కూర్చొని వున్న అతన్ని చూసి అతని భార్య సంగతి తెలుసు కొని మీరు  దేవీ ఉపాసకులు కదా! ఆ దేవిని ఉపాసన చేసి  మీకు ఆ శక్తి నిమ్మని  ప్రార్థించండి అని సలహా యిచ్చింది. దానికి సరే నని శర్వవర్మ దేవిని ఉపాసించి ప్రసన్నం చేసుకొన్నాడు  దేవి అతనికి త్వరగా సంస్కృతం నేర్పించే శక్తిని అనుగ్రహించింది.
మంచిరోజు చూసుకొని  రాజుకు సంస్కృతం నేర్పించడం ప్రారంభించాడు శర్వవర్మ.దేవి అనుగ్రహం వల్ల రాజుకు నెల లోపల సంస్కృతం క్షున్నం గా  నేర్పించాడు. ప్రతిజ్ఞ ప్రకారం గుణాఢ్యుడు అడవి కి వెళ్ళిపోయాడు.
సంస్కృతం లో కావ్యాలు వ్రాయడం,మాట్లాడడం  మానేశాడు.అడవిలో తిరుగుతూ పిశాచాలతో స్నేహం చేసి
వాటి భాష నేర్చుకున్నాడు. తర్వాత అతను "బృహత్కథ"అనే గ్రంథాన్ని పిశాచ భాషలో 60 లక్షల శ్లోకాలతో
వ్రాశాడు.ఆ గ్రంథాన్ని రాజుకు పంపించాడు.ఆ భాష ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవ్వరికీ అర్థం కాని గ్రంథం దేనికి పనికి వస్తుంది? అని రాజు యెగతాళి చేశాడు గుణాఢ్యుడు చాలా బాధపడి ఎవరికీ  పనికి రాని గ్రంథ మెందుకు అని కట్టెలతో మంట చేసి ఒక్కో శ్లోకం చదువుతూ ఒక్కొక్క పుటను చింపి అగ్ని లో వేయ సాగాడు.అడవిలోని జంతువులన్నీ ఆ మంట చుట్టూ చేరి నిద్రాహారాలు మాని  ఆ శ్లోకాలు వింటూ కన్నీరు కారుస్తున్నాయి.జంతువులన్నీ చిక్కి సగ మయ్యాయి.శాత వాహనుడి నగరం లో మాంసా హారమే కరువైంది.రాజుకు కూడా సరియైన మాంసాహారము లేక పిచ్చి పట్టి పోయింది.ఎందుకని అడిగితే సేవకులు గుణాఢ్యుడు చేస్తున్న పని గురించి,జంతువులు అక్కడే చుట్టూ మూగి కన్నీరు కారుస్తూ చిక్కి పోయిన సంగతీ
చెప్పారు.అప్పుడు శాతవాహనుడికి  జంతువులను కూడా ఆకర్షించిన 'బృహత్కథ' యెంత ఉత్తమమైనదో
అర్థ మైంది. రాజూ, శర్వవర్మ యిద్దరూ   అడవికి వెళ్లి  గుణాఢ్యుడిని క్షమాపణ అడిగి ఆ గ్రంథాన్ని మంటల్లో వేయకుండా  ఆపించారు.
 గుణాఢ్యుడిని మీ ప్రతిజ్ఞ ను వెనక్కి తీసుకొని   రాజ్య్యానికి  వచ్చి  ఆ గ్రంథాన్ని సంస్కృతం లోకి అనువదించ వలిసింది గా ప్రార్థించి ఒప్పించారు లేకుంటే అంత మంచి గ్రంథం  వృథా అయి పోతుందని చెప్పి ఒప్పించారు..అగ్నికి ఆహుతి  కాగా మిగిలిన దే యిప్పుడు మనకు లభించిన 'బృహత్కథ'

వినాయకచవితి

*వినాయకచవితి*

వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి.
నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు.

మరి ‘మతం' అంటే ‘మానవత్వా'న్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి.

వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం ‘కొత్త'మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గ
ణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి.
ఇక ఆ 21 పత్రాల గూర్చి తెలుసుకొందాము...

*మాచీ పత్రం:*
మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.

*బృహతీ పత్రం:*
దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.

*బిల్వ పత్రం:*
బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపు

*దూర్వా పత్రం:*
దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.

