Sunday, 29 October 2017

హాటకేశ్వరం

హాటకేశ్వరం
శ్రీశైలంలో హాటకేశ్వరము అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హాటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే ఫాల దారాలు, పంచ దారాలు అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధారా ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార ఫాలధార. పంచధారలు అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణు ధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులయిన సూర్యచంద్రులు ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.
పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.
అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు.
చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.
శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతోంది. అపుడు పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అపుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అపుడు పార్వతీ దేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగింది. అపుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అపుడు ఆయన నేనే శివుడిని, ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం.
ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అపుడు శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈవిధంగా నరసింహ స్వామీ దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ.
అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.
శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

నిద్రించే సమయంలో రుద్రాక్షమాలను ధరించవచ్చా..?

* నిద్రించే సమయంలో రుద్రాక్షమాలను ధరించవచ్చా..? Soma Sekhar

మంత్రశక్తితో పవిత్రతను సంతరించబడిన రుద్రాక్షను ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వాడతారు. సాక్షాత్తూ ఆ మహాశివుడి కన్నీళ్లనుంచి రుద్రాక్ష ఆవిర్భవించిందని అంటారు. ఈ రోజుల్లో, ఎంతో మంది జ్యోతిష్కులు అలాగే టీవీ ఛానల్స్ కూడా ఈ రుద్రాక్షల ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. జీవితంలోని అనేక సమస్యలను తొలగించే శక్తి రుద్రాక్షకుందని నమ్ముతారు.

చాలా మందికి రుద్రాక్ష ధారణ గురించి అనేక సందేహాలున్నాయి. వాటిలో, నిద్రించేటప్పుడు రుద్రాక్షను తీసివేయాలా? లేదా రుద్రాక్షను ధరించే నిద్రించవచ్చా? అనేది ప్రముఖమైనది. చాలా మంది నిద్రించేటప్పుడు రుద్రాక్షను తీసివేయాలని అంటారు. మరికొంతమంది, రుద్రాక్షను తీసివేయనవసరం లేదని వాదిస్తారు. అయితే, నిద్రకుపక్రమించే ముందు రుద్రాక్షను తీసివేయడం మంచిదని ఎక్కువ మంది విశ్వసిస్తారు. ఈ క్రింది విషయాలను పరిశీలిస్తే మీరు కూడా నిద్రించేటపుడు రుద్రాక్షను తీసివేయడం మంచిదన్న విషయం అర్థం చేసుకుంటారు. Soma Sekhar

* రుద్రాక్షను నిద్రించేటప్పుడు ఎందుకు ధరించకూడదు

1. రుద్రాక్ష ధారణ చేసిన వ్యక్తి పవిత్రంగా ఉండాలి. పగటి వేళలో, మీరు చేయబోయే పనులపై మీకు అవగాహనతో పాటు నియంత్రణ కూడా ఉంటుంది. ఏదైనా చెడు కర్మ చేయబోయినా మిమ్మల్ని ఆ పని చేయకుండా నియంత్రించుకోగల సామర్థ్యం పగటి వేళలో మీకుంటుంది. కానీ, నిద్రిస్తున్నప్పుడు అపస్మారకంగా ఉన్న మనసు మీద మీకు నియంత్రణ ఉండదు.

పగటి వేళలో అణచివేతకు గురిచేయబడిన ఆలోచనలు నిద్రించే సమయంలో మిమ్మల్ని కలల రూపంలో పలకరిస్తాయి. అలా పగటివేళలో అణచివేతకు గురైన పగ, మొహం, అసూయ, దురాశ వంటి చెడు భావోద్వేగాలు మీ కలలో దర్శనమివ్వచ్చు. ఇవన్నీ మీరు ధరించిన రుద్రాక్ష యొక్క శక్తిని నశింపచేసి అపవిత్రం చేస్తాయి.

2. రుద్రాక్షలోనున్న శక్తిని నశింపచేసే అవకాశం మీ కలలకు ఉంది. రుద్రాక్షను ధరించి మీరు నిద్రించినప్పుడు, శృంగారానికి సంబంధించిన కలలు మీకొచ్చినట్లయితే మీరు ధరించిన రుద్రాక్ష అపవిత్రమైనట్లే మీరు భావించాలి. అలాగే, శృంగారంలో పాల్గొంటున్నప్పుడు కూడా మీరు రుద్రాక్షను ధరించకూడదు. కాబట్టి, రుద్రాక్షను మీ ఇంటిలోని పూజగదిలోని భద్రపరచండి.

3. పదునైన రుద్రాక్ష మీ చర్మానికి హానీ కలిగించవచ్చు. అలాగే, నిద్రలో మీ శరీర బరువు రుద్రాక్షపై పడటం వల్ల మ రుద్రాక్ష రూపం కూడా దెబ్బతినవచ్చు.

4. ప్రతికూల శక్తి Soma Sekhar

a) నిద్రించే సమయంలో మాత్రమే కాదు, మీరు అంత్యక్రియలకి స్మశానానికి వెళ్తున్నప్పుడు రుద్రాక్షను ఇంట్లో వదిలి వెళ్ళాలి. ఇంటికి రాగానే, తలస్నానం చేయాలి. తల భాగంలో అలాగే ఉదరం కింద భాగంలో మానవుని తేజస్సు అమితంగా ఉంటుంది. అందుకే స్నానపు నీటిలో కాసిన ఉప్పు వేసి ఆ నీటితో స్నానం చేయాలి. రుద్రాక్షను ధరించే ముందు మంత్రాన్ని జపించాలి. ఆ తరువాత రుద్రాక్షను ధరించాలి.

b) రుద్రాక్షను ధరించాక మాంసాహారాన్ని అలాగే మద్యపానాన్ని దూరంగా ఉంచాలి. ఒకవేళ మీరు దూరంగా ఉంచలేకపోతే కనీసం ఆ ఒక్క రోజుకు రుద్రాక్షను తీసివేసి పూజా మందిరంలో పెట్టాలి. ఆ మరునాడు, స్నానం చేసి మంత్రం జపం చేసి రుద్రాక్షను పవిత్రంగా ధరించాలి.

5. నిజానికి, కఠిన బ్రహ్మచర్యం పాటించే వారే రుద్రాక్షను ధరించాలి. వారు మాత్రమే నిద్రించే సమయంలో కూడా రుద్రాక్ష ధారణకు అర్హులు. ఒక వేళ మీరు మంత్రం జపం చేస్తూ ఆధ్యాత్మిక ఆలోచనలతో దైవనామస్మరణకే ప్రాధాన్యం ఇచ్చేవారైతే, మీరు మీ ఆలోచనల పట్ల అలాగే చేతలపట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. సానుకూలంగానే ఆలోచించాలి. ఎవరినీ తిట్టకూడదు. జీవరాశులపట్ల దయతో వ్యవహరించాలి. Soma Sekhar

మాంసాహారాన్ని విస్మరించాలి. మద్యపానాన్ని దూరంగా ఉంచాలి. ఎవరినైనా, మానసికంగాగాని, శారీరకంగాగాని అలాగే మాటలతోగాని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే, ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వారిలో ఆలోచనల ప్రభావం సాధారణ వ్యక్తి ఆలోచనల ప్రభావం కంటే చాలా శక్తివంతమైనది. మీరు వేరేవారి గురించైనా చెడుగా ఆలోచిస్తే మీరు వారితో పాటు మీకు కూడా చెడు కలిగించుకుంటున్నట్టు అర్థం.

ఆధ్యాత్మికతకి మొట్టమొదటగా హృదయాన్ని మాలిన్యం నుండి శుభ్రం చేసుకోవడం ప్రధమం. మీకు శక్తులు రావడం మొదలయ్యాక మీరు వాటిని దుర్వినియోగం చేయకూడదు.

ఇతరులకు హానీ తలపెట్టేందుకు మీరు మీ శక్తులను వినియోగించకూడదు. కాబట్టి, మీరు నిద్రించే సమయంలో మీ మనస్సు అపస్మారకంగా మారే సమయంలో రుద్రాక్షను ధరించకండి. ఎందుకంటే, నిద్రలో మీరు మీ మనస్సును నియంత్రించలేరు కాబట్టి మీ కలలను మీరు నిర్దేశించలేరు. Soma Sekhar

ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మినారాయణ పది సూత్రాలు

*.. సాధించెయ్‌ కసిగా..! *

*ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మినారాయణ పది సూత్రాలు*

తిరుపతి వేేంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియంలో శనివారం అకాడమి ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో జరిగిన యువత సాధికారిత అనే కార్యక్రమంలో మహారాష్ట్రలోని థానేనగర జాయింట్‌ కమిషనర్‌, ఐపీఎస్‌ అధికారి వీవీ లక్ష్మినారాయణ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సుమారు గంట ఇరవై అయిదు నిమిషాలు సాగిన ప్రసంగాన్ని మూడువేల మంది విద్యార్థులు, ఇతరులు ఆసక్తిగా విన్నారు. ఆయన నుంచి ఇంకా కొత్త విషయాలు వస్తాయన్న ఆత్రుత వారిలో కనిపించింది. యువత లక్షణాలు ఎలా ఉండాలో చక్కటి ఉదాహరణలతో వివరించారు.

 మిస్సైల్‌మేన్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం... పాల విప్లవం తీసుకొచ్చిన వర్గీస్‌ కురియన్‌... హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌, ప్రపంచానికి భారతదేశ గొప్పదనం చాటిచెప్పిన వివేకానందుడు... శాంతిమార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ.. ఈ మహానుభావులంతా పైనుంచి దిగిరాలేదు. వారంతా మనలో ఒక్కరే... వారు సాధించింది... మనం ఎందుకు సాధించలేకపోతున్నాం.. మనలో శక్తి లేదా..? మన మనసు చెడు అలవాట్ల వైపు ఎందుకు మరలుతోంది.. సంకల్పం లేదా..? వూరికే నిరుత్సాహ పడి ఎందుకు ఒత్తిడిలో కూరుకుపోతున్నాం..? గెలిచే సత్తా లేదా..? అంటే ఉంది.... అన్నీ ఉన్నాయి. కావల్సింది నిర్మలమైన మనసు. సాధించాలనే కసి... ముందుకు సాగాలన్న పట్టుదల.. మాత్రమే...

- వీవీ లక్ష్మినారాయణ, ఐపీఎస్‌ అధికారి

1. *సమయం గొప్ప ఆయుధం*

సమయం విలువైంది. మనం ఒక సెకనే కదా.. అనుకుంటాం... ఆ సెకను విలువను ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో వచ్చిన వార్ని అడుగు... అది ఎంత గొప్పదో చెబుతారు.... ఒక నిమిషమే కదా..? వృథా అని చాలా సులభంగా తీసుకుంటాం.. సమయం మనకు ఒక గొప్ప ఆయుధం. దాన్ని వృథా చేయడం మంచిది కాదు.

2. *మంచి స్నేహాన్ని ఎంచుకోవడం *
వర్షపు చుక్క చేతిలో పడితే నీరు అవుతుంది... బురదలో పడితే మురుగుగా మారుతుంది. అదే చుక్క తామరాకుపై పడితే దాని అసలు స్వరూపం చక్కగా తెలుస్తుంది. ఇక అదే వర్షపు బిందువు ఆలుచిప్పలో పడితే ముత్యం అవుతుంది. మనమంతా వర్షపు చుక్కలే. పైనుంచి దిగిన వర్షపు చుక్కకు తాను ఎక్కడ పడాలో ఎంచుకునే అవకాశం లేదు. మనకు మాత్రం అది ఉంది. మంచి స్నేహాన్ని.. మంచి మనుషుల సాంగత్యాన్ని ఎంచుకోవడంలో మన నేర్పు కనిపిస్తుంది.

3. *జన్మ సార్థకత...*
ఒకసారి నారథుడు భగవంతుడ్ని అడుతాడు... అసలు సత్సంగం అంటే ఏమిటి స్వామి అని...? ఆయన జవాబిస్తూ.. వెళ్లి ఒక కీటకాన్ని అడుగు చెబుతుంది అంటాడు. వెంటనే నారథుడు కీటకాన్ని అడగగానే అది చనిపోతుంది. చనిపోయిన విషయం భగవంతుడికి చెప్పగానే.. ఈ సారి పావురాన్ని అడగమంటాడు.. నారథుడు అడగగానే అదీ మరణిస్తుంది. భయంతో దేవుడికి విషయం చెప్పగానే ఈసారి లేగదూడను అడుగు అంటాడు. నారదుడు ఈ మాట ఎత్తగానే అదీ చనిపోతుంది. ఇక భయంతో భగవంతుడికి విషయం చెప్పగానే... ఈసారి అప్పుడే పుట్టిన రాజకుమారుడ్ని సత్సంగం గురించి అడగమని చెబుతాడు. భయంతోనే వెళ్లిన నారథుడు రాజకుమారుడ్ని అడగగానే... అతడు నవ్వుతూ మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడటమే సత్సంగం అని... గత జన్మలో కీటకంగా, మరో జన్మలో పావురంగా, ఇంకో జన్మలో లేగదూడగా పుట్టిన నన్ను అద్భుతమైన మానవజన్మలోకి తీసుకొచ్చింది మీ సత్సంగమే స్వామి అని ఆ చిన్నారి బదులిస్తాడు. 84 లక్షల ప్రాణుల్లో అద్భుతమైన జన్మ మానవజన్మ. దీన్ని కచ్చితంగా సార్థకం చేసుకోవాలి...

4. *తపనతో బయటకు వచ్చే శక్తి *
ఆంజనేయుడికి ఎంతటి శక్తి ఉందో అతడికే తెలీదు. అవసరమైన సమయంలో తన తోటివారు అవసరం మేరకు ప్రోత్సహించి శక్తిని ఆయనకు తెలియజేశారు. దీంతోనే ఆయన సీతమ్మను తీసుకురావడం.. సంజీవని పర్వతం ఎత్తుకొని తీసుకురావడం చేశారు. ప్రతి వ్యక్తిలోనూ శక్తి ఉంటుంది. అది మీలోని పట్టుదల, సాధించాలనే తపనతోనే బయటకు వస్తుంది.

5. *అనవసర విషయాలను తొలగించండి *
నేను ఒకసారి ఓ పట్టణానికి వెళ్లాను. అక్కడ ఓ శిల్పి అద్భుతమైన కళాఖండం చెక్కడం చూశా. ఎలా చెక్కారనే శిల్పకళాకారుడ్ని నేను అడిగాను. అప్పుడు ఆయన ఒక మంచి విషయం చెప్పాడు. ఆ రాయిలోనే శిల్పం దాగుందని.. అతడు కేవలం అనవసరమైన రాయిని తొలగించి.. దానికి ఒక రూపు తీసుకొచ్చానని బదులిచ్చాడు. నిజంగా ఇది యువతరానికి బాగా అవసరం. మనలోని అనవసర విషయాల్ని తొలగించి చూడండి. అద్భుతాలు జరుగుతాయి.

6. *ఒకే పనిపై దృష్టి పెట్టు*
స్వామి చిన్మయానంద గొప్ప వ్యక్తి... ఆయనను ఒక రోజు తన శిష్యుడు ఒక మాట అడిగాడు. స్వామి.. నేను భోజనం చేస్తాను.. చదువుతాను.. కాని మీలాంటి జ్ఞానం నాకు ఎందుకు రాలేదు..? అని అంటాడు. దానికి స్వామి బదులిస్తూ.. నేను చదివేటపుడు మా మెదడులోకి మరేది రాదు. కేవలం చదువు మీదనే దృష్టి పెడతాను. భోజనం చేసేటపుడు అంతే.. మరో ఆలోచన లేకుండానే సంతృప్తిగా భోజనం చేస్తానని బదులిచ్చాడు. ఇది నిజం. మనమంతా టీవీ చూస్తూ భోజనాలు చేస్తున్నాం.. క్రైం సీన్లు చూస్తూ అల్పాహారం తింటున్నాం. మనం తింటున్నది భోజనం కాదు.. టీవీలను.. క్రైం సంఘటనలను.. ఇది కూడా నేర ఆలోచనలు పెరడానికి ఒక కారణమే.

