Friday, 22 December 2017

భ్రుగు మహర్షి,భరద్వాజ మహర్షి మధ్య మొక్కలలో ప్రాణముందన్న విషయముపై జరిగిన సంవాదము

మనం మన పుస్తకాలలో 'వృక్ష శాస్త్ర(Botany) పితామహునిగా గ్రీకు దేశ తత్వవేత్త,వృక్ష శాస్త్రవేత్త అయిన 'థియోఫ్రాస్టస్' అని చదువుకున్నాము.

కానీ 'మహా భారతం లోని శాంతి పర్వం 184 వ అధ్యాయం' లో ఉన్న భ్రుగు మహర్షి,భరద్వాజ మహర్షి మధ్య మొక్కలలో ప్రాణముందన్న విషయముపై జరిగిన సంవాదము మాత్రం మన సిలబస్ లలో ఉండదు.ఇంకా ఒక ఆనందించదగ్గ విషయమేమిటంటే 'ఆధునిక కాలములో మొక్కలలో ప్రాణముందని నిరూపించిన "జగదీశ్ చంద్రబోసు' కు మాత్రం 'నోబెల్' బహుమతినివ్వటం,ఇది పురస్కరించుకొని మన సిలబస్ లలో చేర్చటo.

చాలామంది మొక్కలు నిర్జీవ పదార్ధాలని,అవి మనుష్యుల లాగ జ్ఞానముతో కూడిన కర్మలు చేయలేవని అనుకుంటూ ఉంటారు.ఇదిగో మహాభారతములో ఉన్న ఈ సంభాషణ చూసి మీరే నిర్ణయించండి.

మహా భారతం లోని శాంతి పర్వం 184 వ అధ్యాయం' లో భ్రుగు,భరద్వాజ మహర్షుల సంవాదముంది.ఇందులో "భరద్వాజుడిలా అడుగుతాడు.:

"వృక్షములు చూడవు,వినవు,రస గంథాలను అనుభవించవు,స్పర్శ లేదు కదా అయినా అవి కూడా "పాంచభౌతిక చేతన పదార్తములే " అని ఎందుకంటారో సెలవివ్వుడి అనగా..

భ్రుగు మహర్షి ఇలా సమాధానమిచ్చాడు.

"ఓ భరద్వాజ ! వృక్షములెంత గట్టిగ కనిపించినను వానిలోనూ ఆకాశమున్నది.దీనివలననే నిత్యం పుష్ప ఫలముల ఉత్పత్తి సాధ్యమగుచున్నది. - 10

వృక్షములలో వేడి ఉంటుంది.దాని వలననే దాని ఆకులు,బెరళ్ళు,పూలు,కాయలు,పళ్ళు వాడిపోతూ ఉంటాయి.రాలిపోతూ ఉంటాయి.దీనివలన మొక్కలలో స్పర్శ జ్ఞానముందని తెలుస్తున్నది. - 11

వాయువు,అగ్ని,విద్యుత్ యొక్క ఫెళ ఫెళ శబ్దాలకు చెట్లనుండి ఆకులు,పూలు,పళ్ళు రాలి పడుతాయి.
దీనివలన చెట్లకు వినికిడి జ్ఞానం ఉన్నట్లు ఋజువగుచున్నది.- 12

తీగ చెట్టును నలువైపులా చుట్టుకొని దాని శీర్షము పైకి ప్రాకిపోతుంది.చూడకుండానే ఎవరికైనా తాను ముందుకెళ్ళే మార్గం ఎలా తెలుస్తుంది? దీనివలన మొక్కలకు చూపుడు జ్ఞానం కూడా ఉందని తెలియుచున్నది. -13

సువాసన - దుర్వాసనల వలన ,అట్లే అనేక రకాల పొగ వాసనల వలన,అగరు వత్తుల వాసన వలన వృక్షములు రోగరహితములగుచున్నవి మరియు పుష్పించుచున్నవి.దీనివలన వృక్షాలు వాసన చూస్తాయని కూడా తెలియుచున్నది. - 14

వృక్షములు తమ వేళ్ళ తో నీరు త్రాగుతాయి.చెట్టుకు ఏదేని రోగము వస్తే నీళ్ళలో మందు కలిపి చికిత్స చేసే పద్ధతి ఉంది.దీనివలన వృక్షాలకు రుచికి సంభందించిన జ్ఞానం ఉందని తెలియుచున్నది.-15

మనం కమలపు తూడు (కాండం) నోటిలో పెట్టుకొని నీటిని పీల్చుకోగలుగుతాము.అదే విధముగా వృక్షములు గాలి ఒత్తిడి వలన వృక్షములు వేళ్ళ ద్వారా నీటిని పైకి పీల్చుకుంటున్నాయి. -16

వృక్షము తెగిన చోట క్రొత్త పిలక పుడుతుంది.అవి సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి కనుక వృక్షములలో ప్రాణమున్నది.అవి అచేతనాలు కావు.- 17

వృక్షములు వేళ్ళ ద్వారా పీల్చిన నీటిని చెట్టులోని వాయువు,అగ్ని ఉడికిస్తాయి.ఆహారం పరిపక్వమైనప్పుడు వృక్షము నిగనిగలాడుతూ ఉంటుంది. -18

ఇలా భ్రుగు మహర్షి అనేక ఋజువులు చూపిస్తూ నిజమైన 'వృక్ష పితామహుడు' అని అనిపించుకున్నారు
Copied from Ragi Shivanand

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

*భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌*

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

డిసెంబర్‌ 22 జాతీయ గణిత దినోత్సవ ప్రత్యేకం

శ్రీనివాస రామానుజన్‌..

భారతదేశ ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు.

నిజానికి గణితశాస్త్ర చరిత్ర భారతదేశంలో వేదకాలం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రాచీన భారతీయులు గణితంలో ఎన్నో విషయాలు కనుగొన్నారు. సంఖ్యలను కనుగొనడంలో చాల కృషి చేశారు. దశాంశ పద్ధతిని గుర్తించిన మొదటివారు భారతీయులే.

భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలంలో స్వర్ణయుగం నుండి భాస్కరాచార్యుని వరకు ఆప్రతిహతంగా సాగింది. భాస్కరాచార్యుని తరువాతి కాలంలో బహుళ విదేశీ దండయాత్రల వలన కాబోలు గణితం కళా విహీనమైంది. అనువాదాలు, వ్యాఖ్యానాలు తప్ప పెద్దగా స్వతంత్ర గణిత సారస్వతం ఏదీ ఆవిష్కరణ కాలేదు. ఆ స్థితిలో మరల భారతీయ గణిత చరిత్రకు వన్నెలద్దిన వాడు శ్రీనివాస రామానుజన్‌.