*అపామార్గ పత్రం:*
తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

*దుత్తూర పత్రం:*
దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.

*బదరీ పత్రం:*
బదరీ పత్రం అంటే రేగు. దీhనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు.
దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

*తులసీ పత్రం:*
హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.

*చూత పత్రం:*
చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.

*కరవీర పత్రం:*
దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.

*విష్ణుక్రాంత పత్రం:*
ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.

*దాడిమీ పత్రం:*
దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.

*దేవదారు పత్రం:*  దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.

*మరువక పత్రం:*
 దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.

*సింధువార పత్రం:*
సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.

*జాజి పత్రం:*
ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.

*గండలీ పత్రం:*
దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.

*శమీ పత్రం:*
 జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

*అశ్వత్థ పత్రం:*
 రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.

*అర్జున పత్రం:*
మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.

*అర్క పత్రం:*
జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు.

*ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.*

ఋషిపంచమి

ఋషిపంచమి  (శనివారం, 26.08.2017)
మన ప్రాచీన రుషులను పూజించేవ్రతం రుషిపంచమి. భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ రుషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు. మరీచి రుషి వంశం వరసగా వివవస్వత్‌ క్రమంగా శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది.

ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులు. రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి. భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు. విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే. జమదగ్ని రుషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు. ఏడో రుషి వసిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు. స్వాయంభువ మన్వంతరంలోనూ సప్తరుషుల్లో ఒకడు. ఒకప్పుడు మిత్రా వరుణులకు ఊర్వశిని చూసి రేతస్సు స్ఖలితం కాగా కుండలో వసిష్ఠుడు, అగస్త్యుడు జన్మించారని ప్రతీతి. సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు. అందుకే భాద్రపద శుక్లపక్ష పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకృత దోష పరిహారం కొరకు విధివిధానంగా పూజిస్తారు. ప్రతి రుషిపంచమికి సుమంగుళులు రుషులను పూజించి తమ దోషాలను దూరం చేసుకొని, ఆయువు, బలం, యశస్సు, ప్రజ్ఞ పొందగలరని వ్రతవిధానం తెలుపుతోంది. సప్తర్షుల ప్రతిమలు చేయించి, షోడశోపచారాలతో పూజించి, రుత్విక్కులను సంతుష్టులను చేసి, భోజనం ఏర్పాటు చేస్తారు. వారి ఆశీర్వాదాలందుకుంటారు. అలా చేసినవారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీకృష్ణ పరమాత్మ వివరించినట్లు పౌరాణిక వ్రతకథలు తెలుపుతున్నాయి. ప్రాచీన రుషులను పూజించే రుషిపంచమి భారతీయ సంస్కృతిలో చిరస్థాయిగా నిలుస్తుంది. -డాక్టర్‌ మాడుగుల భాస్కరశర్మ

ఋషిపంచమి వ్రతము ను స్త్రీలు తప్పక ఆచరించాలి . వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని " ఋషిపంచమి " అంటారు . సప్త ఋషులు ఆరోజు తూర్పున ఉదయిస్తారు . బ్రహ్మ విద్య నేర్వవలసినరోజు . సప్తఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి . . . గనుక బ్రాహ్మీ ముహూర్తముననే లేచి ధ్యానం చేసుకోవాలి . సప్తఋషులే గాయత్రీమంత్రానికి మూలగురువులు . మానవుని శరీరం లో ఏడు యోగచక్రాలు ఉంటాయి , వాటిని వికసింపజేసే వారే ఈ సప్తఋషులు .
మొట్టమొదటిసారిగా వేదమంత్రాల్ని దర్శించి వైదిక ధర్మాన్ని ప్రవర్తింపజేసిన ఆద్య హిందూఋషుల్ని స్మరించే శుభసందర్భం... భాద్రపద శుద్ద పంచమి . ఆ రోజున ఉపవాసం ఉంటే ఆ తొలిగురువులు మిక్కిలి ప్రసన్నులయి మనం కోరిన కోరికలు తీఱుస్తారు. ముఖ్యంగా స్త్రీలు రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికీ, వారి సంతానానికీ తరతరాల పాటు ఆయురారోగ్య సౌభాగ్యాల్ని అనుగ్రహిస్తారు. సంపూర్ణ ఉపవాసం అంటే రెండు పూటలు ఉప్మా తీసుకోవచ్చు. అత్తలకి శక్తి లేకపోతే కోడళ్ళయినా ఉపవాసం చేయాలి. సర్పదోషాలతో బాధపడుతూ సంతానం లేక బాధపడేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చెయ్యడం వంశవృద్ధికరం. ఐశ్వర్యదాయకం.

కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లేమరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ!

దేవుడు ఎంత కరుణామయుడో చూశారా! ఇది చెయ్యి అంటాడు. పోనీ, చేతకాకపోతే కనీసం చెప్పినదానిలో సగమైనా చెయ్యమంటాడు అదీకుదరక పోతే అందులో సగం చెయ్యమంటాడు. ఎన్ని మినహాయింపులో చూశారా! అయినా ఆయన్ను తలవలేకపోతున్నాం. కొలువలేకపోతున్నాం. సరే! ఏడుగుర్ని కాకపోయినా వీరిలో ఐదుగురినైనా తప్పనిసరిగా ఈ భాద్రపద శుద్ధ పంచమినాడు స్మరించుకుని అర్చించాలన్నారు. అందుకే ఈరోజును ఋషిపంచమి అన్నారు.

ఆ ఐదుగురూ ఎవరంటే త్రిగుణాతీతుడైన అత్రి, ఈయన భార్య అనసూయ. వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంట. ముఖ్యంగా ప్రస్తుతం ఈ జంటను పూజించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండవవారు భరద్వాజుడు. ఆపై గాయత్రీమంత్ర సృస్టి విశ్వామి త్రుడు, వసిష్ఠుడు, జమదగ్ని. ఈ ఐదుగురినీ పూజించే రోజే ఋషిపంచమి.

నిజానికీ పండుగ స్త్రీలకు సంబంధించింది. ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఆచరించుకునే వ్రతం. దీన్ని భాద్రపద మాసం శుద్ధపంచమిరోజున ఆచరిం చాలని భవిష్యోత్తరపురాణం తెలియచేస్తోంది. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో చేసిన దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మ దేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తోంది.

వ్రత విధానం

తప్పనిసరిగా ప్రతిస్త్రీ ఈ వ్రతాన్ని ఏడాదికోమారు చేసుకోవలసిందే! ఈరోజు సప్తఋషులను వారి భార్యలతోసహా పూజించుకోవాలి. ఈ వ్రతం చేసుకునేందుకు విధిగా ఈ నియ మాల్ని పాటించాలి. ఉత్తరేణి మొక్కను వేళ్లతో సహా పెరికి దాని కొమ్మతో ఉదయాన్నే పళ్లు తోముకోవాలి. అనంతరం గంగా జలం, బురద, తులసిచెట్టులోని మట్టి, ఆవుపేడ, రావిచెట్టుమట్టి, గంధపు చెక్క, నువ్వులు, గోమూత్రం వీటి నన్నింటిని కలిపి చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆపై108 చెంబులతో స్నానం చెయ్యాలి. స్నానం నదిలో గానీ, ఇంటిలోగానీ చెయ్యవచ్చు. స్నానం చేస్తున్న సమయంలోనే వ్రతానికి సంకల్పం చెప్పుకోవాలి. ఈ వ్రతాన్ని ముత్తైదువులు చేస్తుంటే తిల అభ్యంగ స్నానం చేసి పసువు, కుంకుమల్ని ధరించి పూజకు కూర్చోవాలి. అదే వితంతువలు చేస్తున్న పక్షంలో విబూది, గోపి చందనం, పంచగవ్యాలతో స్నానం చెయ్యాలి. ఇలా చేసిన అనంతరమే పూజకు ఉపక్ర మించాలి.

పూజామందిరం వద్ద గణపతి, నవగ్రహాలు, షోడశ మాతల్ని ప్రతిష్టించుకుని కుదిరితే సప్త రుషులందరినీ భార్యలతో సహా, లేదా అత్రిఅనసూయలు,అరుంధతీవసిష్ఠు లచిత్రాలుంచి పంచామృతాలు, నీటితో అభిషేకం చెయ్యాలి. కుంకుమ,గంధం, బియ్యం, పూలు పళ్లు, తమల పాకులు, యాలకులు, లవంగాలు, దక్షిణఉంచి వ్రతకథ చెప్పు కుని హారతి సమర్పించి నమస్కరించుకుంటారు.