7. *సాధన వృథా కాదు.. *
ప్రపంచ ప్రఖ్యాత ఈతగాడు మైకెల్‌ ఫెల్ప్‌ ఒకే ఒలింపిక్స్‌లో 8 బంగారు పతకాలు సాధించాడు. ఒకసారి ఫెల్ప్‌ మణికట్టుకు గాయమైంది. అది పెద్ద గాయం. మూడు నెలలు ఈతకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్పారు. అయితే మనసు ఆగని ఫెల్స్‌ ప్రతిరోజు ఈతకొలను దగ్గరకు వెళ్లడం కాళ్లు నీళ్లలో పెట్టి ఆడించడం చేసేవాడు. సుమారు మూడు గంటలు ఇలా చేశాడు. దీంతో అతడి కాళ్ల కండరాలు బలంగా తయారయ్యాయి. చివరి 3 నెలలు అయిపోయాయి. ఒలింపిక్స్‌ వచ్చాయి. 7 బంగారుపతకాలు గెలిచి, 8వ బంగారుపతకం బటర్‌స్ట్రోక్‌కు తలపడుతున్న సమయంలో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చాడు. చివరి 5 మీటర్లలో ఫెల్ప్‌ అనూహ్యంగా ముందుకొచ్చి 8వ పతకం సాధించాడు. కారణం విశ్లేషకులు పరిశీలించగా.. అతడి కాళ్లు చాలా బలంగా ఉండటం వల్లే చివరి 5 మీటర్లలో అతడు విజయాన్ని అందుకున్నాడని తేలింది. మనం మంచి కోసం చేసే సాధన ఏదీ వృథా కాదు. ఒకసారి కాకపోతే మరోసారి అది కచ్చితంగా మనకు ఉపయోగపడుతంది.

8. *కసి ఉండాలి.. *
వర్గీస్‌ కురియన్‌ పాలవిప్లవం తీసుకొచ్చిన వ్యక్తి. అతడు లండన్‌లో ఉండగా ఒకసారి అక్కడున్న విదేశీయుడు ఒకరు భారతదేశం పాలు మురుగుకాలువలో పోయడానికి మాత్రమే పనికొస్తాయని అన్నాడు. తన దేశాన్ని అన్న అతడి మాటలు కురియన్‌లో కసిని రేపాయి. వెంటనే గుజరాత్‌ వచ్చి మారుమూల పల్లెలకు సైతం వెళ్లి పాలవిప్లవానికి శ్రీకారం చుట్టారు. విజయం సాధించారు. చదువు, కెరీర్‌లోనూ అదే కసి యువతకు అవసరం.

9. *వినూత్నంగా ఆలోచించండి... *
మైఖెల్‌ జోర్డాన్‌ అమెరికాలో మంచి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు. అతడికి చిన్నతనంలో తండ్రి ఒక డాలర్‌ విలువ చేసే టీషర్టు ఇచ్చి దాన్ని 2 డాలర్లకు అమ్మాలని చెబుతాడు. ఏమీ ఆలోచించని జోర్డాన్‌ ఆ టీషర్ట్‌ వేసుకొని వెళ్లి గిటార్‌ వాయిస్తూ రెండుడాలర్లను సంపాదిస్తాడు. ఆ తర్వాత అదే టీషర్డును 100 డాలర్లకు అమ్మాలని తండ్రి చెబుతాడు. ఏం చేయాలో తెలియక అప్పట్లో ఆదరణ ఉన్న మీక్కడోనాల్డ్‌ కార్టూన్లను ఆ టీషర్టుపై వేసి.. అమ్మకానికి పెడతాడు. వెంటనే ఓ వ్యక్తి 100 డాలర్లకు దాన్ని కొనుక్కుంటాడు. ఆ డబ్బును తీసుకెళ్లి అతడి తండ్రికి ఇస్తే ఈ సారి 500 డాలర్లు తీసుకురావాలని మరో టీషర్టు ఇస్తాడు. జోర్డాన్‌ ఆలోచించి వెంటనే నగరంలో ఉన్న మైకెల్‌ జాక్సన్‌ను ఎలాగోలా కలిసి ఆ టీషర్టు మీద ఆటోగ్రాఫ్‌ తీసుకొని.. వేలానికి పెడతాడు. అది 500 డాలర్లకు అమ్ముడవుతుంది. ఒకే టీషర్టును జోర్టాన్‌ వినూత్న ఆలోచనలు, కాస్త కష్టపడటంతో అతడి దాని విలువను పెంచగలిగాడు. యువతకు ఇలాంటి ఆలోచనలు రావాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో రాణించగలరు.

10. *స్వార్థం వీడి.. దేశం కోసం పాటుపడండి.. *
అలెగ్జాండర్‌ తాను చనిపోయిన తర్వాత తన శవపేటికను తనకు వైద్యం చేసిన వైద్యులే మోయాలని కోరాడు. తాను సంపాదించిన వజ్రవైడూర్యాలు తాను చనిపోయినపుడు తీసుకెళ్లేమార్గంలో పోయాలని సూచించాడు. చివరిగా సమాధిలో పడుకోబెట్టే సమమంలో తన రెండు చేతులను బయటపెట్టాలని కోరాడు. విశ్వవిజేత అయినా.. నేనేమీ తీసుకెళ్లడం లేదని అందరికీ తెలియాలని చెప్పాడు.

🙏🏻🙏🏻🙏🏻

Friday, 27 October 2017

యమధర్మ రాజు కి కూడా ఉంది ఒక శాపం

యమధర్మ రాజు కి కూడా ఉంది ఒక శాపం

పిల్లలు ఒక వయసుకి వచ్చేవరకూ, వారికి మంచిచెడుల విచక్షణ తక్కువగా ఉంటుంది. అందుకని పెద్దలు చేసే పొరపాటుతో సమానంగా పిల్లల పొరపాట్లనీ చూడలేం. కానీ ఎంతవయసు వరకూ ఓ పొరపాటుని బాల్యచాపల్యంగా భావించాలి? అన్న ప్రశ్నకు మహాభారతంలోని ఓ కథ స్పష్టమైన సమాధానం చెబుతుంది.
పూర్వం మాండవ్యుడు అనే ముని ఉండేవాడు. ఆయన మహా తపస్సంపన్నుడు, వేదవేదాంగాలను ఔపోసన పట్టినవాడు, సకల పుణ్యక్షేత్రాలనూ దర్శించినవాడు. అలా సకలతీర్థాలనూ సందర్శించిన తర్వాత ఊరికి దూరంగా ఒక ప్రశాంతమైన వనంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మాండవ్యుడు. ఆ ఆశ్రమంలోని ఒక చెట్టు కింద శీర్షాసనంలో ఘోరమైన తపస్సుని ఆరంభించాడు.
మాండవ్యుని తపస్సు ఉధృతంగా సాగుతున్న సమయంలోనే అక్కడ రాజుగారి కోటలో దొంగలు పడ్డారు. ధనాగారానికి కన్నం వేసి, ఖజానా మొత్తం ఖాళీ చేసేశారు. ఆపై రాజభటుల నుంచి తప్పించుకుంటూ తప్పించుకుంటూ మాండవ్యుని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని వెంబడిస్తూ వెంబడిస్తూ రాజభటులు కూడా ఆ ఆశ్రమానికి చేరుకున్నారు.
రాజుగారి ఖజానాను దోచుకున్న దొంగలు ఎటువెళ్లారంటూ, భటులు మాండవ్యుని అడిగారు. మాండవ్యుడు కఠోరమైన మౌనవ్రతంలో, శీర్షాసనంలో ఉండటంతో దొంగల గురించిన జాడని చెప్పలేక మిన్నకుండిపోయాడు. రాజభటులు ఆశ్రమానికి చేరుకోవడం చూసి దొంగలు కాస్తా, అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఇటు మాండవ్యుని దాటుకుని ఆశ్రమంలోకి ప్రవేశించిన రాజభటులకు అక్కడ రాజుగారి సంపద యావత్తూ కనిపించింది.
మాండవ్యుని ఆశ్రమంలో సంపదని చూసిన రాజభటులకు అతను కూడా ఆ చోరీలో భాగస్వామే అన్న అనుమానం కలిగింది. వెంటనే ఆ సొత్తునీ, మాండవ్యునీ కట్టగట్ట రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. మరికొద్ది రోజుల్లోనే మిగతా దొంగలు కూడా రాజభటులకు చిక్కారు. తన కోశాగారాన్నే దోచుకోవాలని ప్రయత్నించిన దొంగలకి రాజుగారు మరణదండనను విధించారు. వారికి సహకరించాడన్న అనుమానంతో మాండవ్యుని మెడలో శూలం గుచ్చి ఉంచమన్నారు.
తనకు శూలదండన విధించినప్పటికీ మాండవ్యుని తపోనిష్టలో ఎటువంటి మార్పూ రాలేదు. కారాగారంలో నరకయాతనను అనుభవిస్తున్న మాండవ్యుని దర్శించేందుకు ఎక్కడెక్కడినుంచో మునులు పక్షుల రూపంలో వచ్చి ఆయనను దర్శించుకోసాగారు. శూలం గుచ్చుకుని కూడా చనిపోకుండా తపోనిష్టని కొనసాగించడం, ఎక్కడెక్కడి నుంచో పక్షులు వచ్చి ఆయనను దర్శించుకోవడం గురించి విన్న రాజుగారికి... మాండవ్యుడు నిజంగానే ఓ మహాత్ముడు అన్న నమ్మకం కలిగింది.
మాండవ్యుని వెంటనే విడుదల చేయవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించారు. అపార్థంతో తను తలపెట్టిన కష్టానికి క్షమించమని వేడుకున్నాడు. అయితే మాండవ్యుని నుంచి శూలాన్ని తీసే సమయంలో దాని మొన (అణి) మాత్రం ఆయన గొంతుకలో ఉండిపోయింది. అప్పటి నుంచి ఆయనను అణిమాండవ్యుడు అని పిలవసాగారు.
‘ఇదంతా నా ప్రారబ్ధ కర్మ ఫలితమే!’ అంటూ మాండవ్యుడు ముందుకు సాగిపోయాడు. యథావిధిగా తన తపోనిష్టను సాగించాడు. కొన్నాళ్ల తర్వాత మాండవ్యుడు, యమధర్మరాజుని కలుసుకోవడం తటస్థించింది. ‘యమధర్మరాజా! చేయని తప్పుకి అంతగా శిక్షను అనుభవించేందుకు నేను చేసిన పాపమేమిటి?’ అని యముడిని అడిగాడు మాండవ్యుడు.
యముడు ‘మాండవ్య మహర్షీ! మీరు చిన్నతనంలో తూనీగల రెక్కలకి ముళ్లు గుచ్చి ఆనందించేవారు. ఆ తప్పుకి ఫలితంగానే శూలదండనని అనుభవించారు,’ అని వివరించాడు యమధర్మరాజు.
ఆ మాటలు విన్న మాండవ్యుడు కోపగిస్తూ- ‘యమధర్మరాజా! చిన్న పిల్లలకు యుక్తాయుక్త విచక్షణ ఉండదని నీకు తెలియదా! అలాంటివాని తప్పులకు తీవ్రమైన శిక్షలను విధించడం ఎంతవరకు భావ్యం? ఇక మీదట 14 ఏళ్లలోపు పిల్లలు తప్పుచేస్తే దానిని పెద్దమనసుతో క్షమించాల్సిందే! అలా కాదని వారికి పెద్దలతో సమానంగా శిక్ష విధిస్తే.... అలా శిక్ష విధించినవారికే ఆ పాపం చుట్టుకుంటుంది. అంతేకాదు! నేను తెలిసీతెలియని వయసులో చేసిన తప్పుకి ఇంత శిక్ష వేసినందకుగాను నువ్వు మానవజన్మనెత్తుదువుగాక!’ అని శపించాడు.
అప్పటినుంచీ హైందవ సంప్రదాయం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు చేసే తప్పులను చిన్నపాటి దండనతో సరిపెట్టమని చెబుతున్నారు. ఇక మాండవ్యుని శాపం వల్ల యమధర్మరాజు, విదురునిగా జన్మించాడు. నిన్నమొన్నటి వరకూ భారతీయ శిక్షాస్మృతిలో 18 ఏళ్లలోపు వారినే బాలనేరస్తులుగా పరిగణించేవారు. కానీ నిర్భయ హత్య తర్వాత ఆ వయసుని 16 ఏళ్లుగా కుదించారు. అది కూడా సరిపోదనీ.... 14 ఏళ్లు దాటినవారు ఎవరైనా తీవ్రమైన అపరాధం చేసినప్పుడు, కఠినదండనకు అర్హులే అని చాలామంది మేధావులు వాదిస్తున్నారు. కానీ ఎప్పుడో మహాభారతకాలంలో ఎవరు బాలనేరస్తులు, ఎవరు కారు అన్న విషయంలో ఓ స్పష్టత ఉండటం గమనార్హం.