ఇతడు 1887 డిశంబరు 22న శ్రీనివాస అయ్యంగార్‌, కోయల అయ్యంగార్‌ దంపతులకు మద్రాసు (తమిళనాడు) రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్‌ కుంభకోణంలో చిన్న బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్‌ పాఠశాల విద్య కుంభకోణం లోనే జరిగింది. చిన్ననాటి నుండి రామానుజన్‌ అసాధారణ తెలివితేటలు చూపేవాడు.

శ్రీనివాస రామానుజన్‌ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్‌ గణితముపై మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు.

ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ‘ఒక సంఖ్యను అదే సంఖ్యచో భాగిస్తే ఒకటి వస్తుంద’ని చెప్పినప్పుడు ‘సున్నను సున్నతో భాగించినప్పుడు ఒకటి ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించాడు రామానుజన్‌.

ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు రామానుజన్‌. ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజులలో అతడు బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, వైశ్లేషిక రేఖాగణితము మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు.

శ్రీనివాస రామానుజన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసినది కార్‌ వ్రాసిన ‘సినాప్సిస్‌’. దానిలో 6 వేలకు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలున్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాసరామానుజన్‌ తన ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు.

10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తరువాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో F.A.లో చేరాడు. కాని కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. ఒక సంవత్సరం తరువాత తిరిగి కళాశాలలో చేరినా లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు.

విద్యాభ్యాసము కుంటుపడుతున్నా రామానుజన్‌ గణిత పరిశోధనలకు ఆటంకం కలుగనీయలేదు. నెల్లూరు కలెక్టరు రామస్వామి అయ్యంగార్‌ గారికి తన నోట్‌బుక్‌ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు.

కొన్నాళ్ళ తరువాత రామానుజన్‌కు జానకితో వివాహం అయింది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సిలో చిన్న గుమాస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్‌కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డా||వాకర్‌ రామానుజన్‌కు మద్రాసు యూనివర్సిటీ నుండి రూ|| 75/- పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు.

మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్‌. హార్దికి రామానుజన్‌ స్వయంగా, తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం వ్రాశాడు. అది చూసి ప్రొఫెసర్‌ హార్డి రామానుజన్‌ను కేంబ్రిడ్డికి ఆహ్వానించారు. రామానుజన్‌ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయాడు హార్డి. 1914 మార్చి 17న రామానుజన్‌ మద్రాసు నుండి షిప్‌లో బయలుదేరి, 20 రోజుల ప్రయాణం తరువాత ఏప్రిల్‌ 7న లండన్‌ చేరాడు.

లండన్‌లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటి కాలేజిలో ప్రవేశించి, 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా రామానుజన్‌ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు రామానుజన్‌.

srinivasaశుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి (Theory of Numbers) చెందినవి. 1918లో రాయల్‌ సోసైటీ ఆఫ్‌ ఇంగ్లాండు శ్రీనివాస రామానుజన్‌కు అత్యంత ప్రతిష్టాకరమైన ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సోసైటి” బిరుదునిచ్చి గౌరవించింది. 1918 లో రామానుజన్‌ కేంబ్రిడ్జి ట్రినిటి కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు.

శ్రీనివాస రామానుజన్‌ సంఖ్య 1729 అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆచార్య హర్డీ టాక్సీ నెంబరు 1729. రామానుజన్‌ అనారోగ్యంగా వున్నప్పుడు పరామర్శించడానికి వెళ్లిన కారు నెంబరు. శ్రీనివాస రామానుజన్‌ 1729 యొక్క ప్రాముఖ్యత హార్డీకి వివరించారు. దానిని రెండు ఘనాల మొత్తమని చెప్పారు. దానిని రెండు రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్‌. 1729=10³+9³=12³+1³. రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼గా చెప్పారు.

2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్దాలు రామానుజన్‌ రాశారు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్‌ యిచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. రామానుజన్‌ ”సమున్నత సంయుక్త సంఖ్య” అనే భావనను ప్రవేశపెట్టారు. రామానుజన్‌ ప్రతిపాదించిన ‘మాక్‌ తీటా ఫంక్షన్స్‌’ ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. 1903-1910 సంవత్సరాల మధ్య కాలంలో రామానుజన్‌ కనుగొన్న తరువాత రోగర్‌-రామానుజన్‌ సర్వ సమీకరణంగా పేరుపొందింది. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్టవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు. రామానుజన్‌ 3⇒√9⇒√1+2×4…..⇒…  మ్యాజిక్‌ స్వ్కేర్స్‌, కంటిన్యూస్‌ ఫ్రాక్షన్స్‌, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్‌ ఇంటిగ్రల్స్‌పై చాల పరిశోధనలు చేశారు.

వీటిని చిన్నసైజు కాగితాలపై రాసి, ప్రొఫెసర్‌ వి.రామస్వామికి చూపారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజులలో రామానుజన్‌ మాక్‌-తీటా ఫంక్షన్ల్‌పై చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. 1916లో రామానుజన్‌ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్‌ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్‌ ఉహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే.

రామానుజన్‌ మాపన సమీకరణలు ఎంత పరిమాణము వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడుతాయి. జార్జిషూ బ్రిడ్జికార్‌ రచించిన “Synopsis of Elementary Results in Pure and Applied Mathematics” అనే గ్రంథాన్ని సంపాదించి 6000 సమస్యలు సాధించారు రామానుజన్‌. ఈ ప్రతిభ శ్రీనివాస రామానుజన్‌కు మాత్రమే దక్కుతుంది. శ్రీనివాస రామానుజన్‌ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖలికిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి మూడు నోటు పుస్తకాలలో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్‌ ”ఫ్రేయడ్‌ నోట్‌ బుక్స్‌” అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటి” బిరుదు రామానుజన్‌ను వరించింది. రామానుజన్‌ చివరలో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనాచార్య పదవి స్వీకరించారు.

గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్‌ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్‌ 1920న స్వర్గస్తులయ్యారు.

శ్రీనివాస రామానుజన్‌లో అసాధరణంగా దాగియున్న అంతర్‌దృష్టి, అతణ్ణి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఏ గణిత సూత్రాన్ని నిరూపణలు లేకుండా ఆయన ఆవిష్కరించలేదు.

గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్‌ థీరమ్స్‌ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్‌ పేర తపాల బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిశంబర్‌ 22 వ తేదీని జాతీయ గణిత దినోత్సవముగా నిర్ణయించింది.భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

డిసెంబర్‌ 22 జాతీయ గణిత దినోత్సవ ప్రత్యేకం

శ్రీనివాస రామానుజన్‌..

భారతదేశ ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు.

నిజానికి గణితశాస్త్ర చరిత్ర భారతదేశంలో వేదకాలం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రాచీన భారతీయులు గణితంలో ఎన్నో విషయాలు కనుగొన్నారు. సంఖ్యలను కనుగొనడంలో చాల కృషి చేశారు. దశాంశ పద్ధతిని గుర్తించిన మొదటివారు భారతీయులే.

భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలంలో స్వర్ణయుగం నుండి భాస్కరాచార్యుని వరకు ఆప్రతిహతంగా సాగింది. భాస్కరాచార్యుని తరువాతి కాలంలో బహుళ విదేశీ దండయాత్రల వలన కాబోలు గణితం కళా విహీనమైంది. అనువాదాలు, వ్యాఖ్యానాలు తప్ప పెద్దగా స్వతంత్ర గణిత సారస్వతం ఏదీ ఆవిష్కరణ కాలేదు. ఆ స్థితిలో మరల భారతీయ గణిత చరిత్రకు వన్నెలద్దిన వాడు శ్రీనివాస రామానుజన్‌.

ఇతడు 1887 డిశంబరు 22న శ్రీనివాస అయ్యంగార్‌, కోయల అయ్యంగార్‌ దంపతులకు మద్రాసు (తమిళనాడు) రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్‌ కుంభకోణంలో చిన్న బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్‌ పాఠశాల విద్య కుంభకోణం లోనే జరిగింది. చిన్ననాటి నుండి రామానుజన్‌ అసాధారణ తెలివితేటలు చూపేవాడు.

శ్రీనివాస రామానుజన్‌ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్‌ గణితముపై మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు.

ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ‘ఒక సంఖ్యను అదే సంఖ్యచో భాగిస్తే ఒకటి వస్తుంద’ని చెప్పినప్పుడు ‘సున్నను సున్నతో భాగించినప్పుడు ఒకటి ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించాడు రామానుజన్‌.

ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు రామానుజన్‌. ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజులలో అతడు బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, వైశ్లేషిక రేఖాగణితము మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు.

శ్రీనివాస రామానుజన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసినది కార్‌ వ్రాసిన ‘సినాప్సిస్‌’. దానిలో 6 వేలకు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలున్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాసరామానుజన్‌ తన ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు.

10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తరువాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో F.A.లో చేరాడు. కాని కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. ఒక సంవత్సరం తరువాత తిరిగి కళాశాలలో చేరినా లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు.

విద్యాభ్యాసము కుంటుపడుతున్నా రామానుజన్‌ గణిత పరిశోధనలకు ఆటంకం కలుగనీయలేదు. నెల్లూరు కలెక్టరు రామస్వామి అయ్యంగార్‌ గారికి తన నోట్‌బుక్‌ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు.

కొన్నాళ్ళ తరువాత రామానుజన్‌కు జానకితో వివాహం అయింది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సిలో చిన్న గుమాస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్‌కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డా||వాకర్‌ రామానుజన్‌కు మద్రాసు యూనివర్సిటీ నుండి రూ|| 75/- పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు.

మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్‌. హార్దికి రామానుజన్‌ స్వయంగా, తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం వ్రాశాడు. అది చూసి ప్రొఫెసర్‌ హార్డి రామానుజన్‌ను కేంబ్రిడ్డికి ఆహ్వానించారు. రామానుజన్‌ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయాడు హార్డి. 1914 మార్చి 17న రామానుజన్‌ మద్రాసు నుండి షిప్‌లో బయలుదేరి, 20 రోజుల ప్రయాణం తరువాత ఏప్రిల్‌ 7న లండన్‌ చేరాడు.

లండన్‌లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటి కాలేజిలో ప్రవేశించి, 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా రామానుజన్‌ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు రామానుజన్‌.

srinivasaశుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి (Theory of Numbers) చెందినవి. 1918లో రాయల్‌ సోసైటీ ఆఫ్‌ ఇంగ్లాండు శ్రీనివాస రామానుజన్‌కు అత్యంత ప్రతిష్టాకరమైన ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సోసైటి” బిరుదునిచ్చి గౌరవించింది. 1918 లో రామానుజన్‌ కేంబ్రిడ్జి ట్రినిటి కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు.

శ్రీనివాస రామానుజన్‌ సంఖ్య 1729 అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆచార్య హర్డీ టాక్సీ నెంబరు 1729. రామానుజన్‌ అనారోగ్యంగా వున్నప్పుడు పరామర్శించడానికి వెళ్లిన కారు నెంబరు. శ్రీనివాస రామానుజన్‌ 1729 యొక్క ప్రాముఖ్యత హార్డీకి వివరించారు. దానిని రెండు ఘనాల మొత్తమని చెప్పారు. దానిని రెండు రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్‌. 1729=10³+9³=12³+1³. రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼గా చెప్పారు.

2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్దాలు రామానుజన్‌ రాశారు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్‌ యిచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. రామానుజన్‌ ”సమున్నత సంయుక్త సంఖ్య” అనే భావనను ప్రవేశపెట్టారు. రామానుజన్‌ ప్రతిపాదించిన ‘మాక్‌ తీటా ఫంక్షన్స్‌’ ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. 1903-1910 సంవత్సరాల మధ్య కాలంలో రామానుజన్‌ కనుగొన్న తరువాత రోగర్‌-రామానుజన్‌ సర్వ సమీకరణంగా పేరుపొందింది. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్టవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు. రామానుజన్‌ 3⇒√9⇒√1+2×4…..⇒…  మ్యాజిక్‌ స్వ్కేర్స్‌, కంటిన్యూస్‌ ఫ్రాక్షన్స్‌, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్‌ ఇంటిగ్రల్స్‌పై చాల పరిశోధనలు చేశారు.

వీటిని చిన్నసైజు కాగితాలపై రాసి, ప్రొఫెసర్‌ వి.రామస్వామికి చూపారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజులలో రామానుజన్‌ మాక్‌-తీటా ఫంక్షన్ల్‌పై చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. 1916లో రామానుజన్‌ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్‌ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్‌ ఉహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే.

రామానుజన్‌ మాపన సమీకరణలు ఎంత పరిమాణము వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడుతాయి. జార్జిషూ బ్రిడ్జికార్‌ రచించిన “Synopsis of Elementary Results in Pure and Applied Mathematics” అనే గ్రంథాన్ని సంపాదించి 6000 సమస్యలు సాధించారు రామానుజన్‌. ఈ ప్రతిభ శ్రీనివాస రామానుజన్‌కు మాత్రమే దక్కుతుంది. శ్రీనివాస రామానుజన్‌ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖలికిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి మూడు నోటు పుస్తకాలలో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్‌ ”ఫ్రేయడ్‌ నోట్‌ బుక్స్‌” అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటి” బిరుదు రామానుజన్‌ను వరించింది. రామానుజన్‌ చివరలో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనాచార్య పదవి స్వీకరించారు.

గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్‌ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్‌ 1920న స్వర్గస్తులయ్యారు.

శ్రీనివాస రామానుజన్‌లో అసాధరణంగా దాగియున్న అంతర్‌దృష్టి, అతణ్ణి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఏ గణిత సూత్రాన్ని నిరూపణలు లేకుండా ఆయన ఆవిష్కరించలేదు.

గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్‌ థీరమ్స్‌ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్‌ పేర తపాల బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిశంబర్‌ 22 వ తేదీని జాతీయ గణిత దినోత్సవముగా నిర్ణయించింది.

Thursday, 21 December 2017

విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక

హిందూ శాస్త్ర విజ్ఞానం
*********************
విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక
గెలాక్టిక్ సెంటర్
విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలుఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మన సౌరకుటుంబం ఉన్నది పాలపుంత అనబడే ఒకగెలాక్సీలో అని మనకు తెలుసు. ఈ పాలపుంతలో మనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కేలేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈపాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేది ఊహించనలవి గాని శక్తికి కేంద్రం. అది ప్రస్తుతం ధనూరాశిలో ఉంది. ఈ ధనూ రాశిలోనే గేలాక్టిక్సెంటర్ దగ్గరగా మూలా నక్షత్రం ఉంది. ఈప్రాంతంలో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉన్నదని సైన్సు అంచనా వేసింది. ఆ బ్లాక్ హోల్ ఒక పెద్ద నక్షత్రంసైజులో ఉండి, కొన్ని మిలియన్ల సూర్యులసాంద్రతను కలిగి ఉంది. ఇది ఊహించ నలవి గానంత రేడియో తరంగాలనువేదజల్లగల శక్తిని కలిగి ఉంది. మన సూర్యునినుంచి ఇది దాదాపు 30,000 కాంతి సంవత్సరాలదూరంలో ఉంది. మన సూర్యుడు తన సౌరమండలగ్రహాలతో సహా ఈ గెలాక్టిక్ సెంటర్ చుట్టూతా 200మిలియన్ సంవత్సరాలలో ఒకసారి ప్రదక్షిణంచేస్తాడు. దీనికోసం ఆయన శూన్యంలో సెకనుకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకొక విచిత్రం ఏమిటంటే- ఈ విష్ణు నాభి అనేప్రాంతం ఒక ఎక్కుపెట్టబడిన విల్లువంటి ఆకారంలో,ధనుస్సులాగా ఉండి ధనూ రాశి అనే పేరుకు సరిగ్గాసరిపోతూ ఉంటుంది.
విష్ణు నాభి
మన పురాణాలు విశ్వం మొత్తాన్నీ విష్ణుస్వరూపంగా వర్ణించాయి. విశ్వం విష్ణు: అంటూ విష్ణు సహస్ర నామం కూడా చెప్పింది. విష్ణునాబి నుంచి ఉద్భవించిన కమలంలో సృష్టి మూలమైన బ్రహ్మ జననం జరిగిందని పురాణాలుచెప్పాయి. మన గెలాక్సీకి కేంద్ర స్థానం అయిన ఈసెంటర్ ను మన భాషలో నాభి అనవచ్చు. నాభి అనగా కుదురు, కేంద్రం అని అర్ధాలున్నాయి. అంటే విష్ణునాభి అయిన గెలాక్టిక్ సెంటర్ సృష్టికి మూలం అవడానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.
ఇక్కడే ఉన్నటువంటి "మూలా" నక్షత్రమండలం ఈ ఊహకు ఆధారాన్ని కలిగిస్తున్నది. ఇందులో చాలా రహస్యాలు దాగి ఉన్నవి. సృష్టి మూలమైన మహాశక్తి ఇక్కడే ఉన్నదని మనకు సూచన ప్రాయంగాతెలుస్తున్నది. ఇదే ప్రాంతంలో ఉన్నదని సైన్స్ఊహిస్తున్న బ్లాక్ హోల్ ఆ శక్తి స్వరూపం కావచ్చునా? ఈ విషయం పురాణాలు వ్రాసిన మహర్షులకు ఎలా తెలిసి ఉండవచ్చొ, ఈనాడు రేడియో టెలిస్కోపులకు కూడా లీలగా మాత్రమే అందుతున్న ఈ రాశికి వాళ్ళు ఆనాడే కళ్లతోచూచినట్లు "ధనూరాశి" అని ఎలా నామకరణంచేశారో, అందులో బ్లాక్ హోల్ సమీపంలోనినక్షత్రానికి "మూలా నక్షత్ర మండలం" అని ఎలాపేరు పెట్టారో మన ఊహకు అందదు.
రాహుకేతువులు- సృష్టి క్రమం- ఒక అంతుబట్టనిరహస్యం
ధనూ రాశి బాణం ఎక్కుపెట్టిన ఒక విలుకాని రూపంలో ఉంటుంది. ఆ బాణం సరాసరి ఎదురుగాఉన్న మిధున రాశి వైపు గురి పెట్టి ఉంటుంది. ఈవిధంగా ధనూ రాశి నుంచి మిధున రాశి వరకు ఒకగీత గీస్తే, అది జ్యోతిశ్చక్రాన్ని రెండుగా విభజిస్తుంది. మిధున రాశిలో రాహువుదైన ఆర్ద్రా నక్షత్రం ఉన్నది. ధనూ రాశిలో కేతువుదైన మూలా నక్షత్రం ఉన్నది. మిధున రాశి జంట మిధునానికి సూచిక. అనగా స్త్రీపురుషులు జంటగా ఉన్న బొమ్మ ఈ రాశినిసూచిస్తుంది.
దీన్ని బట్టి ఏం అర్ధం అవుతున్నది? మూలానక్షత్రం ఉన్న ధనూ రాశి నుంచి స్త్రీ పురుషుల సృష్టిజరిగడానికి అవసరమైన శక్తి ప్రసారం మిధున రాశివైపు జరుగుతున్నది అని తెలుస్తున్నది. అంటే ప్రధమంగా విశ్వంలో జీవావిర్భావానికి మూలం అయిన శక్తి ప్రసారం ధనూ రాశిలో ఉన్న మూలా నక్షత్ర ప్రాంతం నుంచి మిధున రాశి వైపుగా జరిగిఉండవచ్చు.
ఇక్కడే ఇంకొక విచిత్రం ఉన్నది. ఈ నాటికీ శిశుజననం జరిగినప్పుడు బొడ్డు కోయడం జరుగుతుంది. గర్భస్ఘ శిశువుకు బొడ్డు ( నాభి) ద్వారానే తల్లి నుంచి పోషణ అందుతుంది. అలాగే విశ్వం మొత్తానికీ శక్తిప్రసారం విశ్వ నాభి అయిన గెలాక్టిక్ సెంటర్లో ఉన్నమూలా నక్షత్రం నుంచి జరుగుతూ ఉండవచ్చు. ఆశక్తి కేంద్రంతో బంధం తెగిన మరుక్షణం జీవి మాయామోహాలకు లోబడి మానవ జన్మలోకి ఆడుగు పెట్టటం జరుగుతుండవచ్చు.
శిశు జననానికి పట్టే తొమ్మిది నెలలు-ఇంకో రహస్యం
శిశు జననానికి తొమ్మిది నెలలు పడుతుంది. అలాగే రాశి చక్రంలో ధనూ రాశి తొమ్మిదవది. అంటేమేష రాశిలో తలతో మొదలైన శిశువు రూపంతొమ్మిది నెలలు నిండిన తరువాత ధనూరాశి చివరలో ఈ భూమ్మీదకు వస్తున్నది. తొమ్మిదిరాశులను అధిగమించి, పదవ రాశి మరియు కర్మస్థానం అయిన మకర రాశిలోకి అడుగు పెడుతూ మకరం వలె పాకుతూ ఈ కర్మల లోకంలోకి ఆడుగుపెడుతున్నది.
మూడో నెలలో పిండంలోనికి ఆత్మ ప్రవేశంజరుగుతుందని యోగవిదులు చెబుతారు. మూడోనెలలో పిండం ఆడో మగో స్ఫుటంగా తెలుస్తుంది.అందుకనేనేమో, మూడవ రాశి అయిన మిధునంయొక్క గుర్తు- స్త్రీ, పురుషులుగా ఉంటుంది. అంటే లింగ నిర్ధారణ ఆ సమయంలో జరుగుతుంది అనిరహస్య సంకేతంగా సూచితం అవుతున్నది
మూడో రాశి అయిన మిధునం లో ఉన్నపుడు,మూడవ నెలలో, దానికి సూటిగా ఎదురుగా ఉన్న ధనూ రాశినుంచి, బాణం లాగా ఆత్మ వచ్చి