వ్రతకథ

విదర్భదేశంలో ఉత్తమకుడనే బ్రాహ్మణుడికి కూతురు, కొడుకుఉన్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆడపిల్లకు పెళ్లైన కొద్దిరోజులకే వైధవ్యం ప్రాప్తిస్తుంది. దాంతో ఆమెను తీసుకుని గంగాతీరంలో బ్రాహ్మణజంట నివాసముంటారు. ఒకరోజు ఆ అమ్మాయి శరీరంలో నించి పురుగులు పడడం గమనిస్తాడు ఉత్తంకుడు. అయితే ఆయన మంచి దైవభక్తుడు కావడంతో తన కుమార్తెకిలా ఎందుకు జరుగుతోందో దివ్య దృష్టితో గమనిస్తాడు. పూర్వజన్మలో ఈమె రజస్వలైనప్పుడు అన్నంగిన్నె తాకినందువల్ల ఇలా జరిగిందని తెలుసుకుంటాడు. వెంటనే ఈమెతో ఋషిపంచమి వ్రతం చేయించి ఆమె దోషాన్ని పరిహరింపచేస్తాడు. అలాగే-

ప్రాశస్త్యంలో ఉన్న మరో కథ: విదర్భ నగరంలో శ్వేతజితుడనే క్షత్రియుడు, సుమిత్ర అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు. సుమిత్ర రజస్వల అయిన సందర్భంలో శ్వేతజితు డామెను తాకడం, మాట్లాడడం వంటివి చేస్తాడు. ఈమె కూడా ఆ సమయంలో అందరితోనూ మామూలుగానే మాట్లాడేది. ఇలా కాలం గడచి వారిద్దరూ మరణించి సుమిత్ర కుక్కగానూ, అతడేమో ఎద్దుగానూ జన్మించి సుమిత్ర కొడుకు గంగాధరం ఇంటికే చేరతారు. ఒకరోజు గంగాధరం సుమిత్ర ఆబ్దీకం నిర్వహిస్తున్నాడు. గంగాధరుడు తల్లికి శ్రాద్ధక్రియలు ఆచరించి పరమాన్నం నేవేద్యం పెడుతుండగా ఆ కుక్క వచ్చి దాన్ని ముట్టుకుంటుంది. దాంతో ఆ పాయసాన్ని పారబోసి వేరేగా వండి నైవేద్యం పెడుతుంది వంటమనిషి. తద్దినం పెట్టేది తనకే కదా అని పాయసం తింటే దాన్ని పారబోసి వేరే వండించాడని బాధ పడ్డ కుక్కరూపంలోని సుమిత్ర తన బాధను ఎద్దుతో చెప్పుకుంటుంది. వీరిద్దరి భాషా తెలిసిన గంగాధరమా మాటలు వినికుక్క రూపంలో ఉన్నది తల్లి అని తెలుసు కుని గురువు ద్వారా వారి రహస్యం తెలుసుకుని బుషిపంచమి వ్రతం ఆచరించి వారి దోషాల్ని పరిహరింప చేస్తాడు గంగాధరం.

కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే బుషిపంచమిని ప్రాయశ్చితార్థం చేసుకునే వ్రతంగానే చెప్పాలి. ఈ కంప్యూటర్‌ ప్రపంచంలో వ్రతాలు, నోములు అంటే వింతగా చూసినప్పటికీ మన పురాతన ఆచార వ్యవహారాల్నీ ఇప్పటికీ ఎంతో నిష్టగా ఆచరించేవారు ఎంతో మంది ఉన్నారు. నీతి నియమాల్ని తప్పకుండా భగవంతుడిపై మనసు పెట్టి ఆయన్నే ధ్యానించే వారూ ఉన్నారు. వారందరి దివ్యత్వం వల్లనే ప్రస్తుతం ఎన్ని కష్టాలు వస్తున్నావాటినుంచి మబ్బువీడిన చంద్రునిలా వెంటనే బయటపడ గలుగుతున్నాం.