Thursday, 26 October 2017

హరిఃఓం

*'జాతస్య హి ధ్రువో మృత్యుః' అంటుంది మన గీత. పుట్టినవాడు గిట్టక తప్పదని దీని సారాంశం.*

*మరి మన తలరాత ఎలా ఉందో చూద్దాం. పుట్టటం నుంచి గిట్టడం దాకా ఈ 'మాయ'మర్మాన్ని కొద్దిగా తెలుసుకుందాం.*

 *ఈ విశ్వాన్ని ఇంగ్లీషులో యూనివర్స్‌ అంటున్నాం. యూని అంటే ఒకటి, వర్స్‌ అంటే అనేకం. ఏకం, అనేకం కలిసి యూనివర్స్‌ అయింది. అనేక రూపాలలో కనిపించేదంతా ఒక్కటే అని ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలి.*

*కాబట్టి ఈ బ్రహ్మాండానికీ పిండాండానికీ తేడా ఏమీ లేదు. మనం పిండాండం నుంచి వచ్చాం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం.*

 *మనిషి శరీరంలో 72 శాతం నీరు ఉంది. వెన్నెముక నుంచి అన్ని వైపులకూ 72 వేల నాడులు ఉన్నాయి.*

*వీటిలో 14 నాడులను ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ 14 నాడులకూ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉన్న 14 తిథులకూ సంబంధముంది.*

 *తిథి అంటే నక్షత్రంలో సగం. శుక్ల పక్షంలోని 14 తిథులు, కృష్ణ పక్షంలోని 14 తిథులు కలిపితే 28 నక్షత్రాలు అవుతాయి.*

*మన నక్షత్రాలు 27 అయినా అభిజిత్‌తో కలిపి 28 కదా! మాయ అంటే మనమెవరో తెలియకపోవడం. ఒకటి అనేకం కావడమే సృష్టి. ఆ ఒక్కటిలో అన్నీ చేరడమే ప్రళయం. అదే మరణం కూడా.*

*మనిషి పుట్టుకకు మూలకారణం స్త్రీలకు ప్రతి నెలా జరిగే రుతువు (బహిష్టు). మనుషులలో ఈ బహిష్టు 27 లేదా 28 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఈ బహిష్టు ప్రారంభమైన క్షణం నుంచి 24 గంటలు ఒకరోజు.*

*అలాంటి 27 రోజులు లేదా 28 రోజులు ఒక నెల. నెల అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. నెలరాజు, నెలపొడుపు అనే పదాలు ఇలా ఏర్పడినవే.*

*బహిష్టుకు 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది. ఈ అండం ఫలదీకరణం చెందితే పిండం గర్భాశయాన్ని చేరుతుంది.*

*శిశుజననంతో రుతుచక్రం ఆగిపోతుంది. దీన్నే మనం నెలతప్పడం అంటుంటాం.*

*భగవంతుడు తన శరీరంలో నాలుగో వంతు భాగంతో సృష్టిచేశాడని పురుషసూక్తం అంటోంది. కాలచక్రానికి సూర్యుడే ఆధారం.*

*సావన సంవత్సరం అంటే 360 రోజులు. ఇదే రాశిచక్రంలోని 360 డిగ్రీలు. దీని ప్రకారం 360 రోజుల్లో నాలుగోవంతు 90 రోజులు అవుతుంది.*

*ఈ 90 రోజులు పోగా 270 లేదా 280 (40 వారాలు) రోజుల్లో శిశువు జన్మిస్తుంది.*

*120 నెలలను పరమాయువు అంటారు. దీని ఆధారంగానే సూర్య సిద్ధాంతం రూపొందింది. ఉత్తరాషాఢ, శ్రవణాల మధ్య అభిజిత్‌ నక్షత్రం ఉంటుంది.*

*ఈ 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్రాన్ని పరాశరమహర్షి రూపొందించారు. సౌర అంటే 72, హోర అంటే 82. వీటిని తిరగేస్తే 27, 28 వస్తాయి.*

*27 నక్షత్రాల ఆధారంగా సూర్యసిద్ధాంతం, 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్త్రం రూపొందాయి. అందువల్ల దీన్ని పరాశర హోరాశాస్త్రం అన్నారు.*

*నక్షత్ర మానం ప్రకారం 27.321 రోజులు ఒక నెల. అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 120 సంవత్సరాలు మనిషి ఆయువు.*

*జ్యోతిష శాస్త్రం ప్రకారం దశలన్నీ కలిపితే 120 సంవత్సరాలు వస్తుంది. దీన్ని బట్టి మనిషి పూర్ణాయువు 120 సంవత్సరాలని అనుకోవలసి వస్తోంది.*


*120 సంవత్సరాలు బతకాల్సిన మనిషి అందులో సగం కూడా బతకడం లేదు ఎందుకు అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంటుంది. దీనికి కారణం మనిషి తీసే శ్వాసలే.*

*ముఖ్యంగా మనిషి పూర్ణ శ్వాసలు తీయడం లేదు. అర్ధశ్వాసలతో కాలం గడిపేస్తున్నాడు.*

 *మనిషి నిమిషానికి తీసే శ్వాసలు 15. రోజుకు 1440 నిమిషాలు. 1440ని 15తో హెచ్చిస్తే 21,600 శ్వాసలు వస్తాయి. 12 రాశులు, 12 నెలలు, పూర్ణాయువు 120 సంవత్సరాలు, కలియుగం 1200 దివ్య సంవత్సరాలు, మహాయుగం 12000 దివ్య సంవత్సరాలు... ఇలా ఒకదానితో ఒకటి సంబంధం కనిపిస్తూనే ఉంటుంది.*

 *తక్కువ శ్వాసలు తీసే జీవి ఎక్కువ కాలం బతుకుతుంది. ఎక్కువ శ్వాసలు తీసే జీవి తక్కువ కాలం బతుకుతుంది.*

 *మనం యోగశాస్త్రాన్ని అభ్యసిస్తే పూర్ణాయువు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు.*

 *మరణం అంటే శరీరం మార్పునకు లోనవడం.*

 *ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు.*

*ఇక ఈ జన్మలో అనుభవిస్తున్న కర్మ ఫలితాల గురించి అంటారా... సత్కర్మ ఉన్న వారికి సరైన పరిహార క్రియలు తప్పనిసరిగా అందుబాటులోకి వస్తాయి.*

 *ఆ సత్కర్మ బలం లేనివారు ఎక్కడెక్కడో తిరుగుతూ వేల రూపాయల్ని పరిహార క్రియల పేరిట వదిలించుకుంటారు.*

 *అణువుకూ ఆత్మకూ తేడా ఏమీ లేదు.*

*ఇదంతా సూర్యకాంతి శక్తి. మన జీవితాలన్నీ సూర్యకాంతి శక్తితో ప్రేరణపొంది నడుస్తున్నాయి. ఈ సూర్యకాంతే సృష్టి, స్థితి, లయలకు మూలం.*

ఈ అనంత సూర్య శక్తిని సాధించి మనమే పూర్తిగా సూర్యకాంతిగా మారి అందులోనే లయం కావాలని గాయత్రీ మంత్రం కూడా చెబుతోంది.
వన్నీ మన వేదాలు,ఇతిహాసములు,
పురాణములు, స్మృతులు  తెలుపుతున్నాయండీ
                 మీ
తాడిపత్రి ప్రశాంత్ కుమార్
         ఆస్ట్రోలాజర్
          నిజామాబాద్.
cell:
7095057870:
7032633222

Sunday, 22 October 2017

23-10-2017 సోమవార
కాకర్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమన



దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ

సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!

అనంతాది మహానాగ రూపాయ వరదాయచ

తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా

అలా! ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద 'దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము; అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే! మంచి భర్త లభించునని పలువురి విశ్వాసము. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిదికాదు. యుగాలనాటిది. సౌభాగ్యానికి, సంతానప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాధలు కానవస్తున్నాయి.
దేశమంతట పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ "నాగులచవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం. నాగేంద్రా! మేము మా వంశములోవారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున"తోకతొక్కితే తొలగిపో. నడుంతొక్కితే నా వాడనుకో! పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కరాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. నూకని పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకివ్వు తండ్రీ అని చల్లి పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటాము. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజన్నా మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |

ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||

ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరంపూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధనచేసే వారి వంశం 'తామరతంపరంగా' వర్ధిల్లు తుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణేశ్వరుడే! ఆయన అందరికీ ఆరాధ్య దైవంకాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.

తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్‌
తలతోకయనక యుండు ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ!
అని చెప్పినట్లు...అలా మనచుట్టూ మానవరూపంలో ఉండే మానవులు; సర్పజాతి మనసుకంటే; నికృష్టమైన (అంటే! అవి మనంవాటి జోలికి వెళితేనే ప్రమాదకరమవుతాయి.), వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మనచుట్టూ తిరుగుతున్నా గమనించలేక పోతున్నాం! అని గ్రహించుకోవలసి ఉంది. నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట! దాని సమీపంలో 6నెలలు తెల్లని ఇసుక, 6నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి ప్తెకివస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది.
యోగీశ్వరో మహాశయనా కార్తికేయోగ్ని నందనః |
స్కందః కుమారః సేనాని స్వామీ శంకర సంభవః ||

గాంగేయ స్థామ్ర చూడశ్చ బ్రహ్మచారి షికిధ్వజః |
తారకారి ఉమాపుత్ర క్రౌంచారీశ్చ షడాననః ||

శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిద్ధః సారస్వతౌ గుహః |
సనత్ కుమారౌ భగవాన్ భోగ మోక్ష ఫలప్రదః ||

సర జన్మ గణాధీశా పూర్వజో ముక్తి మార్గకృత్ |
సర్వాగమ ప్రణీతాచ వాంచితార్ధ ప్రదర్శినః ||

అష్ట వింశతి నామాని మదీయానీతి యః పఠేత్ |
ప్రత్యుషే శ్రద్ధయా యుక్తో మూకో వాచ పతిర్భవేత్ ||

మహామంత్ర మయానీతి మామనామాను కీర్తనం |
మహా ప్రజ్ఞా మవాప్నోతి నాత్ర కార్య విచారణా  ||

వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాలలో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని, పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి, ఏ రకమయినటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాము. మన భారతీయుల చాల ఇళ్ళల్లో ఇలవేల్పు " సుబ్రహ్మణేశ్వరుడే ఆరాధ్య దైవంగా పూజిస్తారు కాబట్టి వారి పేరును చాల మంది నాగరాజు, ఫణి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు వగైరా పేర్లు పెట్తుకుంటూ ఉంటారు.

వ్రతం ఆచరించే పద్ధతి / ఫూజ చేయు విధానము : దైవారాధన ఒక నమ్మకము ... ఏనాడూ నమ్మకము మూడనమ్మకము కాకూడదు !. మూడనమ్మకాలు జీవితంలో అనర్ధాలకు దారితీయును . నమ్మకము ... మనశ్శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది. నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. ... , ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో "ఓం నాగేంద్రస్వామినే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలుపోసి పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. ఇది వ్రతం ఆచరించే పద్ధతి. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. చెవిబాధలు, కంటిబాధలు ఉన్నవాళ్లకు చవితి ఉపవాసం మంచిది. నాగవస్త్రాలు పుట్టమీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరుతాయి.బాలబాలికలు దీపావళి రాత్రి నాగదివ్వెలను వెలిగించే చవితిని స్మరించి ఆహ్వానిస్తారు. దీపావళి పండుగ వెళ్లిన నాలుగోనాడు మనకు నాగులచవితి
సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మ పురాణంలో ఒక కథ ఉంది.
శూరసేనుడు చంద్రవంశపు రాజు. శూరసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లా డింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాము అని తెలుసుకుంది. ఆమె ఏమాత్రం భయపడక ఆ పాముతో కలసిమెలసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవసమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపవిమోచనం పొందాడు.

"చలిప్రవేశించు నాగులచవితి నాడు మెరయు వేసవి రథసప్తమీ దివసమున అచ్చసీతు ప్రవేశించు పెరిగి మార్గశిర పౌష మాసాల మధ్య వేళ'' అని శివరాత్రి మాహాత్మ్యంలో శ్రీనాథుడు పేర్కొన్నాడు. చలికాలం ఆరంభమయ్యే కార్తీకమాసంలో చవితినాడు నాగపూజ చేయడం ఆంధ్రదేశంలో ప్రాచీనకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం.
భవిష్యపురాణం 'నాగదష్టవ్రతం' గురించి చెబుతోంది.
''నాగదష్టో సరో రాజన్‌ ప్రాప్యమృత్యుం ప్రజత్యథః అధోగత్వా భవేత్సర్పో నిర్తిషో నాత్ర సంశయః''-
''రాజా! పాముకాటు పొందిన నరుడు మరణించిన పిదప పాతాళ లోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతా''డని సుమంతుడు చెప్పగా శతానీకుడు పాముకరచినవాని కుటుంబీకులు అతని మోక్షప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లు కథ. కొన్నిచోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే, కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు నాగపూజ చేయడం పరిపాటి. స్కందపురాణంలో దీనిని 'శాంతి వ్రతం' అన్నారు.

హైందవ సంప్రదాయంలోనే గాక జైన బౌద్ధధర్మాల్లోను నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. అమరావతీ స్తూపంలో ఫణీంద్రుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి. దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడు నాగభూషణుడు, అతని వింటినారి వాసుకి. శ్రీమహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పం పైనే. వినాయకునికి సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి. ఆంధ్రదేశం దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారివల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయచిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరం, నాగపట్నం, నాగులపాడు మొదలైన గ్రామనామాలు; నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు; నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం. అమరావతి స్తూపంలో నాగబు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు. మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్థానేకాదశికి ఈ నాగులచవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం. ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు.

నాగుల చవితికి మిగతా పండుగాల్లాగా ఇళ్ళకు సున్నాలు అవీ పూయకూడదు. ఇళ్ళల్లో కానీ, పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చాకూడదు. ఇల్లు తుడిచాక ముగ్గుపిండితో ముగ్గు పెట్టకూడదు. సుద్దముక్కలు లేకపోతే చాక్ పీస్ లతో ముగ్గు పెట్టాలి. అన్ని గుమ్మాలకీ, తలుపులకీ ఆస్తిక అని వ్రాయాలి. ఆస్తికుడు ఎవరంటే .... అర్జునుని కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా, శాపఫలితంగా పరీక్షిత్తు పాముకాటు వలన మరణిస్తాడు. తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు పాముజాతిని మట్టుపెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. యాగం మధ్యలో సర్పజాతిని రక్షించటానికి ఆస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జనమేజయున్ని ఒప్పించి సర్పయాగాన్ని ఆపి జగత్కళ్యాణ కారకుడు అవుతాడు. అందుకే నాగులచవితి రోజు ప్రతి వాకిలి దగ్గరా ఆస్తీక అని వ్రాసి సర్పజాతిని కాపాడినవాడిని తలచుకోవడం జరుగుతుంది.

నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులతో ఉపయోగిస్తారని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది. నాగులచవితి రోజున ఉపవాసం ఉండి పాముపుట్టను పూజించాలి. పుట్టలో ఆవుపాలు పోయాలి. పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగవిగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. సాధారణంగా ప్రతిచోట ఆలయాలలోనూ, రావి, వేప చెట్ల క్రిందా ఈ నాగవిగ్రహాలు / నాగబంధం ఉంటుంది.

ఒక విషయం గుర్తుంచుకోండి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములు పాములు పాలు త్రాగితే అరగక కక్కెస్తాయి, మరణిస్తాయి కూడా. దేవత సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు. మనిషి కంటికి కనిపించవు, అంటే మానవ కదలికలను లేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్ది పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. నాగదేవత పూజలో పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణీంచే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి. పసుపుకుంకుమలను పుట్టదగ్గరవాడకండి.
పుట్ట దగ్గర / నాగబంధం దగ్గర పూజించాకా, ఇంటి గడప దగ్గర కూడా పాలుపోయాలి. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తుంటాడు. కనుక ఇంటి గడప మీద పాలు పోయండి, కాసింత చిమ్మిలి, చలివిడి పెట్టండి, ఒక అరటిపండు ముక్క పెట్టండి. మరునాడు ఇంట్లో బంగారంతో కాని,వెండితో కాని,కొయ్యతో(చెక్క) కాని,మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ,జాజి,సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి. ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి.

Friday, 20 October 2017

యమద్వితీయ(భగినీ హస్త భోజనం)

*యమద్వితీయ(భగినీ హస్త భోజనం)*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*'భగిని'* అంటే తోబుట్టువు అయిన సోదరి అనీ, భాగ్యవంతురాలు అనీ అర్థం. సోదరి చేతివంటను తినడం . ఈ సంప్రదాయానికి ఎంతో విశిష్టత ఉంది. *యమధర్మరాజు సోదరి యమునానది. ఆమె పూర్వం తన అన్న అయిన యమధర్మరాజు దగ్గరకు ప్రతి నిత్యం వెళ్లి, తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరేదట. నరకలోక పాలనలోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి ఎన్నాళ్లకూ తీరిక దొరకలేదు. ఎలాగైనా ఒక దినాన చెల్లెలి ఇంటికి వెళ్లి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి అతనికి కార్తికమాసం, శుక్లపక్షం, ద్వితీయాతిథినాడు విరామం దొరికింది. ఆ దినాన యమున ఇంటికి వెళ్లాడు. ఎన్నాళ్లో ఎదురుచూడగా అనుకోకుండా వచ్చి, తన ప్రార్థనను మన్నించిన అన్నకు యమున షడ్రసోపేతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతివంటను మెచ్చుకొని, ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు.* అప్పుడామె- *'అగ్రజా! నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతివంటను తినివెళ్లాలి. అంతేగాక, ప్రతి సంవత్సరం కార్తీక శుక్లద్వితీయనాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్లు వండిన పదార్థాలను భోజనం చేస్తారో, అలాంటివాళ్లకు నరకబాధ ఉండరాదు. ఇదే నేను కోరే వరం'* అని పలికింది. యముడు *'తథాస్తు'* అన్నాడంటారు. నాటి నుంచి ఈ వేడుక *'యమద్వితీయ'* (యముడు తన సోదరి చేతివంటను తిన్న దినం) అనీ, *'భ్రాతృద్వితీయ'* (అన్న చెల్లెలి చేతివంట తిన్న పవిత్ర దినం) అనీ ప్రసిద్ధిలోకి వచ్చింది.