విద్యుత్ అగస్త్యమహర్షి

విద్యుత్ ను గురించి
అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలు ఇప్పుడు లభిస్తున్నాయి. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
“సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్మృతమ్I
ఛాదయే ఛ్ఛిఖిగ్రీవేన చార్థ్రాభిః కాష్ఠపాంసుభిఃII
దస్తాలోప్టో నిథాతవ్యః పారదాఛ్ఛాది దస్తతఃI
సంయోగా జ్ఞాయతే తేజో మిత్రావరుణ సజ్ఞ్గితమ్II”
దీని భావం - ఒక మట్టి కుండను తీసుకుని దానిలో రాగి పలక పెట్టాలి. తరువాత దానిలో మైలు తుత్తం వేయాలి. తర్వాత మద్యలో తడిసిన ఱంపపు పొట్టువేయాలి. పైన పాదరసము మరియు యశదము (జింక్) వేయాలి తర్వాత తీగలను కలపాలి అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి ఉద్భవిస్తుంది.
మరో శ్లోకం చూడండి
“అనేన జలభంగోస్తి ప్రాణోదానేషు వాయుషుI
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతఃII
వాయు బంధక వస్త్రేణ నిబద్దో యానమస్తకేI
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్II”
దీని భావం - ఒక వంద కుండల యెక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే, నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు, ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
1. తడిత్ – పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2. సౌదామిని – రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3. విద్యుత్ – మేఘముల ద్వారా పుట్టునది.
4. శతకుంభి – వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5. హృదని – స్టోర్ చేయబడిన విద్యుత్తు.
6. అశని – కర్రల రాపిడి నుండి పుట్టునది.
ఇంత వివరంగా ఇచ్చిన సమాచారం ఉంటే కొందరు ఆంగ్లమానస పుత్రులు అన్నీ మన శాస్త్రాలలో ఉన్నాయిష అని వ్యంగ్యంగా అంటూఉంటారు. వీరి కళ్ళకున్న ఇంగ్లీషు కళ్ళజోడు, ఎర్ర కళ్ళద్దాలు తొలిగిస్తే కనబడతాయి. ఆంగ్లేయులు వ్రాసిన చరిత్ర చదువుతారు. భారత దేశం మీద ప్రేమ ఎక్కువ ఉంటే అంటూ సలహాఇస్తారు. సంస్కృతం రాదు. చదవడానికి, వెదకడానికి వీరికి సమయం దొరకదు, ఎవరో చేప్పిన ఎంగిలి మాటలు నాలుగు పట్టుకుని మనని, మన శాస్త్రాలను విమర్శిస్తు తిరుగుతుంటారు. వారు అభ్యుదయభావాలు కల వారిగా ఊహాలోకాల్లో ఉంటారు. అటువంటి వారికి మనం చెప్పేదేమీలేదు.