ఈ పూజా విధానం ముగిసిన తరువాత ఆకాశంలో సప్తబుషుల్ని, అరుంధతిని చూస్తూ ఆయా బుషుల్ని పూజించాలి. అన్నట్టు ఈ పూజకు ముఖ్యంగా నాలుగువత్తుల దీపాన్ని ఉంచాలి. పూజ అయిన తరువాత గేదె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూర తదితరాలను నైవేద్యం పెట్టి బంధుమిత్రులతో భోజనం ముగించాలి.

వివాహమైన వారు కనుక ఈ వ్రతం చేస్తే భర్తనుంచి మరింత ప్రేమను, సుఖాన్ని పొందుతారు. అదే వితంతువలు చేస్తే వచ్చే జన్మలో ఆయుష్మంతుడైన భర్తను పొందుతారని వ్రతోత్సవం తెలియచేస్తోంది. అన్నట్టు భర్త ఉండగా ఒక్కసారైన ఈ వ్రతం చేయని పక్షంలో భర్త పోయిన తరువాత కూడా చేసే అధికారం లేదని శాస్త్రం చెబుతోంది...,..✍ లోకాస్సమస్తాస్సుఖినోభవంతు
* యజ్ఞోపవీత మహిమ (జంద్యము)

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యము’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతో వారి వారి ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు ని బట్టి ఉపనయన సంస్కారం లో  వేయడం జరుగుతుంది

యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.

" సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్
తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్ "

బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.

యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది.

యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -

" ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ
వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ
ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః "

మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.

‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.

" తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్ "

ఈ శ్లోకంలో తాతపర్యం ఇది. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం. ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.

" చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్ "

నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.

" పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్ "

అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి. అలాగే శ్రావణ పూర్ణిమ రోజు మార్చుకోవాలి

యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.

యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. ఇదే యజ్ఞోపవీత

Wednesday, 13 September 2017

బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన. మన్యం ప్రాంత విప్లవవీరుడు. అగ్గిపిడుగు  అల్లూరి సీతారామరాజు గారి *వర్ధంతి*😢

*ఈ రోజు మనం మంచి తిండి , మంచి బట్ట , సుఖమైన నిద్ర , సుఖసంతోషాలు'' అనుభవిస్తున్నాం అంటే ''' ఆనాటి సాయుధపోరాట యోధులు ప్రాణ బిక్షం తోనే''' ఈ రోజున అనుభవిస్తున్నాం...*

    ఆ వీరిలో ఒక్కరు

*అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు*

*జననం:-*
4 July 1897
పాండ్రంగి (పద్మనాభం) విశాఖపట్నం

*అస్తమయం:-*
మే 7, 1924 (వయసు 26)
విశాఖపట్నం జిల్లాలోని మంపా గ్రామం

*సమాధి:-*
K. D. Peta village, విశాఖపట్నం జిల్లా

*మతం:- హిందువు*

తల్లిదండ్రులు:-
వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (జూలై 4, 1897 - మే 7, 1924) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు...

*వంశం:-*

 సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు...

ఇతనికి ఆరుగురు కుమారులు వెంకట కృష్ణంరాజు, సీతారామరాజు, గోపాలకృష్ణంరాజు, వెంకట నరసింహరాజు, అప్పలరాజు, వెంకట రామరాజు. వీరిలో గోపాలకృష్ణంరాజు కొడుకు వెంకటకృష్ణంరాజు (సీతారామరాజుకు తాత), వెంకటకృష్ణంరాజు మరియు అతని పెదతండ్రి వెంకట నరసింహరాజు బొప్పూడి గ్రామంనుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో స్థిరపడ్డారు. వెంకటకృష్ణం రాజు ఐదుగురు కొడుకులు రామచంద్రరాజు, వెంకటరామరాజు (సీతారామరాజు తండ్రి), రామకృష్ణంరాజు, రంగరాజు, రామభద్రరాజు.[1]
అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న పాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. ఈ దంపతులకు సీతమ్మ అనే కుమార్తె (ఆమె భర్త దంతులూరి వెంకటరాజు), సత్యనారాయణరాజు అనే మరొక కుమారుడు కూడా ఉన్నారు.

అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంథం అట్టపైన కూఢా *"శ్రీరామరాజు",* *"అల్లూరి శ్రీరామరాజు"* అని వ్రాసుకొన్నాడు. కాలాంతరంలో ఇతనికి *"సీతారామరాజు"* అనే పేరు స్థిరపడింది. (సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని. ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి నిముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును *"సీతారామరాజు"*గా మార్చుకొన్నాడని వ్యావహారిక గాథ.)