*'భగినీహస్త భోజనం'* అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం, ఆచారం. ఇందులో మానవజీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబజీవి. కనుక కుటుంబాన్ని విడిచి క్షణంకూడా జీవించలేడు. కుటుంబంలో ముఖ్యులు తల్లిదండ్రులు. వాళ్లు సంతానాన్ని కని, పెంచి, పోషించి, పెద్దచేసి, విద్యాబుద్ధుల్ని ప్రసాదించి, తమ సంతానానికీ కుటుంబాలను సంపాదించిపెడతారు. మనిషికి తల్లిదండ్రుల తరవాత ఆత్మీయులైనవాళ్లు తోబుట్టువులైన అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కదా! తల్లిదండ్రులు వయసులో పెద్దవాళ్లు కనుక, తమ సంతానం బతికినంతకాలం బతుకలేరు. తమ సమకాలంలో పుట్టిన తోబుట్టువులు తమ జీవితాంతం వరకు బతికే అవకాశం ఉంది. అందువల్ల అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెళ్లు కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలిసి భోజనం చేయకపోతే ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? అంతేగాక, ఒకరి కష్టసుఖాలను మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. కనుక ఈ భోజన సంప్రదాయం కుటుంబ సభ్యుల మధ్యన జీవితాంతం వరకు ప్రేమాభిమానాలను కలిగి ఉండే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. బతుకు తెరువుకోసం దూరదూరాలకు వెళ్లకుండా ఉండిన ప్రాచీనకాలంలోనే ఈ సంప్రదాయం, ఆచారం కొనసాగింది. ఇక ఆధునికకాలం ఉపాధికోసం రాష్ట్రాల సరిహద్దులనే కాదు, దేశాలను, ఖండాలను దాటిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికొకసారి కాదుగదా, రెండు మూడేళ్లకూ ఆత్మీయులను, తోబుట్టువులను కలుసుకోలేని దుస్థితిలో ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? కనుక ఎప్పుడో ఒకప్పుడు కలిసినా ఈ ఆచారాన్ని పాటించి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకువెళ్లి, వాళ్ల చేతివంటను భుజించి, వారికి ధనకనక వస్తువాహనాలను యథాశక్తిగా సమర్పించుకొంటే ఆత్మీయబంధాలు వర్ధిల్లుతాయి. ఒకరికొకరం అండగా ఉన్నామనే భావన, విశ్వాసం కలుగుతాయి. ఇవే ఆచారాలు, సంప్రదాయాలు. రాగద్వేషాలకు అతీతంగా విశ్వక్షేమం కోసం ఏర్పాటు చేసినవే ఆచారాలనీ, వాటిని వంశపారంపర్య క్రమంలో పాటించినప్పుడు సంప్రదాయాలవుతాయనీ పెద్దల మాట. ఆచారం ఎప్పుడూ దోషభూయిష్ఠమై ఉండదు. యుక్తాయుక్త విచక్షణగల మానవులు తమ ఆచరణల్లో ఏయే లోపాలున్నాయో తెలుసుకొని, వాటిని సవరించుకొని చక్కగా ఆచరించాలి. అదే విజ్ఞత అంటే.


*'ఆత్మా వై పుత్రనామాసి'* అన్నది వేదం. అంటే, తల్లిదండ్రుల ఆత్మలే సంతానంలో ఉంటాయని అర్థం. అందువల్ల అక్కాచెల్లెళ్లు అమ్మకు ప్రతిరూపాలే. అమ్మ చేతివంట అమృతసమానం అయితే అక్కాచెల్లెళ్ల చేతివంట కూడా సుధామయమే. కనుక *'భగినీహస్త భోజనం'* అన్ని విధాలా అమృతభక్షణంతో సమానం. ఈ పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే చాలు- ఈ పర్వదినంలోని మహిమ బోధపడుతుంది. ఏ సంప్రదాయమైనా, ఆచారమైనా మానవాళి మధ్య సద్భావనలను పెంపొందింపజేసి, స్నేహాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను శాశ్వతంగా నిలపడంకోసమే. ఇది గ్రహిస్తే భూలోకం అభినవ స్వర్గమే అవుతుంది.

Wednesday, 18 October 2017

🙏🌼🍀🌅🍀🌼🙏
నిత్యపూజ చేయడం అనేది సాధారణముగా ఇంటి యజమాని అయిన పురుషుడు చేస్తాడు.
సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది.
అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి.
ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి.
 పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది.

వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం.

ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే  ఉండాలి పురుషుడికి.

చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పక్కరలేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు.

యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు.
ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి.

మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి.

‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు.

దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు.

పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మవిద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.

సేకరించి పంపబడినది
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
🙏🌼🍀🌅🍀🌼🙏

Sunday, 15 October 2017

మన వాజ్మయం లో “0” :
======××××=====

ఈమధ్య కొందరు తెలియకుండా “0” విలువ ఆర్యభట్టుడు కనుక్కుంటే రామాయణం సమయానికి తెలియనప్పుడు రావణుడి తలలు 10 ఎలా లేక్కకట్టారు అన్న ఒక వెర్రి జోకును పంచుతున్నారు.

శూన్యం అన్న పదం “0” అనే నిరూపణం మన వేదాలు ప్రపంచానికి అందించిన అత్యద్భుతమైన వరం.

ఆ 0 విలువను మేము కనుక్కున్నామంటే మేము కనుక్కున్నామని కొందరు పైత్యకారులు గొడవ మొదలెట్టారు కానీ, ఐన్స్టీన్, న్యూటన్, కెప్లెర్ లాంటి ప్రపంచ మేధావులంతా ముక్త కంఠంతో 0 భారత దేశం గణితానికి అందించిన అతి గొప్ప ఆవిష్కరణ అని ఒప్పుకున్నారు.

కానీ ఇక్కడ మరొక వితండ వాదం మొదలెట్టారు. అది 400 AD లో కనుక్కున్నారని, ఇంతకు ముందే బాబిలోనియన్లు , మాయన్ లు కనుక్కున్నారని. దానికి సంబంధించి దొంగాలేక్కలు వెయ్యడం మొదలెట్టారు.

అసలు ఈ శూన్యం ఎప్పటిది? ఎవరు కనుక్కున్నారు? అన్న విషయం కొంచెం పరిశీలిద్దాం
అసలు 0 లేకుండా మన వేదాలలో అతి పెద్ద నెంబర్ లు ఎలా వుండివుంటాయి.

అయుత ( 10,000), నియుత ( వంద వేలు ), ప్రయుత ( million), అర్బుదం, న్యర్బుదం, అబ్జ, ఖర్వా, పరార్ధ, ల్.... తల్లక్షనాం ( 10**53) వరకు ఎలా కనిపెట్టి వుంటారు?

 ఈ రోజుకు కూడా మనకు 10**30(డెక) దాటాక ఏమనాలో పేరు పెట్టలేదు.
కానీ మనకు అంత పెద్ద గణితములు మనకు ఎప్పుడో ఋగ్వేదం, యజుర్వేదాలలో చెప్పబడి వుంది. 0 విలువ తెలియకుండానే ఇవన్నీ చెప్పబడి ఉన్నాయంటారా?

పింగళుడు ౩ వ శతాబ్దంలో ఛందస్సాస్త్రం (8.29 లో రూపే శూన్యం) 0 ని వాడి వున్నాడు.

 ఛందశ్శాస్త్రం వేదాంగం దానిలో వాడారు 0 ని, అది వేదాలనుండి గ్రహించబడి వున్నది.

అది మొదటిది అని అప్పుడే మనవారు కనుక్కున్నారని దుష్ప్రచారం మొదలెట్టారు. కానీ శూన్యం (0) అన్న వాడుక ఆది నుండే వున్నది.

బృహదారణ్యక ఉపనిషద్ 5.1 లో శుక్ల యజుర్వేదం 1.4.10 “ఖం బ్రహ్మ” అని ఘోషిస్తుంది. శూన్యమే బ్రహ్మ అని , అది ఖం లా అగుపించే పూర్ణం అని చెప్పబడి వుంది.

యజుర్వేదాలలో అస్త్ర శస్త్ర విద్యలలో ఎలా ఏ ఆయుధం ఉపయోగించాలో దానికి తగ్గ గణిత జ్ఞానం వున్నది.

అదే లేకపోతే రామాయణ మహాభారత యుద్ధాలలో శస్త్ర వాడకం ఉండేదా?

ఆర్యభట్ట 0 ని కనుక్కున్నాడు అని ఒక విషయాన్ని వారు ఒప్పుకుని మనకేదో పెద్ద సహాయం చేసినవారిలా మాట్లాడుతారు వారు.

కానీ ఆయనకన్నా ముందే బ్రహ్మగుప్తుడు తన సిద్ధాంత శిరోమణి లో 0 ని పేర్కొని వున్నాడు. అది అంతకు మునుపు ఉన్నదానిని తాను సూత్రీకరించానని ప్రకటించాడు.

బ్రహ్మగుప్త – సున్నా కు సింబల్ “0”

బ్రహ్మగుప్త సిద్ధాంత :
A + 0 = A
A – 0 = A
A * 0 = 0
A / 0 = 0 ( భాస్కరాచార్యుని లీలావతి లో అనంతం అని చెప్పబడి వుంది పరిష్కరిమ్పబడింది.

మహర్షి వ్యాసులు భారతంలో ఎప్పుడు ఎప్పుడు గ్రహణాలు వస్తాయో విస్పష్టంగా చెప్పారు. అది సరైన కాల్కులేషన్ లేకుండా చెయ్యలేరు. అప్పటికి 0 లేకపోతే ఈ గణన సాధ్యమే కాదు.

గణిత శాస్త్రంలో "శూన్యం" అని చెప్పబడినది,
వ్యాకరణంలో "లోపం" అని , ఆధ్యాత్మికంలో "పూర్ణం" అని, బీజగణిత ( ఆల్జీబ్రా), చలన గణిత ( calculus), త్రికోణమితి (trigonometry) జ్యోతిష్య గణితమలో 'ఖం" అని ఎన్నో రకాలుగా ఉపయోగింప బడి వున్నది.

 ఇవి నిన్నో, నేడో పుట్టుకు వచ్చినవి కావు. ఇవి అనంతగా ప్రవహిస్తున్న మన వాహినిలో అంతర్భాగాలు.

మిగతా ప్రపంచం బట్టకట్టుకోవడం నేర్వ నపుడు మన సంస్కృతి ఎంతో ఉన్నతంగా పరిధమిల్లింది.

ఈ గణితం తెలియకపోతే ఒక చక్రానికి ఎన్ని spokes కావాలో ఎలా లెక్కగట్టి వుండేవారు?

ఈ సున్నా ఎలా ప్రపంచంలో మారిందో గమనించండి.
(వేదిక్)శూన్య
సిఫ్ర్ (అరబిక్)
జేఫ్యర్ (లాటిన్)
జీరో (నేటి అన్ని భాషలు)
0 ఏ కాదు,

అనంతం కూడా మన వాజ్మయంలోనే ముందు పరిష్కరింప బదివున్నది. లీలావతి లో భాస్కరాచార్యులు దానికి ఒక రూపం ఇచ్చారు. అసలు మన శాంతి శ్లోకం ఈ అనంతం తోనే మొదలవుతుంది.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పుర్ణాత్పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

మాములుగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చుస్తే "అది పూర్ణం, ఇది పూర్ణం. పూర్ణంనుండి పూర్ణం ఉద్భవిస్తుంది. పూర్ణంనుండి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగులుతుంది."

ఇది భగవంతుని పూర్ణ తత్వాన్ని చెప్పే శ్లోకం. భగవంతుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించినా ఆయనయొక్క పూర్ణత్వానికి ఏ లోటు లేదని చెపుతుంది.
∞ - ∞ = ∞
∞ - x = ∞

1202AD వరకు చర్చి 0 ని ఒప్పుకోలేదు. చివరికి 16వ శతాబ్దంలో దాన్ని వాడుకలోకి తెచ్చుకున్నారు.

మన సంఖ్యవిస్తారం ఒకసారి ఈ లింక్ చూసి ఆనందపదండి
https://en.wikipedia.org/wiki/History_of_large_numbers

కానీ అనంత కాలం నుండి మనకు వున్న విజ్ఞానాన్ని మనమే ప్రశ్నించుకుంటున్నాము. ఒక్కసారి పరిపూర్ణంగా ఆలోచించి పరిశోధిస్తే మనకు సత్యం బోధపడుతుంది.