మయాన్‌ మూలాలు మనవే

మయాన్‌ మూలాలు మనవే..!
సనాతన ధర్మం.. దాని మూలాల సమస్తవిశ్వమంతా విస్తరించానేది వాదన కాదు.. నిర్హేతుక వాస్తవం. ఇందుకు ఎన్నో ఉదాహరణలు.. నిదర్శనాలు తాజాగా కనిపిస్తున్నాయి. సముద్రగర్భంలోని ఇండియన్‌ ప్లేట్‌ కదలికల ఆధారంగా దక్షిణ భారతం నుంచి ప్రస్తుతం కొన్ని దేశాలు విడిపోయాయి. ఇందుకు సముద్ర గర్భంలో కలిసిపోయిన కుమారి కాండం.. ఈ మధ్యే మడగాస్కర్‌ దగ్గర కనుగొనడం విశేషం.
దక్షిణ అమెరికా పిరమిడ్లు, మయాన్‌ నాగరికత ఇంచుమించుగా చాలా దగ్గరగా ఉంటాయి. ఈజిఫ్షియన్లు మిగిలిన వారికి ప్రేరణగా నిలిచారని చెప్పవచ్చు. ఇదే నేపథ్యంలో ఈజిఫ్షియన్లు పూర్వ దక్షిణ భారత దేశానికి చెందినవారని చెప్పాలి. ఈజిఫ్షియన్లుకు సనాతన ధర్మం, పూర్వ దక్షిణ భారతంలో అనేక అంశాల మధ్య సారూపత్యలు ఉన్నాయి.
సోమ-వంగ వంశంలో మొదటి చక్రవర్తి అయిన విశ్వామిత్రడు.. మను-వినా చక్రవర్తుల మధ్య జరిగిన యుద్ధం.. అనంతర పరిణామాలతో బ్రాహ్మణులను ప్రస్తుత ఈజిఫ్టు రాజధాని కైరో (అప్పట్లో మార్సా అని పిలిచేవారు) వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ''కాలుక్క-భట్టా'' రచించిన భారత చరిత్రలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈజిఫ్షియన్‌ మొదటి చక్రవర్తి చక్రవర్తిగా మను-వినా వ్యవరించారని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ప్రాంతాలు.. ఆధారాలు
ఇప్పుడు చారిత్రక నగరాలుగా ఉన్న అనేక పట్టణాల పేర్లను పరిశీలిస్తే.. ఆర్యా.. ప్రస్తుతం ఇరాన్‌ అని పిలుస్తున్నాం. గతంలో పర్షియా అని పిలిచేవాళ్లం. ఇక బారియాను సౌదీ అరేబియా అని, మార్సాను కైరో అని, మసుర్‌, మిసుర్‌లను మిస్రో అని పిలుస్తున్నాం. ఇక ఈజిఫ్టు చరిత్ర, న్యాయచట్టాలు, సామాజిక కట్టుబాట్లు, కళలు, సాహిత్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని పరిశీలిస్తే.. అవన్నీ భారతదేశంలో విలసిల్లిన పూర్వ వేదకాలం నాటివేనన్న విషయం అవగతం అవుతుంది. ఈజిఫ్టుకు చెందిన రెండో సబ్‌ రాస్‌ (పూర్వ ఈజిఫ్టు 5.2)లో భారతదేశంలోని ఆచార వ్యవహారాలకు దగ్గర సంబంధాలున్నట్లు ఉంటుంది.
ఆచారాలు - వ్యవహారాలు
మయాన్‌ నాగరికత విషయానికి వస్తే వారు పాటించే ఆచార వ్యవహారాలు, కర్మ సిద్ధాంతంపై నమ్మకాలు.. విశ్వాసాలు అన్నీ భారతదేశానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇదే భారతదేశంలోని పూర్వ వేద కాలానికి మయాన్‌ పూర్వీకులకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తోంది. ఇక మయాన్ల గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది. భౌగోలిక పరిస్థితులు, భూ కదలికల వల్ల వీరు భారత ఉప ఖండం నుంచి వేరు పడ్డారు. ఇక రామాయణంలో సైతం నాగ-మయా గిరిజనుల గురించి ప్రస్తావన ఉంది. నాగులను సనాతన ధర్మంలో దేవుళ్లుగా కొలుస్తారు. బాబిలోనియా సంస్కృతి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
నాగుపాములు -- సంబంధం
'నాగ' అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. నాగ అంటే విషం ఉన్నది పాము అని అర్థం. ఇక విషయానికి వస్తే నాగుపామును శివపార్వుతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామిగా అరాధిస్తాం.. అదే విధంగా మయాన్లు సైతం కుకుల్కోన్‌ దేవుడుగా పూజిస్తారు. పూర్వ వేదకాలంలో భారతదేశం నాలుగు ప్రధాన భాగాలుగా విడిపోయింది. సింధూనదీ పరివాహక ప్రాంతంలో నివసించే వారిని అసురులు.. నాగులు, యక్షులు (కుబేరుడు, ఇతరులు), మయాలు. వీరినే ఇప్పుడు ద్రావిడులు అంటున్నారు. మయాలు అత్యంత ధైర్య వంతులు, మూఢనమ్మకాలను బలీయంగా విశ్వసించేవారు. పూర్వవేదకాలంలోనే అంతర్జాతీయస్థాయిలో నౌకా వ్యాపారాన్ని నిర్వహించేవారు. నౌకలను నిర్మించడంలోనూ వీరికి వీరే సాటి. ఈ నౌకల్లోనే కుబేరుడు వంటి యక్షులు ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవారు. రావణలంకగా పేరొందిన సనుకేని (ప్రస్తుతం శ్రీలంక) దక్షిణ భారతదేశంతో కలిసిపోయి ఉండేది.
గ్రహాలు.. కాలగణన
సింధూ నాగరికులు బృహస్పతి గ్రహ కదలికల ఆధారంగా కాలగణన చేసేవారు. అదే మయాన్లు శుక్రగ్రహ గమనాన్ని కాలగణనకు తీసుకున్నారు. ఇక్కడే ఒక విషయాన్ని మనం గుర్తు చేసేకోవాలి.. దేవతలకు బృహస్పతి గురువు అయితే.. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. దేవ రాక్షస గణాల మధ్య జరిగిన యుద్ధాలను గుర్తు చేసుకోవాలి. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లోని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బీజీ సిద్ధార్థ్‌ విశ్లేషించారు. భారత్‌ - మెక్సికోలు ఒకే అక్షాంశంపై వ్యతిరేక దిశలో ఉంటాయి. హిందువుల చరిత్ర.. సముద్ర అంతర్భాగాల్లో నిక్షిప్తమై ఉంది. ఈ మధ్యే మెక్సికో సముద్ర తీరంలో హిందువుల శిల్పాలు వెలుగు చూశాయి. మయాన్ల దేవతగా కొలిచే తాబేలుపై ఉండే 12 స్థంభాలు భారతీయ శిల్ప కళకు సాక్ష్యంగా నిలుస్తుందని డాక్టర్‌ గణపతి స్థపతి పేర్కొన్నారు. మయాన్‌ శిల్ప కళను చూసిన పరిశీలిస్తే.. వారు పూర్వకాలంలో హిందువులే అన్న విషయం స్పష్టమవుతుందని గణపతి స్థపతి పేర్కొన్నారు

Tuesday, 19 December 2017

అష్ఫాకుల్లా ఖాన్

👤👏🏻➖➖➖➖➖➖➖➖➖
*భారతీయ స్వంతంత్ర సమరయోధుడు. "అష్ఫాకుల్లా ఖాన్" వర్ధంతి నేడు..*✍
➖➖➖➖➖➖➖➖🌸🌸🍃
*☆"నామాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలను కున్నాను. నా త్యాగం వృథా కాదు.*
*మరెందరో త్యాగధను లకు స్ఫూర్తినిస్తుంది. నా హిందూస్థాన్ స్వేచ్ఛా వాయు వులు పీలుస్తుంది. చాలా త్వరగా బానిస సంకెళ్ళు తెగి పోతాయి. దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికం బాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతు న్నాను" అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడు ను ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు.*

*¤"నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతాలవారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐక్యమ త్యం తో ఆంగ్లేయుల ను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావాలి"*--

*¤ అష్ఫాఖుల్లా ఖాన్ భారతమాత స్వేచ్ఛ కోసం సర్దార్ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల కంటే నాలుగు సంవత్స రాల ముందే ఉరిశిక్షపడిన దేశభక్తుడు అష్ఫాఖుల్లా ఖాన్.*