*బాల్యం, చదువు:-*

బాల్యంలో అల్లూరి సీతారామరాజు
సీతారామరాజు జన్మదినం 1897 జూలై 4. అనగా హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమి - 23 ఘడియల 30 విఘడియలు. (సాయంకాల 4 గంటలకు) మఖా నక్షత్రయుక్త వృశ్చిక లగ్న వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామరాజు ఇంట రాజు జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు.
రాజు తల్లి సూర్యనారాయణమ్మ సంప్ర్రదాయికముగా చదువు నేర్చుకొన్నది. తండ్రి వెంకటరామరాజు స్కూలు ఫైనల్ వరకు చదివాడు. చిత్రకళలోను, ఫొటోగ్రఫీలోను అభిరుచి కలవాడు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.

1909లో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరంలో హైస్కూలులో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవాడు. చదువు మందగించి, ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఈ కాలంలో నర్సాపురం దగ్గరి చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమండ్రిలో ఆరవ తరగతి, 1912లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఏడవ తరగతి ఉత్తీర్ణుడై, 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారంలో చేరాడు. ప్రముఖ కాంగ్రెసు నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు సహాధ్యాయి. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలో ఉండేవారు. తరువాత వారు పాయకరావుపేటకు నివాసం మార్చారు.

రామరాజుకు 14 వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి, పాండ్రంకి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలో నాల్గవ ఫారంలో చేరాడు. అక్కడ సరిగా చదవకపోవడంవల్ల, కలరా వ్యాధి సోకడంవల్లనూ పరీక్ష తప్పాడు. మరుసటి ఏడు నర్సాపురంలో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరాడు. ఆ సమయంలో తల్లి తునిలో నివసిస్తూ ఉండేది. అక్కడ కూడా సరిగా చదివేవాడుకాదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపగించి, ఇల్లువదలి, తల్లివద్దకు తుని వెళ్ళిపోయాడు. అక్కడే ఐదవ ఫారంలో చేరాడు. మళ్ళీ అదే వ్యవహారం. బడికి వెళ్ళకుండా, తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి శాశ్వతంగా మానేసాడు.
రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండ, కృష్ణదేవు పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు...

చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వర లయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, శ్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు...

*ఉత్తరదేశ యాత్ర:-*

1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతభాషను అధ్యయనం చేశాడు. ఈ యాత్రలో ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. గృహవైద్య గ్రంథము, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచుకొన్నాడు...

కృష్ణదేవు పేట చేరుకుని అక్కడికి దగ్గర్లోని ధారకొండపై కొన్నాళ్ళు తపస్సు చేసాడు. కృష్ణదేవుపేట లోని చిటికెల భాస్కరుడు అనే వ్యక్తి, అతని తల్లి ద్వారా రాజు తల్లికి అతని ఆచూకీ తెలిసి,ఆమె రాజు వద్దకు వచ్చింది. 1918 వరకు అందరూ అక్కడే ఉన్నారు...

*రెండవ యాత్ర:-*

1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి, బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్ళీ కృష్ణదేవు పేట చేరాడు. కృష్ణదేవిపేట వద్ద తాండవ నదిలో "చిక్కలగడ్డ" కలిసేచోట గ్రామస్థులు కట్టిఇచ్చిన రెండు ఇండ్లలో రాజు, అతని తల్లి, తమ్ముడు, సోదరి, బావ కాపురముండేవారు. దానికి "శ్రీరామ విజయ నగరం" అని పేరు పెట్టారు. రాజుకు తల్లిపై అపారమైన భక్తి ఉండేది. ఆమె పాదాభివందనం చేసే ఎక్కడికైనా బయలుదేరేవాడు...

అనేక యుద్ధవిద్యల్లోను, ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యుడవటంచేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవాడు. భక్తి చూపేవారు. 1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు క్రింద మండల దీక్ష నిర్వహించాడు. ఇతనికి అతీంద్రియ శక్తులున్నాయని ప్రజలు భావించేవారు.

*బ్రిటీషు అధికారుల దురాగతాలు:-*

ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది.

*అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలు:-*

ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి, ఆ కూలీ కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఆరణాల కూలీ అనిచెప్పి, అణానో, రెండో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు తాబేదార్ల వద్ద కొనుక్కోవలసి వచ్చేది. కాంట్రాక్టర్లిచ్చే కూలీ వీటికి సరిపోయేదికాదు. ఆకలిమంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగే వారు. దాని వలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై, వారు అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే *“పితూరీ”* అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను, ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది.
మన్యం ప్రజలలో *రాజు* తెచ్చిన చైతన్యం
మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని *రాజు* నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు...

  ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు.

 గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లికితహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. *రామరాజు* దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ *రామరాజు* పై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం.

 అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. *రాజుకు* ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్ళీ 1922 జూన్లో మన్యంలో కాలు పెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమయింది.

*విప్లవం మొదటిదశ:-*

  ప్రభుత్వోద్యోగి అయిన ఫజలుల్లాఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. కనుక ఫజలుల్లాఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాట ఇచ్చాడట. 27-7-1922న తిమ్మాపురంలో ఫజలుల్లాఖాన్ ఆకస్మికంగా మరణించాడట. ఇక విప్లవ మార్గానికి *సీతారామరాజు* ఉద్యుక్తుడయ్యాడు. వారించిన తల్లిని క్షేమం కోసం వరసాపురం పంపేశాడు.
గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు - భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు (కొయ్యూరు) వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది...

*విప్లవ దళం వివిధపోలీసు స్టేషన్లపై చేసిన దాడుల వివరాలు:-*

చింతపల్లి
1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కున్నా

 ఇనుమడించిన ఉత్సాహంతో మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్ళి, భోజనాలు చేసి ఆ రాత్రే ఆగష్టు 23న - కృష్ణదేవు పేట పోలీసు స్టేషనును ముట్టడించి, ఆయుధాలను తీసుకు వెళ్ళారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటకు పంపేశారు. 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు మాత్రం లభించాయి...

 ఆగష్టు 24న - వరుసగా మూడవ రోజు - రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక, అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ మూడు దాడులలోను మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరికి వశమయ్యాయి...
  వరుసదాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటీషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24 న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో వీరిపై దాడిచేసి, అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలు తీసుకుని వెళ్ళడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవలసి వచ్చింది. విప్లవదళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరభావం ఈ సంఘటనలతో మరింత పెరిగిపోయింది.

*రామరాజు* పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేక పోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా, ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషనుపై దాడిచేసిన దళం దాదాపు 5 గంటలపాటు స్టేషనులోనే ఉండి, పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి, వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసిన *పుస్తకం ఇంకా ఉంది.* రాజు పోరాటంలో అడ్డతీగల ప్రాంతం ముఖ్యమ్.

  అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రరీత్యా తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిచేయడంలో ఇతనికి లభించిన విజయాలవల్ల రాజు ప్రతిష్ఠ ఇనుమడించింది. ఇతని సాహసాల గురించి కథలు కథలుగా చెప్పుకొనసాగారు. కొన్ని సార్లు రాజు తను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు...

  ఇతనిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేవాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డాగాని వీలయినంతవరకు *సీతారాంరాజు* దళం వారు మందలించి వదిలేశేవారు. క్రమంగా గూఢచారుల వలన, పట్టుబడ్డ రాజు అనుచరులవలన ప్రభుత్వాధికారులు రాజు కదలికలను నిశితంగా అనుసరించసాగారు...

*విప్లవం రెండవదశ:-*

డిసెంబర్ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయోగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో *నాలుగురు* రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవవీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒక గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు మరణించారు...😢

  ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. *రామరాజు* చనిపోయాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు...

  1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరువాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ *21-4-1923 ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది.* 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరిమానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి "నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది" అని కలెక్టరుకు రాజు "మిరపకాయ టపా" పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.)

*మరణం:-* 😢😢😢

 17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరుగలిగినవాడు. విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక *"అగ్గిరాజు"* అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు.
  ఆ రాత్రి *రాజు* మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవు పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు. తరువాత,1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి *రాంరాజు*ను బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న *అల్లూరి సీతారామ రాజు*ను (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు.😢😢😢😰😰😰
 తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు.  *కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు...*😢😢😢

*"సీతారామరాజ" మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా హిందూ సోదరుడా !* వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది...0