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

Source :
FB - Veda smskruthi

Saturday, 14 October 2017

మనుస్ర్ముతి...గురించి చర్చించిన సభ(జరిగిన చరిత్ర)
మిథిలరాజు హరిసింహుడికి ఓక ధర్మసంకటం వచ్చింది.ఇలాంటి ధర్మ సంకటాలకే కాదు యుద్ద సంకటాలకు కూడా తాను ఆదారపడే మంత్రి ఛండీశ్వరుడు. వెంటనే అతనికి కబురమపాడు రాజు.
   సభ నిండుగా కోలువేై వుంది.చాలా మంది పండితులు వారి వాదన వినిపించటానికి వచ్చారు.రాజు సమస్యను ఇలా వివరిస్తున్నాడు.
   తన ఆస్థానంలో పని చేస్తున్న శ్వేతభట్టు అనే అదికారికి కోన్ని సం"ల క్రితం పెళ్లి అయింది.అయితే ఈ మద్య అతనికి తన భార్య తన కులం కాదని తెలిసింది.వారి భందువులు ఆమెను వదిలేయాలని గోడవపడుతున్నారు.శాస్త్ర సమ్మతం కాదని వాదిస్తున్నారు.కాని మన శ్వేతభట్టు ఆమెను విడచి ఉండలేడు..వారు ఓకర్నోకరు వదలి జీవించలేమంటున్నారు..ఇది సమస్య అన్నాడు రాజు.
   అపుడు పండితులలో ఓకడు లేచి ప్రభూ నేను అన్ని శాస్త్రాలను పరిశీలించాను.మనుస్ర్ముతి లో ఇలాంటి సంధర్భంలో తెలీకుండా దోషసహితమైన స్త్రీని భార్యగా స్వీకరిస్తే  అది తెలిసాక త్యజించవచ్చు..ఆవివాహం చెల్లదని ఉంది. అన్నాడు.
ఇంకో పండితుడు లేచి ప్రభూ మనుస్ర్ముతి లో ఆసంధర్భం వేరు.కావాలన మోసం చేసి పెల్లి చేసినపుడు తర్వాతైనా తన ధర్మాలను భార్య నిర్వహించలేని పక్షంలో అతజు మోసపోయాడని భావిస్తే ఆ వివాహం రద్దు చేయవచ్చు అని దాని అర్థం. అదే మనుస్ర్ముతి లో 10 నియమాల కింద చెప్పబడింది ఏమంటే తనకన్నా తక్కువ ఎక్కువ జాతికి సంభందించిన అమ్మాయిని మోసం చేసి పెల్లిచేసినా ఆమె అనుకూలవతి అయితే భర్త ప్రేమను చూరగోన్నది అయితే ఆ వివాహం దర్మబద్దమైనదే అవుతుంది అన్నాడు.
మరో పండితుడు తన వాదన వినిపించి శాస్త్ర విరుద్దం వీరిని విడదీయాల్సిందే అన్నాడు.
వేరోక పండితుడు లేచి" పరస్పర విశ్వాసం జీవిత పర్యంతం ఆలుమగలు నడుమ కోనసాగాలన్నది మనుస్ర్ముతి ఆశయం.దీన్లో కుల ప్రసక్తి లేదు" అని తన వాదన వినిపించాడు.
రాజుకు పాలుపోలేదు..ఓక మనుస్ర్ముతి పై ఇన్ని భిన్నాభిప్రాయాలు ఎలా వస్తున్నాయో అర్థం కాక ఛండీస్వరుని వైపు చూశాడు.
ఛండీశ్వరడు లేచి ,ఎలాగయితే వేదం మనకు ఎంతో ఆలోచన స్వేచ్ఛనిచ్చి కూడా పరబ్రహ్మాన్ని నిరాకరించకూడదన్న నియమం పెట్టిందో,అలాగే మనుస్మ్రుతి నిత్యజీవితంలో మనిషి చేసే ప్రతి పని వెనుక స్వారథం ఉంటుంది.అందుకే నేరాలు చేస్తాడు.వాటిని మనుస్మ్రుతి నిర్దిస్టంగా సూచించింది.
   అవి
మనసుతో చేసే పాపాలు=ఇతరులకు చెందిన దానిని ఆశించటం,చేయకూడని ఆలోచనలు చేయటం,దుష్టసిద్దాంతాలు నమ్మటం.
మాటలతో చేసే పాపాలు=ఇతరులను దూషించుట,వారి గోప్పతనాన్ని గుర్తించకపోవుట,అబద్దం ఆడటం లాంటివి.
శరీరంతో చేసే పాపాలు=తనకు ఇవ్వని దాన్ని తీసుకోవటం,చట్టబద్దం కాని హింస,పరభార్యతో నేర ప్రవ్రుత్తి లాంటివి.
..ఈమూడు రకాల పాపాలలో మన శ్వేతభట్టు అతని భార్య ఏ పాపాలు చేయలేదు.మరిక్కడ నేరమేముంది.ఏ నేరాన్ని మనమిక్కడ చర్చిస్తున్నాం.మనుస్ర్ముతి ప్రకారం ఈమూడు నేరాలలో ఏది చేసినా ఆనియమ నిబందనలు దగ్గరికి వెల్లాలి.అన్నాడు.సభ మౌనం వహించింది.
శ్వేతభట్టు భార్యకులం నిర్ణయించాలంటే ముందు తరాల చరిత్ర తెలియాలి.ఎందుకంటే ఓకే జాతి నుంచి ఎన్నో కులాలు ఏర్పడ్డాయి.ఇంకో విషయం ఏంటంటే మనదేశంలో ఏర్పరిచిన వర్ణాలు స్వభావ సంబంధమైనవి గాని పుట్టుకకు సంబంధించినవి కావు.స్వభావ సిద్దమైన గుణాల ప్రకారం సక్వగుణం కలవారు బ్రాహ్మన వర్ణం వారు విఙ్ఞానఆర్జన మాత్రమే చేయాలి.దానితో సమాజానికి దిశా నిర్దేశం చేయాలి .కాని ఇపుడు బ్రాహ్మనులమని చెప్పుకునే వారంతా అనేక రకాల వ్రుత్తులు చేస్తున్నారు,కత్తి పట్టి యుద్దం కూడా చేస్తున్నారు.బ్రాహ్మన వర్ణానికి అంటరానిదైన ధనం కోసం తెగ వెంపర్లాడుతున్నారు.
         ప్రభూ ఇది సంధి యుగం.గతంలో పండితులుండేవారు.వారికి శాస్ర్తాద్యయనం తప్ప మరో పని ఉండేది కాదు.వారి అవసరాలు సమాజం చూసుకునేది.వారు నిస్వార్దం గా తమ పాండిత్యాన్ని సామాజిక సందిగ్దాలు సంశయాలు తీర్చటంలో వినియోగించేవారు.అపుడు ఎన్ని రాజ్యాలున్నా ఆసేతు హిమాచలం దాకా భారతదేశంలో ఓకటే వేదాలు ఓకటే ఉపనిషత్తులు ఓకటే స్ర్ముతి చలామనిలో ఉండేవి.కాని ఇపుడు పండితులనే వారికి పాండిత్యాన్ని సంపాదించుకునే తీరిక లేదు.పైగా ఎవరికి తోచినట్టు వారు తమ స్వార్దాలకు లోబడి ప్రాంతీయంగా శాస్ర్తాలలో సమాజ  హితంకాని శ్లోకాలను నిక్షిప్తం చేయటం వాటిని అసలు శాస్త్రాలుగా ప్రచారం చేసుకుని పబ్బం గడుపుతూ దైవద్రోహానికి సమాజంలో వివక్షకు అంత:కలహాలకు కారణమవుతున్నారు.అందుకే దేశమంతా ఓకే స్ర్ముతి ఉన్నకాలం పోయి రాజ్యానికో స్ర్ముతి ప్రాంతానికో పురాణం వెలుస్తున్నాయి.దానివల్ల నియమాల స్వరూపం మారుతోంది.నిజం మరుగున పడుతోంది..
శాస్ర్తాలలోని అసలు విషయము మరుగున పడి సంకుచితపు సంకెళ్లు మన సామాజిక నియమాల చుట్టూ బిగుసుకుంటున్నాయి.సమాజ హితం కోసం మనబుుషులు విశాల హ్రుదయంతో అందించిన వేదాలు స్ర్ముతులను ఈవిదమైన అమాయకుల శిక్షలకు సాకుగా చూపించటం దారుణం..చాతుర్వర్ణాలు స్వభావ జనితములని నిజమైన పండితుడు అయినవాడు సాటి పండితుని ,పనికిరాని చండాలుని సమద్రుష్టితో చూడాలని గీత లో భగవానుడే స్వయం గా చెప్పినా తెలుసుకోలేక పోవటం మన అజ్ఞానం...అని తన వాదన ముగించాడు.
      ఇక ఎవరూ అడ్డు మాట్లాడకపోవటం తో రాజు హాయిగా ఊపిరి పీల్చుకుని శ్వేతభట్టుని అతని భార్యని హాయిగా సంసారం చేసుకోమని పంపించేశాడు.
  తరువాత రాజు ఛండేశ్వర్ ను తన ఆంతరంగిక మందిరానికి పిలిచి సమాజహితం కోసం మన శాస్ర్తాలకు నిజం రూపం తెలుపుతూ వాఖ్యానం రాయమని కోరాడు..
 రాజు కోరిక ప్రకారం ఛండీశ్వర్ చాలా గ్రందాలను రచించాడు.వాటిలో "స్ర్ముతి రత్నాకర"అగ్రస్థానం వహిస్తుంది.ఆయన రాసిన మిగితా గ్రందాలు క్రుత్యరత్నాకర,గ్రుహస్థ రత్నాకర,దానరత్నాకర,శుద్దిరత్నాకర....మోదలైనవి.
.................
ఈయన క్రుషి ఎంతోకాలం మిగలనివ్వలేదు తురకలు..మంచి మంచి పండితులను ఊచకోత కోసి విచ్చలవిడిగా మత మార్పిడులు జరిపారు...అందువల్ల సగం తెలిసిన ఙ్ఞానంతో సందుకోకరు పండితులమని చెప్పుకుంటూ తెలిసీతెలియక గర్వంతో అప్పటికి ఉన్న కులాలను రెట్టింపు పెంచేసి,పనికిరాని కఠిన నియమాలు పెడుతూ ఓకవిదంగా ముస్లింమత మార్పడిలకు కారకులయ్యారు.బలవంతంగా మతం మార్చబడినవారిని వీరు తిరిగి హిందువులలోకి కలుపుకునేవారుకాదు...అలా ముస్లంల సంఖ్య పెంచేశారు..ఈ విధంగా మన ఙ్ఞాన గ్రందాలు అర్దఙ్ఞానుల చేతిలలో పడి దేశవినాశనానికి కారణమయ్యాయి..అక్కడక్కడ కోంతమంది నిజమైన ఙ్ఞానులు పుట్టి సమాజాన్ని సరిచేసి మన గ్రందాల గోప్పదనం తెలియచేసినా,..తరువాత వచ్చిన బ్రిటీష్ క్రిష్టియన్ బంటు మాక్స్ ముల్లర్ వంటి ప్రబుద్దుల వంకర రాతల కారణంగా అవి పూర్తి విలువకోల్పోబోతున్నాయి..ఇప్పటికైనా మన గ్రందాల గోప్పతనం గుర్తించి మనం మోల్కోకపోతే భరతమాత మనతరాన్ని హర్షించదు.

Friday, 13 October 2017

కాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన "మార్టీన"  అనే ఆవిడ హిందూధర్మం పై...
వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ప్రతి హిందువు తెలుసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది.

నేను ఒక కాథలిక్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించాను .
నాకు చిన్నప్పటినుండి మా చర్చి ఫాస్టర్.. యేసు ఒక్కడే దేవుడు అని చెప్తుండే వాడు.
ఐతే నాకు అంతగా అతని మాటలు నమ్మబుద్ధి కాలేదు.

నేను పాత, కొత్త నిబంధనలు చదివి .. మా పాస్టర్ ని అడిగాను.
భూమి ఆకారం గురించి బైబిల్ ఎందుకు తప్పుగా చెప్పింది?
తండ్రితో కూతురు కామాలీలల్లో పాల్గోవచ్చు అని ఉంది .. ఇంతకు బైబిల్ ముఖ్య ఉద్దేశం ఏమిటి?
ఒక గ్రంధంలోఇలాంటి వాటికి ఎలా స్థానం కల్పించారు?.. అని ప్రశ్నించేసరికి....
ఆ చర్చి సభ్యులు నన్ను ఇంకోసారి చర్చికి రావొద్దు! అని నన్ను అక్కడ నుండి తరిమేసారు.
అప్పుడు వయస్సు13 ఏళ్ళు.

ఆ తరువాత నాకు ముస్లిం స్నేహితులతో పరిచయం అయింది.
ఒకసారి మసీద్ కు వెళ్ళగా... అక్కడ నాకు చేదు అనుభవం ఎదురయ్యింది.
నేను ముందు హిజాబ్ వేసుకోవాలని ఆర్డర్ ఇచ్చారు.
హిజాబ్ వేసుకొని ఇంటికి వెళ్లి అక్కడే నమాజ్ చేయాలనీ...
"ఓ అల్లాహ్ నేను పాపిని, నేను ఏ జన్మలోనో ఎంతో పాపం చేశాను...
అందుకు నన్ను మహిళగా సృష్టించావు" అంటూ వేడుకోవాలని చెప్పారు.
ఆమాట విని నాకు కన్నీళ్ళు ఆగలేదు.
అల్లాహ్ ఎవ్వరు?  అని ...నేను అడిగాను
అల్లాహ్ దైవం అని...అల్లాహ్ కి రూపం లేదు అని ...వాళ్ళు చెప్పారు .
రూపం లేని దైవానికి మగాడు అనే ఎలా ముద్ర వేసారు? అని అని అడిగాను.
"మొహమద్ ప్రవక్త చెప్పారు" అని మాత్రమే  వాళ్ళు బదులిచ్చారు.అప్పుడే అర్ధం అయ్యింది.
ఇస్లాంలో మహిళలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి అని...
ఇస్లాంలో మహిళలను కేవలం కామావాంచ తీర్చుకోడానికి ఒక బొమ్మగా ఉపయోగిస్తారు అని...
మహిళలకు మసీద్ లోపలికి ప్రవేశం కూడా ఉండదు అని తెలిసింది.
మహిళను ఎంత అపవిత్రంగా చూస్తున్నారో తెలుసుకొని... నాలో నేను  కుమిలిపోయాను.

 అలాకుమిలిపోతూ ఏడుస్తున్న తరుణంలో .. ఒక వృద్ద మహిళ నా చెంతకు వచ్చి ..
పవిత్రమైన భావాలకు ఆధ్యాత్మిక నిలయం "భారతదేశం" అనీ.... కొన్ని ఆధారాలతో నాకు మొత్తం వివరించి చెప్పారు .
ఐతే నేను ఆమె మాటకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు .
ఎందుకంటే ఇంతకుముందు వెళ్ళిన  మతాలలో మహిళలకు విలువ లేదు అని తెలుసుకున్నాను.
భారతదేశంలోమహిళల పరిస్దితి ఇంకా దారుణంగా ఉంటుంది అని పాస్టర్ చెప్పిన వాఖ్యలు గుర్తొచ్చి ...
ఇంకే హిందుత్వం వైపు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను.

ఒక రోజు నా స్నేహితురాలు భారతదేశం నుండి తీసుకు వచ్చిన గంగ నీళ్ళు ఇచ్చి నన్ను త్రాగామని చెప్పింది.
ఎందుకో కొంచెం అయిష్టంగానే తాగాను.  నేను నా స్నేహితురాలిని అడిగా "గంగ ఎవ్వరు? ఏమిటి ఈ కద?" అని.
"గంగ అంటే నీరు, భారతీయులు మంచి నీటిలో దైవాన్ని  చూస్తారు. గంగానదిని 'గంగాదేవి' అని దేవతగా పూజిస్తారు అని ఆమె చెప్పింది.
  " నేను ఆశ్చర్యంగా అడిగా "గంగ మహిళ కదా, మరి మహిళ మీద అక్కడ వివక్ష చూపరా?" అని అడిగాను.
అప్పుడు ఆమె చెప్పింది.... "వాస్తవానికి భారతీయులు ఆరాధించేది.... భూమాత, వేదమాత, గోమాత, ధన మాత, ధన్యమత,గంగామాత  " అని.
 ఇలా భారతీయులు ప్రతి మంచి విషయాలలో కూడా మహిళలకే ప్రథమస్థానం ఇస్తారు.  ప్రతి ప్రాణిలోనూ మంచిని చూస్తారు.
 మనం అక్కడికి  వెళితే తప్ప.. మనకు భారతీయుత యొక్క పవిత్రత తెలియదు అని ఆమె చెబుతుంటే ఆశ్ఛర్యపోయాను.

అప్పుడు నేను అడిగా ..."మరి అంత మంచి హిందుత్వం కదా, మరి నేడు ప్రపంచంలో అత్యధిక శాతం క్రిస్టియన్ మతం, ఇస్లాం మతం ఎందుకు తీసుకుంటున్నారు?
ఆమె  దానికి చాల చక్కగా జవాబు ఇచ్చారు "స్వర్గం చాల చిన్నది, నరకం చాల పెద్దది. నరకం వైపు వెళ్ళడానికి అన్ని తలుపులు తెరిచి ఉంటాయి.
కానీ స్వర్గం వైపు పయనించాలంటే ....ఒక చిన్న ఇరుకు సందులో నుండి ప్రయాణించాలి" అనే సమాధానం నా గుండె అంతర్భాగానికి తాకింది .