*🍄సహాయనిరాకరణోద్యమము..*

*¤ మహాత్మాగాంధీ, చౌరీ చౌరాఉదంతం తర్వాత సహాయనిరా కరణోద్యమ ము నిలిపివేయడము తో అనేకమంది  భారతీయ యువకులు నిరాశ చెందారు. అలాంటి యువకులలో అష్ఫాక్ ఒకడు. ఈయన భారతదేశాన్ని వీలయినంత త్వరగా పరాయి పాలన నుండి విముక్తము చేయాలన్న తపనతో, అతివాద ఉద్యమకారులతో చేరాడు. ఈ సమయములోనే ఈయనకు షాజహాన్‌ పూర్ కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్ తో పరిచయమేర్పడింది.*

*🍄రాంప్రసాద్ బిస్మిల్ తో స్నేహము..*

*¤ హిందూ మతము యొక్క గొప్పతనము గురించి ఇతర మతస్థులకు బోధించడానికి వెనుకాడని ఆర్య సమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్ తో సాంప్రదాయ ముస్లిం మతస్థుడైన అష్ఫాకుల్లా ఖాన్ యొక్క స్నేహము కొంత విభిన్నమైనదే. అయినా వారిద్దరి సమష్టి లక్ష్యము ఒకటే, భారత స్వాతంత్ర్యము. దీనితో ఇద్దరు మంచి మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకే రోజు, కాకపోతే వేర్వేరు జైళ్లలో భారతదేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణాలు అర్పించారు*

*🍄కాకోరీ రైలు దోపిడి..*

*¤ తమ సాయుధ ఉద్యమానికి ఊపునివ్వ డానికి, సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు  మరియు మందు గుండు సామగ్రి కొనుగోలు చేయడానికి ఉద్యమకారులు  1925, ఆగష్టు 8 న షాజహాన్‌పూర్లో ఒక సభను నిర్వహించారు. చాలా తర్జనబర్జన ల తర్వాత ఆ సభలో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ కోశాగారాన్ని దోచుకోవాలని నిర్ణయించారు. ఆగష్టు 9న అష్ఫాకుల్లా ఖాన్ మరియు రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షీ, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్ మరియు మన్మధనాథ్ గుప్తలు కలిసి కాకోరీ గ్రామము వద్ద ప్రభుత్వ ధనమును తీసుకెళుతున్న రైలును దోచుకున్నారు.*

*¤ సెప్టెంబర్ 26, 1925 ఉదయాన పొలీసులు రాంప్రసాద్ బిస్మిల్ ను పట్టు కున్నారు. అష్ఫాక్ మాత్రము పోలీసులకు దొరకలేదు. ఆయన అజ్ఞాత ములో బీహార్ నుండి బనారస్ కు వెళ్లి అక్కడ 10 నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. అజ్ఞాతములో మరెంతో కాలము ఉండలేక దేశానికి ఉపయోగపడు తుందని విదేశాలకు వెళ్లి ఇంజనీరిం గు చదవాలని నిశ్చయించి, దేశాన్ని వదిలి వెల్లడానికి మార్గాలు అన్వేషిస్తూ  ఢిల్లీ చేరాడు. అక్కడ ఒక పఠాన్ స్నేహితున్ని ఆశ్రయించా డు. కానీ అదే స్నేహితుడు అష్ఫాక్ ను వెన్నుపోటు పొడిచి పోలీసుల కు ఆయన జాడ తెలియజేసాడు "*

*¤ అష్ఫాకుల్లా ఖాన్‌ను  ఫైజాబాద్  జైల్లో బంధించి కేసు నమోదు చేశారు. అష్ఫాక్ పెద్దన్న రియాసతుల్లా ఖాన్ చివరి వరకు అష్ఫాక్ తరఫు న్యాయవాదిగా వాదించాడు. జైలులో ఉండగా ఈయన ఖురాన్ పఠనము చేసేవాడు. కాకోరీ దోపిడి కేసు రాంప్రసాద్ బిస్మిల్, అస్ఫా కుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి మరియు రోషన్ లకు మరణ శిక్ష్, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించడముతో ముగిసినది.*

*🍄మరణము..*

*¤ అష్ఫాకుల్లా ఖాన్ ను 1927, డిసెంబర్ 19 న ఉరితీశారు. షాజహాన్‌పూర్ లోని ఈయన సమాధి ఇప్పుడు ఒక స్మారక స్థలమైనది. కొందరు చరిత్రకారులు అష్ఫాకుల్లా ఖానే రాజద్రోహ నేరముపై ఉరితీయబడిన తొలి ముస్లిం అని భావిస్తారు.*

*¤ ఈయన దేశానికి తన చివరి సందేశములో "నా దేశ స్వాతంత్రం కోసం ఉరికంభమెక్కిన ప్రప్రధమ ముస్లింనైనందుకు నేను గర్వపడు తున్నాను" అని రాశాడు.*

 *¤ "ఓ నా మాతృదేశమా సదా నీకు సేవ చేస్తూనే వుంటాను ఉరిశిక్ష పడినా,జన్మఖైదు విధించినా, బేడీల దరువుతో నీనామ స్మరణ చేస్తూనే వుంటాను" అష్ఫాకుల్లా ఖాన్ (ఉరి వేదిక మీద నుండి)*

*🍄మీడియా చిత్రీకరణ.*

*¤ అష్ఫాకుల్లా ఖాన్ మరియు ఈయన సహచరులు చేసిన పనులను 2006లో విడుదలైన రంగ్‌దే బసంతీ అను హిందీ సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రములో అష్ఫాకుల్లా ఖాన్ పాత్రను కునాల్ కపూర్ పోషించాడు.*

🌐సేకరణ:సురేష్ కట్టా నెల్లూర్ సోషల్ టీచర్
          🍃🌸🤗🌸🍃

Monday, 18 December 2017

పురాణాల్లో సైన్స్

పురాణాల్లో సైన్స్
                                                           రచన: పోలిశెట్టి బ్రదర్స్

34. మన ప్రాచీన అణువిజ్ఞానం :

సృష్టిలో ఉన్నవి రెండే రెండు.

                1. శక్తి

                2. పదార్థము

        ' శక్తి ' విషయం కాస్త ప్రక్కకు పెట్టి, ఇప్పుడు ' పదార్థం ' సంగతి చూద్దాం.

        ' పదార్థం ' రెండు రకాలు.

                1. జీవ పదార్థం

                2. జడపదార్థం (అనగా జీవం లేనిది).