ఆ మరుసటి నెలలో నేను భారతదేశానికి ఎలాగైనా వెళ్లి అక్కడ వాస్తవ రూపం తెలుసుకోవాలి అని అనుకున్నాను.
ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత తెలుసుకున్నాను....
"ప్రపంచానికి తల్లీ,తండ్రి లాంటిది ఈ వేద భూమి భారతదేశం .
ఇక్కడ ఉన్న ప్రేమ ప్రపంచ మొత్తం ఎక్కడ వెతికినా దొరకవు.
నాకు ఇంకో జన్మంటూ ఉంటే ...ఈ వేద భూమిలోఒక మహిళగా  పుట్టాలని ఉంది" అంటూ..
స్థానికి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మార్టీన చెప్పింది. - (Hindu Jwsla నుండి)

హిందూధర్మం పునాది చాలా బలమైంది.
మద్యలో కొన్ని లోపాలు చేరాయని మొత్తం హిందూధర్మాన్ని అగౌరపరచడం అవివేకం.
దయచేసి భారతీయ సంస్కృతిని, మన ధర్మాన్ని, మన సంప్రదాయాలను... జాగ్రత్తగా కాపాడుకుందాము.......
🌜🌛🌜🌛🌜🌛🌜🌛🌜🌛

🌕 *శరత్ పౌర్ణమి* 🌕

ఆశ్వీయుజ పూర్ణిమకే ‘శరత్ పూర్ణిమ’ అని పేరు. అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. సాధారణంగా అందరూ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమనాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువల్ల ఈరోజు చంద్రుడిని పూజిస్తే ఎంతో పుణ్యం.
ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఈ కిరణాలు శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి.

 అందువల్ల చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెబుతోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఓషధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మర్నాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి.

శ్రీకృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో ‘ రాసపూర్ణిమ’ అంటారు. శ్రీకృష్ణుడు ఈరోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్ణుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలో పరుగెత్తగా, కొన్నివేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేశారట. ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది.

 కోజాగరి పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.
ఈ పౌర్ణమి కి ముందుగా వచ్చే ఆదివారం రోజున ధనఫలా వ్రతం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఈనాడు గోశాల యందుకానీ తులసి వనము యందుగానీ సూర్యనారాయణ వ్రతమును ఆచరించాలి.అలా చేస్తే సమస్త దానాలు చేసిన ఫలము లభిస్తుంది. పౌర్నమినాడే    ఆదివారం వస్తే ఆరోజునే ఈవ్రతాన్ని ఆచరించాలి.

పౌర్ణమి రోజున లక్ష్మి   దేవిని ఇంద్రుడిని పూజించాలి.
కుదిరితే రాత్రి జాగరణం   చేయాలి.   లక్ష్మిని పూజించి రాత్రి జాగరణం చేసినవారికి అభీష్టములు సిద్ధిస్తాయని లింగపురాణం చెబుతుంది.

 జాగరణ సమయంలో పాచికలు ఆడాలని అలా చేస్తే లక్ష్మి అనుగ్రహం   ఉంటుంది అని శాస్త్ర వచనం. దీనిని అక్ష క్రీడా అంటారు.

*🦑ఓం...నమో... వేంకటేశాయ*🦑
🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
      *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷*

వాల్మీకి జయంతి శుభాకాంక్షలు
ఆస్వయుజ పూర్ణిమ – వాల్మీకి జయంతి

సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కధ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.

రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది. వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కధకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కధ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాధలున్నాయి. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.

చరిత్ర :
త్రేతాయుగములో గంగానదీ తీరములో నైమికారణ్యములో అనేకమంది మునులు ఆశ్రమములు నిర్మించుకొని నియమ నిష్టలతో తపస్సు చేస్తూ ఉండేవారు. మునీశ్వరులందరూ బ్రాహ్మణ కుటుంబాలకు చెందివారే. అందులో ఒక ముని పేరు ప్రచస్థాముని .. .. ఇతనికి ఒకకుమారుడు ... పేరు " రత్నాకరుడు " ఒకరోజూ రత్నాకరుడు ఆడుకుంటూ అడవిలో దారితప్పి ఎటుపోవాలో తెలియ భయము ఏడుస్తూ ఉన్న సమయాన ఆ దారినిపోయిన ఒక వేటగాడు ... ఈ పిల్లవాడిని ఓదార్చి తనవెంట తన నివశిస్తున్న గుడెసె తీసుకు పోయి , తనకు పిల్లలు లేనందున తన కొడుకుగా పెంచుకోసాగెను. ప్రచస్ఠా ముని తన భార్యతోకూడి కుమారుని కొరకు వెదికి దొరక పోయేసరికి , ఏ క్రూరజంతువు తినిఉంటుందని భావించి పుత్రశోఖం తో వెనుదిరిగి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇక్కడ బోయకుటుంబానికి చెందిన వేటగాడు , అతని భార్య తమ సొంత కొడుకు గానే రత్నాకరుడు ని పెంచి పెద్దచేసారు. విలువి్ద్యలో మంచి ప్రావీణ్యము , వేట లో నైపుణ్యము సంపాదించిన రత్నాకరుడు మంచి తెలివైనవాడు . తన వేట నైపుణ్యము తో ఆ అడవి లోని పక్షులకు , జంతువులకు యముడుగా తయారయ్యాడు . యవ్వనము వచ్చిన రత్నాకరునికి బోయ తల్లిదండ్రులు వారి వంశములోని అమ్మాయిని చూసి పెళ్ళిచేసారు. కొంతకాలానికి ముగ్గురు పిల్లతో రత్నాకరుడి కుటుంబము పెద్దది కావడము వలన తన సంపాదన పెంచుకొనేనిమిత్తము దారిదోపిడి , దొంగతనము లను వృత్తిగా తీసుకొని అవసరమైన చోట బాటసారులను చంపి ధనాన్నిదోచుకుని తన కుటుంబము హాయిగా బ్రతికేందుకు పాటుపడేవాడు .

ఒకరోజు అడవి దారిలో ఒకచోట కూర్చోని బాటసారులకోసము పొంచి ఉన్న సమయాన ఆ దారిన " నారద మహర్శి " రావడము జరిగింది. నారద ముని సర్వసాదారణ మానవరూపలో ఉన్నందున రత్నాకరుడు దోచుకునే ప్రయత్నము చేయగా ... తన దగ్గర వీణా , రుద్రాక్షలు , కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవని తెలిపినా ... వినక చంపివేయదును అని భయపెట్టసాగెను. అప్పుడు ఓ బోయవాడా ... దొంగతనము , దోపిడీలు, ఇతరులను హించించి హత్యచేయడము పాపము అని హితబోద పలికినా నమ్మలేదు . " నీవు ఇన్ని పాపకార్యములు ఎవరికోసము చేయుచున్నావని అడుగగా" ... తన కుటుంబపోషనకొరకై తెలిసిన విద్య ఇది ఒక్కటే ... పాప పుణ్యాలు నాకు తెలియవు . అప్పుడు నారదముని ఆ బోయవానికి జ్ఞానోదయము కలిగించే ఉపాయము ఆలోచించి .. " ఓ బోయవాడా నీవు చేయు ఈ పాపాలు నీ కుటుంబ సబ్యులు ఎవరైనా పంచుకుంటారేమో అడిగి తెలుగుకోమని తనతో నారదముని ఆ బోయ ఇంటికివెళ్ళి .. పాపాలు పంచుకుంటారేమో అడుగగా తల్లి దండ్రులు గాని , భార్యా బిడ్డలు గాని అందుకు సమ్మతించగపోగా ... కుటుంబపోషణ ఇంటి యజమాని బాధ్యత అని పాపమో , పుణ్యమో అది తనవరకే గాని , తీసుకున్నా వీలు పడదని , పాప పుణ్యాలు ఒకరినుంది ఇంకొరికి ఇవ్వనూలేము , తీసుకోనూలేము అని వారి నిస్సహాయతను తెలియజేసిరి.
🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
  *ॐ{శివ కింకరుడు దగ్గొలుమునేంద్ర }ॐ*🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
హిందుత్వం శూద్రులకు వేదం నేర్పదని తప్పుడు కూతలు కూస్తూ మతమార్పిడీ మాఫియా పంజా విసురుతున్న నేపధ్యంలో వేదం నేర్చుకోవటానికి మనం ఎలా సిద్దమవ్వాలో తెలుసుకుందాం...పుట్టుకతో అందరూ శూద్రులే, ఇది వేదవాక్,ఆయాశూద్రుడే ఉపనయనం చేసుకొని,వేదం అభ్యసించాక వాడు బ్రాహ్మణుడు అవుతాడు...ఇందుకు నాటినుండి నేటి వరకూ అనేక ఉదాహరణలు ఉన్నాయ్...మోదీ గారు b c కానీ ఆయన సంధ్యావందనం చేస్తారు,శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానందగారు కూడా బ్రేహ్మిన్ కాదు,శ్రీ శ్రీ శ్రీ సుందరచెయ్ తన్య  b c వీళ్ళే కాదు చాలామంది శూద్రులు వేదం చదివి బ్రాహ్మణ అయ్యారు.ఇవి నేటి ఉదాహరణలు మాత్రమే...ఆనాడు కాలానుగమణంలో బ్రాహ్మణత్వం పొందిన వారి వంశీకులే వేదపఠనానికి ఎంతో త్యాగంచేసి  సిద్దమయ్యారు గనుకే బ్రాహ్మణులే వేదపఠనం చేసేవారు..శూద్రులనుండి వచ్చిన వారి వారసులు కూడా నిష్ఠ కలిగిన వారు అన్నితరాలలో ఉన్నారు..అందుకు నేటి ఉదాహరణలు పైన చెప్పుకున్నాం....హైదరాబాద్ లోని  వేదపాఠశాల అన్ని కులాలకు వేదం నేర్పి బ్రాహ్మణులను చేసేది..అయితే కొన్ని రోజులకు బ్రాహ్మణ కులంకాని కులాలవారు వారి పిల్లలను మధ్యలో ఆపేసి తీసుకెళ్ళేవారు..మరికొందరు వేదాద్యయణం పూర్తయ్యాక కూడా పౌరోహిత్యం బ్రాహ్మణ జీవనం నచ్చక వదిలేశారు...అన్నివదిలేసి ఓ 25 సంవత్సరాలు కేటాయించగలగితే మీరు బ్రాహ్మణులే...మరి సిద్దమా?అన్నికులాలకు వేదం నేర్పే పాఠశాలలు ఇప్పుడు చాలానే ఉన్నాయ్...అయితే బ్రాహ్మణ వారుసులు తప్ప మిగితాకులాల వారి వారసులం చేయగలుగుతున్నామా?చేయలేనపుడు బ్రాహ్మణులపై నిందలెందుకు?వేదం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేయండి...

అసలు ఈ సాంకేతిక విప్లవం లేని రోజుల్లో పుస్తకాలు లేదా గ్రంధాలు కూడా లేని కాలం నుండి మన వేదం పదిలంగా గురు శిష్య పరంపర ద్వారా కొన్ని కోట్ల తరాలగా సాగుతూ వస్తోంది. అసలు తప్పులు లేకుండా ఎక్కడా కూడా ఒక ఒట్టు, పొల్లు పోకుండా ఎలా వస్తున్నది అని నిరుటి శాస్త్రజ్ఞులు పరిశోధించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన పూర్వులు ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధను చేసేవారు. ప్రతి పదం మెదడులో నిక్షిప్తమయి నోటి ద్వారా ఒకరినుండి మరొకరికి నేర్పబడుతోంది. 
వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి  వర్ణం, స్వరం, మాత్ర(ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును.  ఇది నమ్మబుద్ధి కావడం లేదా.

ఒక ఉదాహరణ తీసుకుని ఆలోచిద్దాం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకుని చర్చించుకుందాం
“ I never said she stole my money” - నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు
ఒక వేళ నేను ఒక  పదం మీద ఒత్తి పలికితే ఆ పదానికి వున్న అర్ధం మొత్తం మారిపోతుంది. ఈ పైన చెప్పిన వాక్యంలో ఒకొక్క పదం మీద బలం పెట్టి చూద్దాం

1. “ I” never said she stole my money – నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు. ( అంటే ఇంకెవరో అన్నారు )

2.  I “never” said she stole my money – నేను “ఎప్పుడూ” ఆ ఆమ్మాయి డబ్బు తీసింది అనలేదు ( ఇది సూటిగా అర్ధమయ్యే వాడుక )

3. I never “said” she stole my money – నేనెప్పుడూ ఆ అమ్మాయి డబ్బు తీసింది “అనలేదు” ( అనలేదు కానీ నాకు అనుమానం వుంది, లేదా నమ్మకం వుంది)

4. I never said “she” stole my money – ఆ అమ్మాయి తీసిందని నేను  అనలేదు ( మరెవ్వరో తీసి వుండ వచ్చును )

5. I never said she “stole” my money – ఆ అమ్మాయి దొంగాలించింది అని నేను అనలేదు ( మామూలుగా తీసుకుని ఉండవచ్చును, చేబదులు లేక మరో రకంగా)

6. I never said she stole “my” money – ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు ( కానీ పక్క వాడి డబ్బు దొంగలించి ఉండవచ్చును, లేక ఆ డబ్బు నాది కాక పోవచ్చును)

7. I never said she stole my “money” – ఆ అమ్మాయి నా “డబ్బు” దొంగాలించలేదు ( కానీ మరోకటేదో దొంగలించి ఉండవచ్చు)

చూసారా ఒకొక్క పదం మీద ఒత్తి పలకడం వలన ఒకొక్క అర్ధం మామూలు మన మాటల్లోనే వస్తున్నది. వేద ప్రోక్తమైన మంత్రాలలో ఉచ్చారణ, స్వర, అనుస్వరం ఎంత ప్రాముఖ్యమో మీకు ఈ పాటికి అర్ధమయి వుంటుంది.

ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జత, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు.

ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.

క్రమ పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు.

జట లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో,

అదే ఘనంలో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు.

 దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాదబడుతుంది.
ఒక ఘనాపాఠీ కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితను నేర్వాలంటే 2000 పైగా పంచశతి( 1 పంచశతి = 50 పాదాలు  => 109,308 పాదాలు. ప్రతి పాదానికి రమారమి 3 పదాలు => 3,30,000 పదాలు, 1 ఘనం 13 సార్లు ఉచ్చరించడం => 4,290,000 ఉచ్చారణలు పైన చెప్పిన 6 మూల సూత్రాలతో  )  చెప్పుకోవాలి. ఇది గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలంటే రమారమి 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి వారు ఎంత త్యాగం చేసి శ్రద్ధతో నేర్చుకుంటే వారు ఘనాపాఠీలు అవుతారు. ఇంత క్లిష్టమైన మన సాంప్రదాయాన్ని కొందరు అయోగ్యులు పిలక బ్రాహ్మణులను, వాళ్ళేమి చేసేది, మేము చదివేస్తాము అని డాంబికాలు పలుకుతారు. ముందుగా ఒకరి పని వారిని చేయ్యనివ్వాలి. పక్కవారిని అగౌరవ పరచకూడదు. అందరం ఎవరి పనులు వారు చేసుకుంటూ సమాజోద్ధారణకు పాటు పడాలి. ఒకరి మీద ఒకరికి అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టిపోయారు తెల్లవాళ్ళు.  మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి. వేదం నిత్యం బ్రతికి వుండాలి. ఇది మన అందరి కర్తవ్యం.

Forwarded as received...
ఈమధ్య సామాజిక మాధ్యమాలలో ఒక దౌర్భాగ్యపు పోస్ట్ సంచరిస్తోంది. దాని సారాంశం ఏమిటంటే ఒక చిన్న పిల్ల తనకు రాముడిలాంటి సోదరుడు వద్దని, రావణుని లాంటి సోదరుడే అయితే తనని రక్షిస్తాడని, రామునిలా బాధలకు గురిచేయ్యడని సమర్ధిస్తూ, రాముని వలన సీత ఎన్నో ఇక్కట్లు పడిందని.

అసలు నిజంగా రావణుడు అంత గొప్ప సోదరుడా అని ఒకసారి ఆలోచిస్తే అతని గురించి మరిన్ని వివరాలు రామాయణం ఉత్తరకాండలో చెబుతారు.

దశగ్రీవుడు లంకనుండి తన అన్నగారైన కుబేరుని తరిమేసి ఆ రాజ్యానికి అభిషిక్తుడయ్యాక తన సోదరి వికృత రూపిణి అయిన శూర్పణఖను కాలక రాక్షసుని పుత్రుడయిన విద్యుజ్జిహ్వునికి ఇచ్చి వివాహం చేసాడు. కొన్నాళ్ళకు దశకంఠడు దేవతలను, మానవ రాజులను వశపరుచుంటూ వరుణుని వెతుక్కుంటూ పాతాళానికి వెళ్తూఉంటాడు. దారిలో నాగజాతివారిని ఓడించి మణిపురానికి వెళ్తాడు. అక్కడున్న దైత్యులతో సంధి చేసుకుని కాలకేయులను చంపి తన వారైన రాక్షసులను తింటున్న స్వంత బావమరిది అయిన శూర్పణఖభర్త విద్యుజ్జిహ్వుని తన కత్తితో ఖండించివేస్తాడు. విజయగర్వంతో లంకకు చేరగా శూర్పణఖ తన అన్నను రకరకాల మాటలు అంటుంది. సోదరి భర్తను కూడా కనికరించకుండా విధవను చేసినవాడు తన మానమర్యాదలను మంటగలిపి తన జీవితాన్ని నాశనం చేసావని, అలా చేసి తన బహిర్ప్రాణమైన భర్తను చంపి తనను కూడా మృతురాలిని చేసావు అని నిందిస్తుంది. అప్పుడు ఏవో మాటలు చెప్పి మాయచేసి ఊరడింపచేసి తన పినతల్లి కుమారుడైన ఖరుని సంరక్షణలో దండకారణ్యానికి 14000 మంది రాక్షసులతోడ పంపుతాడు. అక్కడ ఆ రక్కసి తనకు కావలసినది తింటూ, కావలసిన వారితో పొందు కోరుతూ జీవిస్తూ ఉంటుంది. ఇదండీ రావణుని సోదరిప్రేమ.

అదే సోదరి రాముని చూసి మోహించి లక్ష్మణునిచే ముక్కు చెవులు కోయించుకుని ఏడుస్తూ అన్నదగ్గరకు వచ్చి అతడిని నానా దుర్భాషలాడి, సీత మాత అందచందాలు పొగిడి ఆవిడకు నువ్వే భర్త అవ్వదగినవాడవు అని సీతమీద మోహం ప్రజ్వలింపచేస్తుంది. అదే రావణుడు సీతను అపహరించడానికి నిశ్చయించుకున్నాడు. పరదారాపహరణం ధర్మం కాదని తెలిసి కూడా వెళ్లి వాడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. మనం పిల్లలకు నేర్పవలసింది ధర్మం, న్యాయం, సత్యం లాంటి మంచి లక్షణాలు. కానీ అన్ని రకాలుగా భ్రష్టుపట్టిన ఒక రాక్షసుని తెంపరితనాన్ని గొప్పగా పొగుడుతూ అతడు చేసిన మహాపరాధాలను గొప్పగా ప్రచారం చేస్తున్న ఒక జాతికి చెందినా అధములకు, పూర్తిగా అవగాహన లేకుండా అటువంటి వాటిని పంచుతున్న మనకు తేడా ఏముంటుంది. రాముడంటే ధర్మం. రాముడంటే న్యాయం. రాముడంటే సత్యం. రాముడంటే ప్రేమ. రాముడంటే దయ. ఇటువంటి గొప్ప లక్షణాలు కనబడవా? రామో విగ్రహవాన్ ధర్మః. ఆయన ధర్మాన్ని ఆచరించి మనకు మార్గదర్శనం చేసాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. పడినా కూడా ధర్మాన్ని పట్టుకుంటే ఎలా విజయం లభిస్తుందో నిరూపించి ఆదర్శవంతుడు అయ్యాడు.  ఆయన ఏమి చేసినా ధర్మ పరిరక్షణ కోసమూ, లోకానికి ఒక సందేశం ఇవ్వడం కోసమూ తప్ప తనకోసం ఏమీ చెయ్యలేదు. ఆయనకూ రావణునికి పోలిక పెట్టడం అన్నది అసలు ఊహకు అందని విషయం. ఒకరు మూర్తీభవించిన దైవమైతే మరొకడు దిగజారుడుతనానికి, తెంపరితనానికి, మూర్ఖత్వానికి, స్వార్ధానికి, లౌల్యానికి ప్రతీక.

ఏదైనా సందేశం వచ్చినప్పుడు ఒక్కసారి మన ధర్మాన్ని గుర్తు చేసుకుని దానిలో చెప్పినది ఎంతవరకు నిజం, దానిలో చెప్పినది ధర్మమా? న్యాయమా అని ఆలోచించి మరొకరికి పంపండి, తప్ప అనాలోచితంగా పంపే ఇటువంటి సందేశాల వల్ల నిజం తెలియని ఎంతో మంది అదే నిజమని నమ్మి భ్రష్టులు అయిపోయే ప్రమాదం వుంది.  తస్మాత్ జాగ్రత్త !!!

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
ఉత్కృష్ట మార్గం :-
******************
ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది?' అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే దానికి పరమహంస ఇలా జవాబు చెప్పారు:
" నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి. "
నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైనవాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.
ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది. 'నా బాబువి కదూ, నా తల్లివి కదూ' అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమార తినిపిస్తుంది. కాని, ఆమెకు తెలుసు- ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.
తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.
అలాగే నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి. నీ మనసును మాత్రం ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.
బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలోపడి ఆ పరాత్పరుణ్ని పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది. సర్వసమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటంలేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలుచేసే విపత్తు పొంచి ఉంటుంది. ప్రాపంచిక వస్తువుల్ని పోగేసుకుంటున్నకొద్దీ వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది.
పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి. లేకపోతే దాని పాలు బంకలా వేళ్ళను పట్టుకుని వదలదు. అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో... ఆ తరవాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు. దైవానుగ్రహం లభించటానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి.
పాల నుంచి వెన్న దొరకదు. ముందు పాలనుకాచి పెరుగు తోడుపెట్టుకోవాలి. తొందరపడి దాన్ని కదిపితే పెరుగు తోడుకోదు. పాలుగానే ఉండిపోతుంది. చిక్కని పెరుగును చిలక్కొట్టిన తరవాతే వెన్న లభిస్తుంది. ప్రపంచం నీళ్ల లాంటిది. మనస్సు పాల లాంటిది. పాలను నీళ్ళల్లో పోస్తే అదంతా కలిసి ఏకమవుతుంది. వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది.
అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి. జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి. ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు.
ఈ స్థితికి చేరుకోగలిగేదే ఉత్కృష్ట మార్గం !!
👉(సేకరణ)
అతను ఒక విప్లవం, చైతన్యం ,పేరు ఖుడి రామ్ బోస్ 18 ఏళ్ళు 8 నెలల 8 రోజులు వయసులో బ్రిటీష్ వారు ఉరితీసిన అతి చిన్న స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు,అతను మరియు అతని మిత్రుడు ప్రఫుల్లల సర్కార్ సాయంతొ బాంబులతో గుర్రపు బండిపై వెళుతున్న బ్రిటీష్ అధికారి Dutch mejistrate Kingsford ని చంపారు , తరువాత అతను బ్రిటీష్ పోలీసులకు పట్టుబడ్డాడు. బీహార్లోని ముజఫర్ లో అనేక మంది భారతీయులను హతమార్చిన క్రూర అధికారి Kingsford పై ప్రతీకారం తీర్చుకున్నారు.అతన్ని చంపిన తరువాత, బోస్ పోలీసుల నుండి తప్పించుకోవడానికి రోజూ రాత్రి సమయంలో 25 మైళ్లు నడిచేవాడు,కొన్ని రోజులకు ఇప్పుడు VAINI సమీపంలో దొరికాడు, ప్రస్తుతం దీనిని ఖుడీరామ్ బోస్ స్టేషన్ గా పిలుస్తారు..

1889 లో జన్మించిన ఖుదిరామ్ బోస్ మిడ్నాపూర్ బెంగాల్ నుండి వచ్చారు. 15 ఏళ్ళ వయసులో అతను బ్రిటిష్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి అరబిందో ఘోష్ మరియు సోదరి నిమితీటాలనుంచి ప్రేరణ పొందాడు అతను విప్లవకారులతో చేరాడు మరియు 3 సంవత్సరాలలో చాలామంది బ్రిటీష్ వారిని బాంబుల తో చంపడానికి లక్ష్యంగా చేసుకుని చంపాడు, చివరికి ఏప్రిల్ 30,1908 న పట్టుబడ్డాడు అతను పట్టుకున్నప్పుడు అతను ముజఫర్పూర్ లో వీదులన్ని తిప్పారు, అలా తిప్పినపుడు ఆసలు విచారంగా లేడు పైగా సంతోషంగా ఉన్నాడు. అతను వందేమాతరం అంటూ నినాదాలనుచేస్తూ అరవటం మొదలు పెట్టాడు,అతని స్నేహితుడు ప్రఫుల్లా కూడా పట్టుబడ్డాడు , విప్లవ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరులుగా మారారు

బోస్ జైలులో ఉన్నపుడు ఎవరి పేరును బ్రిటీష్ అదికారులకు ఎంత వేదించినా చెప్పలేదు పైగా ఇతర విప్లవకారులను రక్షించడానికి వారు చేసిన పనులను తనపై వేసుకుని అందరికీ పడే శిక్ష ను తను సంతోషం గా స్వీకరించాడు ,అతనికి మరణశిక్ష విదించినపుడు సానుభూతి పరులను స్నేహితులను ఉత్సాహపరిచాడు,ఉరివేశే రోజున తన తాడును తానే చిరునవ్వు తో స్వయంగా మేడకు తగిలించుకున్నాడు ,ఈ మరణం భారతదేశంలో చాలా మంది యువతకు ప్రేరేపించాయి మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అగ్ని యుగం అని పిలవబడేి ఆ రోజులలో చాలామంది యువకులు వీరి త్యాగాలను చూసి ఈ ఉద్యమంలో చేరారు మరియు తమ జీవితాలను బలి చేశారు .ఆగష్టు 11, 1908 ఖుదిరామ్ బోస్ ను ఉరితీశారు..
*ఈ పోస్ట్ ని చూసిన  ప్రతి హిందూ కాళ్ళు 🙏🏻మ్రోక్కుతా చదవకుండా మాత్రం forward చేయకండి.*

*👉🏻నువ్వు హిందువువా ?*
*👉🏻హిందువు ఎలా అయ్యావు ?*
 *👉🏻ఏం చేస్తున్నావు...? నువ్వు ఎవరు...?*

*ఒక హిందువుని నువ్వు ఎలా హిందువువు అయ్యావు.  అసలు హిందూ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే, అతడు స్పష్టమైన కారణాన్ని ధైర్యంగా చెప్పుకోలేని ధోర్బాగ్య పరిస్థితి ఏర్పడింది.*

 *ఈ వైఫల్యమే గందరగోళానికి అయోమయానికి దారి తీసింది.*

*ఏదో ...   మనం హిందువులం, ఓ గురువు దగ్గర మంత్రం తీసేసుకున్నాం.  రోజూ గంటో, అరగంటో పూజ చేసుకుంటాం, అవకాశం కుదిరితే సాయంత్రం కొంత సేపు దీపం పెట్టుకుని, పారాయణ చేసుకుంటాం, ఖాళీ సమయం దొరికితే ఉపన్యాసాలు వింటాం, టీవీలో ప్రవచనాలు చూస్తాం, పండుగలోస్తే పిండివంటలు చేసుకుని తింటాం, అప్పుడప్పుడు తిరుపతి వెళతాం ... కాశీ కెళతామ్ ...*   *దగ్గరలో ఉన్న  దేవాలయాలను దర్శించుకుంటాం, ఇది చాలదా?   -అని అనుకునే వాళ్ళే ఇపుడు ఉన్నా ఈ హిందూ సమాజంలో ఏర్పడింది.* 
*ఇవన్నీ ధర్మంలో భాగమే అయినప్పటికీ, ఇదే ధర్మం అని అనుకోవడం వల్లనే అఖండమైన ధర్మానికి పరిధి ఏర్పడింది.*

*ధర్మం అంటే కేవలం పూజలు, పునస్కారాలేనా?*

*మంత్రాలు, హొమాలేనా?*

*గుళ్ళూ, గోపురాలేనా?*

*పండుగలు, తీర్థయాత్రలేనా?*

*అసలు ఇవన్నీ ఏమిటి?  ఈ ధర్మంలో ఇంకా తెలుసుకోదగ్గ అంశాలున్నాయా? లేవా?*

*అసలు హిందుత్వం ధర్మమా? మతమా? మతానికీ, ధర్మానికీ తేడా ఏమిటి?*
*ధర్మమే అయితే దీనిలోని గొప్పదనమేమిటి?*
*ఇదెప్పుడు పుట్టింది?*
*ఎవరు దీనికి కారకులు?*
*వీటన్నింటినీ తెలుసుకోవడం ప్రతి హిందువు కనీస ధర్మం, తప్పనిసరి కర్తవ్యం.*

*👉🏻ఓ వస్తువును కొంటే అది ఏ బ్రాండ్ ఏ కంపిని అని పుట్టుపూర్వోత్తరాలన్నీ అడిగి తెలుసుకొంటానాము కదా ,  ఓ స్థలం కొనుగోలు చేయాలంటే దానిపై ఆరా తీసి, దస్తావేజులన్నీ సరిగా ఉన్నదీ లేనిదీ న్యాయనిపుణులతో సంప్రదించి, అనేక కోణాలలో పరిశీలన చేస్తున్నాం  కదా.* 
 *అలాంటిది, మనం ఏ ధర్మంలో పుట్టి జీవిస్తున్నామో, ఆ ధర్మం గురించి గానీ, దాని పూర్వాపరాల గురించి గానీ ఎవరికైనా తెలుసుకోవాలన్న జ్ఞానం  కలిగిందా?* 
 *నమ్మకం ముసుగులో ఎవరో ఏదో చెబితే దానిని ఆచరిస్తూ పోవడమేనా?*

*వెలుగునివ్వడం ఒక్కతే దీపం పరమార్థం కాదు.  మరిన్ని దీపాలను వెలిగించడం కూడా. అలాగే, ధర్మాన్ని తనవరకే పరిమితం  చేసుకుని,ఎవరు ఎలా పోయినా నేను మాత్రం ధార్మికంగా ఉన్నానా! లేనా? అని సరిపెట్టుకుంటే సబబేనా.* 
*ఈ ధోరణి వల్లనే ధార్మికులు క్షీణిస్తున్నారు.  ధర్మం పట్ల కనీస అవగాహన కూడా అంతరించి పోతోంది.*

*మనం ఏ దేవుణ్ణి కొలుస్తున్నా, ఏ గురువును ఆశ్రయించి ఉన్నా, ముందుగా మనకు ధర్మం పట్ల అవగాహన కుదిరితే అటుపిమ్మట భావి తరాలకు ఈ అవగాహనను అందించే ప్రయత్నం చెయ్యగలం.*
   *ఇతరులు, అన్యమతస్థుల అడిగే ప్రశ్నలకు సమాధాన  చెప్పగలం.  వీటన్నింటినీ మించి మనం  ఆచరిస్తున్న ధర్మం పట్ల మనక్కూడా అవగాహన కలిగిన నాడే మనకు ఆత్మ స్థైర్యం కలుగుతుంది.*
*ఈ ధర్మం పట్ల నిష్ఠ కుదురుతుంది.  ఆసక్తీ పెరుగుతుంది.*