        ఏది ఏమైనా, మొత్తం పదార్థాలన్నీ మాత్రం పరమాణువుల మయం. ఒక పదార్థాన్ని బాగా చిన్నభాగంగా విభజించుకుంటూ పోతే, చివరకు అది కంటికి కనిపించనంత సూక్ష్మరేణువుగా మిగులుతుంది. అదే ఆ పదార్థానికి చెందిన ' పరమాణువు '. కోట్లకొలదీ పరమాణువులు కూడడం వల్ల పదార్థాలు ఏర్పడుతున్నాయి. జీవులూ, నిర్జీవులూ మొత్తం అన్నీ కూడా పరమాణు నిర్మితాలే! అంటే మనుషులు, పశు పక్ష్యాదులు, సరీసృపాలు, కీటకాలు, సూక్ష్మక్రిములు, వృక్షజాతులు, పాడిపంటలు మొదలైనవే కాకుండా గాలి, అగ్ని, భూమి, నీరు ఇత్యాదులు సైతం పరమాణువులతోనే నిండివున్నాయి. చివరకు నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఏస్టరాయిడ్స్, తోకచుక్కలు మున్నగునవి కూడా పరమాణు సముదాయాలే! పరమాణువు లేనిది సృష్టి లేదని చెప్పవచ్చు.

        మనిషికీ, విశ్వానికీ, విశ్వకర్తకూ ఉన్న సంబంధ బాంధవ్యం ఎలాంటిదో తెలుసుకోవడానికి చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పురాణకాలం నుండి ఎందరో దార్శనికులు విశ్వరహస్యాల గురించి తృప్తికరమైన సమాధానాలను ఇవ్వడానికి త్రికరణశుద్ధిగా ప్రయత్నాలు చేశారు. అట్టి ప్రయత్నాలలో కొంతవరకూ సఫలీకృతులైనవారిలో "కణాద మహర్షి" ఒకరు.

కణాదుడు :

        అణువిజ్ఞానాన్ని ప్రపంచంలో ప్రప్రథమంగా గ్రంథస్థం చేసిన మహావిజ్ఞాని "కణాద మహర్షి". ఈయన అసలుపేరు "కాశ్యపుడు". కణాల (అణువుల) గురించి వివరించిన మేధావి కాబట్టి ఈయనకు "కణాదుడు" అనే పేరు వచ్చింది. అణువులు, పరమాణువుల గురించి "వైశేషిక సూత్రం" అనే గ్రంథాన్ని ఈయన రచించాడు. ఆ గ్రంథంలో ఈయన చేసిన ప్రతిపాదనలు సమగ్రవంతంగా ఇప్పటికీ ఆమోదయోగ్యమై ఉండడం ఎంతో విశేషం. ఈయన తొలిసారిగా వాడిన ' పరమాణువు ' పదం ఈనాటికీ తిరుగులేకుండా ఉంది. గ్రీకు దార్శనికులైన "లూసీప్సన్, డెమోక్రిటన్" ల సిద్ధాంతాలు, కణాదుని పరమాణు తత్త్వవిజ్ఞానం ముందు వెలవెలపోతున్నాయి.

        "పదార్థాన్ని విడగొడితే అణువులు, అణువులను విడగొడితే పరమాణువులు ఏర్పడతాయి" అని కణాదుడు స్పష్టంగా చెప్పాడు. విభిన్నమైన పరమాణువులు ఎన్నో ఉన్నాయని, వాటి విలక్షణమైన కలయిక వల్లనే భూమ్యాకాశాలు, అగ్ని, గాలి, నీరు మొదలైనవన్నీ రూపొందాయని వివరించాడు. పదార్థాలు పరమాణువుల స్థాయికి వచ్చినప్పుడు, ఆ పరమాణువులు తమ విశిష్ట లక్షణాలతో అలరారుతాయని చెప్పాడు.

        పదార్థాలుగా రూపొందేటప్పుడు రకరకాల పరమాణువులు కలియడం వల్ల వాటికి ప్రత్యేకమైన ధర్మాలు ప్రాప్తిస్తాయనే సత్యాన్ని ఈ శాస్త్రవేత్త ఆనాడే ప్రకటించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 2 పరమాణువులు కలిస్తే 'ద్వణుకం' అవుతుందనీ, 3 పరమాణువులు కలిస్తే 'త్రణుకం' అవుతుందనీ ఈయన వివరించాడు. ఈ సిద్ధాంత ప్రకారమే వైశేషిక దర్శన అనుయాయులైన శాస్త్రవేత్తలు లోహవిజ్ఞానాన్ని పరిపుష్ఠం చేశారు. సృష్టిలో పదార్థాలన్నీ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సుల కలయికతో ఏర్పడుతున్నాయని వివరించి చెప్పాడు.

        పదార్థాలన్నింటికీ మూలమైన పరమాణువులు, సృష్టి నిర్మాణములో ఆధారం అయినందున అవి నిత్యములై ఉంటాయనీ, వాటికి నాశనం లేదనీ చెప్పాడు. తన గ్రంథంలో ఆత్మ, మనస్సుల గురించి కూడా కణాదుడు వివరణ ఇచ్చాడు. మొత్తం మీద ఈయన ' పరమాణువాదము, పరమాణు నిత్యత్వ వాదము, షట్ పదార్థ వాదము, సృష్టివాదము ' మున్నగు వాదాలను ప్రతిపాదించాడు.

 "భగవద్గీత" లో కృష్ణపరమాత్మ చెప్పిన కొన్ని మాటలు పరమాణు విజ్ఞానానికి సంబంధించినవే! "అనంతమైన తన ' శక్తి ' విశ్వంలోని ప్రతి అణువునా దాగి ఉన్నదనీ, అనూహ్యమైన రూపం కల తాను అణువుకన్నా అణువుననీ" ఆయన చెప్పడం జరిగింది. అణువుల్లో, పరమాణువుల్లో ' శక్తి ' దాగివున్న విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తల కంటే ముందుగా శ్రీకృష్ణుడే చెప్పాడు. పరమాణువులను విచ్ఛిన్నం చేస్తే అందులో నుండి బ్రహ్మాండమైన శక్తి విడుదలవుతుంది. ఆటంబాంబు ప్రయోగ ప్రక్రియ ఇదే మరి! ఆటంబాంబు కనుగొనని క్రితమే, పరమాణువులో అంతటి బృహత్తరమైన (తన) శక్తి ఉన్నదని శ్రీకృష్ణుడు చెప్పడం గమనించదగిన విషయం.

        నేడు పరమాణు విజ్ఞానం అనేక విధాల వికసించి మానవాళికి సేవ చేస్తున్నది. శాస్త్రప్రయోజనం సమాజశ్రేయస్సే కావాలని నిర్దేశించిన ఎంతోమంది భారతీయ శాస్త్రవేత్తల్లో కణాదమహర్షి ఒకరు.

        ప్రళయాన్ని సైతం సృష్టించగల పరమాణువుల విషయంలో మనిషికి ఎంతైనా సంయమనం అవసరం. పరమాణు విజ్ఞానాన్ని మానవాళి అభివృద్ధికి వినియోగించాలి గాని, వినాశనానికి వాడుకోకూడదు. ఇది ప్రపంచం గుర్తించవలసిన సత్యం.