*గోబెల్స్ ప్రచార ఎత్తుగడలూ, మార్కెటింగ్ తంత్రాలు, డబ్బు బలంతో సత్యం, ధర్మం, మానవత్వాల మీద దురాక్రమణ సాగిస్తుంటే,  నిలువరించే శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేకుండా పోయింది.*
   *టీవీ, ఇంటర్నెట్, కిరాయి ప్రచారకుల సైన్యాల దాడితో వాటిల్లుతున్న ఉప్పెన లాంటి నష్టాన్ని చూస్తే ధర్మానికి గొడ్డలిపెట్టు కానుందని తెలుస్తోంది.*

 *ప్రపంచంలోని ఇతర దేశాలు కళ్ళు తెరవక ముందే భారతదేశం సుసంపన్నమై ఉంది.* 
*అందుకు మూలకారణం భగవంతుడు ఈ భూమి పైనే అవతరించి, విశ్వానికి కావలసిన దివ్య సందేశాన్నందించి, మార్గదర్శనం చేయడం.*
   *అలా భగవద్దమైందే ఈ ధర్మం.*
 *కోట్ల సంవత్సరాలకు పూర్వమే ధర్మం ఇక్కడ పరివ్యాప్తమై ఉంది.  ఇది ఏనాడు పుట్టిందో ఎవ్వరం తెలుపలేం. అందుకే, దీనిని సనాతన ధర్మమని అన్నారు.* 
*ఇదే ఆర్య ధర్మమని, ఆర్ష ధర్మమని, వేద ధర్మమని అనేక పేర్లతో వ్యవహారంలో నిలచింది.  ఋషుల కాలంలోనే దీనికి సనాతన హైందవ ధర్మమనే పేరు నిర్ణయమయింది.*
*ఇటీవలి కాలంలో పుట్టిన మతాలు ప్రపంచమంతటినీ తమ పరం చేసుకోవాలనే దురాలోచనతో, పవిత్రము, సనాతనము అయిన మన హిందూ ధర్మం మీద బురద జలుతున్నాయి.*
  *👉🏻మహర్షులు, శంకర వివేకానందుల వారసులమైన మనం విధర్మీయుల కుయుక్తులను అర్థం చేసుకోవాలి.* 
*వారు మన హిందూ శబ్దం మీద ఎన్నో, ఎన్నెన్నో అపవాదులు అల్లుతున్నారు.*
*హిందూ అనే పేరు పరాయి వాళ్ళు పెట్టిందని కొందరు, సింధు శబ్దాన్ని పలకడం చేతకాని పరదేశీయులు 'హిందూ' అని పలకడంతో, అదే మనకు స్థిరపడిపొయిందని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు.*

*ఇలా ఒకటా ...  రెండా !*
   *చాపకింద నీరులా తప్పుడు ప్రచారాలు ముమ్మరంగా సాగిపోతున్నాయి.*
*ఈ తప్పుడు ప్రచారాలను విజ్ఞులు కూడా తిప్పికొట్టలేక సతమతముతున్నారు.*
   *మరో పక్క నుండి మన సనాతన* *సంస్కృతినీ, అది బోధించే ఆచారాలనూ హేళన చేస్తున్నారు.*   *పదే పదే నోటికొచ్చినట్లు* *విమర్శిస్తూ, నిజాన్ని అబద్ధంగా, అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు.* 
*మన చరిత్రలను వక్రీకరించి, మన చారిత్రిక అంశాలపై మనకే అనుమానాలను రేకెత్తిస్తున్నారు.*

*ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసా ... ?*
*మన మీద మనకే అనుమానాలు* *పుట్టాలని! హిందువుకు తన చరిత్ర మీద తనకే అసహ్యం కలగాలని!* *హిందువు అనుకునేందుకు ప్రతి హిందువు సిగ్గుతో తలదించుకోవాలని!*
*ఇలా జరిగిననాడు ఈ దేశం నుంచి హిందూ ధర్మాన్ని సమూలంగా పీకి పారేయవచ్చుననే దురాలోచనతో కుట్ర పన్నుతున్నారు.*
*వంద రాళ్ళు విసిరితే, ఏదో ఒకటైనా లక్ష్యానికి తగిలి, అది రాలి పడుతుందనే వ్యూహంతో, హిందూ వ్యతిరేకులు ముందుకు సాగిపోతున్నారు.*
    *పదే... పదే ఈ హిందూ ధర్మం* *పై దుమ్మెత్తి పోస్తూ, విమర్శిస్తూంటే ఏదో ఓ రోజు హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయవచ్చుననే ఆశతో ముప్పేట దాడులను ప్రారంభించేశారు.*
*ఈ దాడిలో హిందూ సమాజం ఇప్పటికే చాలా దెబ్బతిని తీవ్రంగా నష్ట పోయింది.*

  *దీనిని ఇలాగే కొనసాగిస్తామా!*
                  *లేక*
 *వాటిని తిప్పి కొట్టి మన ధర్మాన్ని నిలబెట్టుకుందామ???*
*భగవద్గీత అంటే ఏమిటి?*

– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు  సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

*కాదు*
అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’*
 సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి

*☆భగవద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు’ అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే ‘భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్‌ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది – మనం దాని జోలికి పోవద్దు’ అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ.*

*☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్‌ కావాలి, కావాలి… అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు. అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్‌ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.*

*☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.*

*☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.*

*☆ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి. అతని సామర్థ్యం, ఫిట్‌నెస్‌ అన్నీ ఒకేలా ఉన్నప్పటికీ, ఒకరోజు విజయం సాధిస్తాడు, మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు, ఆ మర్నాడు మామూలైన ఆటతీరును ప్రదర్శిస్తాడు. ఎందుకలా? అదే మైండ్‌ చేసే మేజిక్‌. మైండ్‌ ప్రశాంతంగా ఉంటే, ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ప్రశాంతతను సాధించడమెలాగో భగవద్గీత చెబుతుంది. కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు. ‘నేను’ అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది. ఉదాహరణకు ‘కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను’ అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు అక్కడితో ఆగిపోతుంది. అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది, ఏకాగ్రతతో ఆడతాడు, అతణ్ని విజయం వరిస్తుంది. ‘నాకోసం కాదు’ అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.*

*☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?*

👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
👉-కర్తవ్యం గురించి చెబుతుంది.
👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
👉నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

*అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.*
 అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో.....
నీ రాత మార్చుకో.....
మీ....🙏

Monday, 9 October 2017

🏯🏤 *నాటి పాతాళ లోకమే నేటి అమెరికా* 🏢🏬
*పూర్తిగా చదివి తెలుసుకొండి!! పదిమందికి షేర్ చేసి వారికి తెలియజేయ్యండి*

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం. ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియగా పిలువబడుతోందని నడిచేదేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు. కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horseland) ( యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన #గంగోత్రి హిమానీనదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.

వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం మహాబలిభూమి అని, ఇప్పుడది #మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు. ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలుమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు.

అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలీ అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ #అమెరికా ఖండం ఉంది. (చిత్రంలో చూడవచ్చు) అక్కడి నుంచే వామన మూర్తి బలిచక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.

ఇంకో ఆశక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామలక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు. ఇంతకముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగ్రం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఒడిపోవడం, ఆ తర్వాత #ఆంజనేయస్వామి వారు పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామలక్ష్మణులను కాపాడుతారు.

రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు. మధ్య అమెరికా, #హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించే లోపే మరణించారు.

హిందువులకు మెక్సికన్లకు సంబంధం వున్నదా? అమెరికా అంటే పాతాళమా?
“సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ:” – అనగా #సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. దేవతలకు మన మానం ప్రకారం వారి పగలు ఆరు నెలలు, రాత్రి ఆరు నెలలు. వారి ఒక దినం మన ఒక సంవత్సరం. అలాగే మానవులకు పగలయినప్పుడు పాతాళంలో అది రాత్రి. (ఇప్పుడు మనకు పగలయితే వారికి రాత్రి అవుతుంది, సరిగ్గా 12 గంటలు ఆ పైనే మనకు వారికి సమయ వ్యత్యాసం) రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు 60వేల మంది కూడా ఎలా భూమిని వెదుకుతూ వెళ్ళారో, భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు. వారు అలా పాతాళంలో కపిల ముని ధ్యానభంగం చెయ్యడం, ఆయన ఆగ్రహం చవి చూసి భస్మమై పోవడం, వారి భస్మాల పైన భూమి నుండి గంగను అవతరింప చేసి పారించి పాతాళంలో వారి భస్మరాశులపై ప్రవహింప చేసి వారిని తరింపచేస్తాడు భగీరధుడు. మన భూమినుండి 50000 యోజనాల  దూరంలో పాతాళం వున్నట్టు చెబుతారు. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. #అహిరావణుని వృత్తాన్తంలో కూడా హనుమంతుడు పాతాళానికి ప్రయాణించి అక్కడ అతడిని మట్టు పెట్టి రామలక్ష్మణులను విడిపించినట్టు ఐతీహ్యం. అలాగ మరెన్నో కధలు భూ-పాతాళ రాకపోకల గురించి వున్నాయి. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, #oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.

ఒకానొకప్పుడు అంటే ఒక 400 సంవత్సరాల క్రితం వరకు అక్కడ వున్న తెగను దునుమాడి, వారిని హతమార్చి,  అక్కడ శిధిలాల నిర్మితమైన నవ శకం నేడు మనం చూస్తున్న శక్తివంతమైన దేశం అమెరకా. ఇత:పూర్వం నివశించేవారిని నేటివ్ ఇండియన్స్ అని, ఇండియన్ అమెరికన్ అని, నేడు కొత్తగా నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తున్నారు. వారు ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారు. ఇప్పటికీ #హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. చరిత్రలో మరొక ఐతీహ్యం కూడా చెప్పబడుతూ వున్నది. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. #Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార చాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలయిన చేతబడులు(sorcism ) నమ్ముతారు చేస్తారు. #ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం “the light of india” లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు ఆఖరికి మానవ బలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఇంచుమించి వారు పూజించే Quetzalcoatl ( పాలను మనం క్షీరం అని పిలుస్తాం, ఆంగ్లంలో milk అంటాం. అలాగే వారి పిలుపులో తేడా వున్నా వారి ఇతిహాసం మన కధనే చెబుతుంది.) . అలాగే అర్జున, పాతాళ యువరాణి ఉలుపివృత్తాంత౦ కూడా వారి వాంగ్మయంలో చిల్లి పెప్పర్ man గా కనబడుతుంది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలవుతుంది. ఇంచుమించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరిపోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్యవలసిన అవసరం వున్నది.

ఒకసారి నడిచే దేవుడు కంచి #పరమాచార్య వారు ఒక israel దేశస్తుడిని ఉద్దేశించి వారి మంత్రాలకు మన మంత్రాలకు వున్న సంబంధం వివరిస్తారు. వారు అన్నారు ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది. అప్పుడు సంస్కృతానికి పూర్వం వున్న దేవభాష గురించి చెబుతారు. అప్పుడు వారన్నారు మీకందరికీ తాళం కనబడుతోంది. కేవలం మా ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా వున్నాయి అని. ఎంత సత్యమో కదా !!!

Saturday, 7 October 2017

ఎవరిది ఎవరు కాపీ చేసినట్టు..??

Anu-Paramanu అని కశ్యప, మన భారతీయుడు చెప్పింది BCE 2600.
Atom-Molecules..అని చెప్పింది డాల్టన్, బ్రిటిష్.. ACE 1800.

పేర్లు వేరైనా భావం ఒక్కటే, అంటే మన వారు ఆ విషయాన్ని దాదాపుగా 2600+1800, 4400 సం. క్రితమే చెప్పినట్టు కదా.??

మన భారత విజ్ఞానం, వేదాలు,పురాణాలు  అంటే అవోక బూతులా, అప్పటి చరిత్ర కారులు భారతీయులని నమ్మించి మన గ్రంథాలను వక్రీకరించి మనకు అవే నిజమని నమ్మించి అసలు ప్రతులు బ్రిటిష్ వారు ఎత్తుకెళ్ళి ప్రంపంచ దేశాలను శాసిస్తున్నారు..
 ఇటువంటి ఎన్నో గ్రంథాలను నాశనం చేసుకొని వేరే దేశాలపై ఆదారపడవలసి వస్తుంది..

MARCH, 2014 - 12:06 APRILHOLLOWAY

The Indian Sage who developed Atomic Theory 2,600 years ago

(Read the article on one page)

John Dalton (1766 – 1844), an English chemist and physicist, is the man credited today with the development of atomic theory.  However, a theory of atoms was actually formulated2,500 years before Dalton by an Indian sage and philosopher, known as Acharya Kanad.

Acharya Kanad was born in 600 BC in Prabhas Kshetra (near Dwaraka) in Gujarat, India. His real name was Kashyap.

Kashyap was on a pilgrimage to Prayag when he saw thousands of pilgrims litter the streets with flowers and rice grains, which they offered at the temple. Kashyap, fascinated by small particles, began collecting the grains of rice. A crowd gathered around to see the strange man collecting grains from the street. Kashyap was asked why he was collecting the grains that even a beggar wouldn’t touch. He told them that individual grains in themselves may seem worthless, but a collection of some hundred grains make up a person's meal, the collection many meals would feed an entire family and ultimately the entire mankind was made of many families, thus even a single grain of rice was as important as all the valuable riches in this world. Since then, people began calling him ‘Kanad’, as ‘Kan’ in Sanskrit means ‘the smallest particle’.

Kanad pursued his fascination with the unseen world and with conceptualising the idea of the smallest particle. He began writing down his ideas and teaching them to others.  Thus, people began calling him ‘Acharya’ (‘the teacher’), hence the name Acharya Kanad (‘the teacher of small particles’)

Kanad’s conception of Anu (the atom)

Kanad was walking with food in his hand, breaking it into small pieces when he realised that he was unable to divide the food into any further parts, it was too small. From this moment, Kanad conceptualised the idea of a particle that could not be divided any further. He called that indivisible matter Parmanu, or anu (atom).

Acharya Kanad proposed that this indivisible matter could not be sensed through any human organ or seen by the naked eye, and that an inherent urge made one Parmanu combine with another.  When two Parmanu belonging to one class of substance combined, a dwinuka (binary molecule) was the result. This dwinuka had properties similar to the two parent Parmanu.

Kanad suggested that it was the different combinations of Parmanu which produced different types of substances. He also put forward the idea that atoms could be combined in various ways to produce chemical changes in presence of other factors such as heat. He gave blackening of earthen pot and ripening of fruit as examples of this phenomenon.

Acharya Kanad founded the Vaisheshika school of philosophy where he taught his ideas about the atom and the nature of the universe. He wrote a book on his research “Vaisheshik Darshan” and became known as “The Father of Atomic theory.”

In the West, atomism emerged in the 5th century BC with the ancient Greeks Leucippus and Democritus. Whether Indian culture influenced Greek or vice versa or whether both evolved independently is a matter of dispute.

Kanad is reporting to have said: ”Every object of creation is made of atoms which in turn connect with each other to form molecules.”  His theory of the atom was abstract and enmeshed in philosophy as they were based on logic and not on personal experience or experimentation. But in the words of A.L. Basham, the veteran Australian Indologist, "they were brilliant imaginative explanations of the physical structure of the world, and in a large measure, agreed with the discoveries of modern physics."

By April Holloway

References:

The Father of Atomic Theory: Acharya Kanad – Sanskaar Varg

Ancient India’s Contribution to Physics – United India

         

Section:

Artifacts

Ancient Technology

Tags: